-
నిర్మాత వేణుగోపాల్ మృతి
‘నక్షత్రం’(2017) సినిమా నిర్మాతల్లో ఒకరైన ఎస్వీఎస్ వేణుగోపాల్(60) బుధవారం రాత్రి మృతిచెందారు. కాచిగూడ నుంచి మహబూబ్నగర్ వెళుతున్న రైలు నుంచి ఆయన ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందారు. సీరియల్స్ నిర్మాతగా ఆయన బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులే. ‘ఆనందో బ్రహ్మ’ (1996) సీరియల్తో నిర్మాతగా ఆయన ప్రస్థానం మొదలైంది. దాదాపు పది సీరియల్స్ నిర్మించారాయన. ‘ప్రియురాలు పిలిచె’ ఆయన తీసిన చివరి సీరియల్. ‘తులసీదళం’ సీరియల్కి నంది అవార్డు అందుకున్నారు వేణుగోపాల్. సినిమా నిర్మాతగా ‘నక్షత్రం’ ఆయన తొలి చిత్రం.. అదే చివరి చిత్రం కూడా. హీరో చిరంజీవి నటించిన తొలి టీవీ షో ‘విజయం వైపు పయణం’ కి వేణుగోపాల్ నిర్మాత. ఈ షోకి యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించారు. వేణుగోపాల్కి భార్య, ఇద్దరు కుమారులున్నారు. వేణుగోపాల్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా ‘నక్షత్రం’ సినిమా నిర్మాతల్లో ఒకరైన సజ్జు మాట్లాడుతూ ‘‘వేణుగోపాల్గారు రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్నది అవాస్తవం. ఆయనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు’’ అన్నారు. -
Babu In Jail: తొలి రోజు గడిచిందిలా..
సాక్షి, అమరావతి, సాక్షి, రాజమహేంద్రవరం: పొద్దున్నే యోగా.. కాసేపు పత్రికల పఠనం... ప్రత్యేకంగా తెప్పించిన ఆహారం... రెండు సార్లు వైద్య పరీక్షలు.. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి భద్రత నడుమ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా తొలిరోజు గడిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టై రిమాండ్ ఖైదీ 7691గా ఉన్న ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా, పూర్తి భద్రతతో కూడిన ప్రత్యేక గదిలో ఉంటున్నారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రత్యేకంగా సహాయకుడు.. వంటకు ప్యాంట్రీ కార్ న్యాయస్థానం ఆదేశాలతో జైలు అధికారులు చంద్రబాబుకు స్నేహ బ్యారక్లో ప్రత్యేక గదిని ఆదివారం రాత్రే కేటాయించారు. అందులో వెస్ట్రన్ మోడల్ టాయిలెట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు ప్రత్యేకంగా ఓ సహాయకుడిని అందుబాటులో ఉంచారు. చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో ఆయన కాన్వాయ్లో ఉండే ప్రత్యేక ప్యాంట్రీ కార్ను జైలుకు సమీపంలో ఉంచారు. నారా లోకేష్ రాజమహేంద్రవరంలోనే ఓ టీడీపీ నేత ఇంటి వద్ద మకాం వేసి చంద్రబాబుకు అవసరమైనవన్నీ సమకూరుస్తున్నారు. ఉదయం అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్తో పాటు వేడినీళ్లు, బ్లాక్ కాఫీని పంపారు. మధ్యాహ్న భోజనంలో 100 గ్రాముల బ్రౌన్ రైస్, బెండకాయ వేపుడు, పన్నీర్ కూర, పెరుగు పంపించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీ తాగేందుకు వేడినీళ్లు అందజేసినట్లు తెలిసింది. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం, మధ్యాహ్న భోజనం అనంతరం చంద్రబాబుకు రెండు సార్లు వైద్య పరీక్షలు చేశారు. ఆయన ఉంటున్న స్నేహ బ్యారక్కు ఎదురుగానే జైలుకు సంబంధించిన ఆస్పత్రి ఉండటంతో అక్కడ వైద్య పరీక్షలు చేపట్టారు. రాత్రి కూడా ప్యాంట్రీ కార్ నుంచే పుల్కాలు, పెరుగు తెప్పించి ఆహారాన్ని అందించారు. నిరంతరం 1 + 4 భద్రత జైలు అధికారులు చంద్రబాబు భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయన ఉన్న జైలు గది వద్ద 24 గంటలపాటు విధులు నిర్వహించేలా 1 + 4 భద్రతను వినియోగించారు. జైలు లోపల, చుట్టుపక్కల పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు కల్పించారు. కట్టుదిట్టమైన భద్రతతోపాటు జైలులో ఉన్న సీసీ కెమెరాల ద్వారా భద్రతను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో పూర్తిస్థాయి భద్రత నడుమ ఉన్నారు. తొలిరోజు ములాఖత్లు లేవు సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును తొలిరోజు ఎవరూ కలవలేదు. జైలు నిబంధనల ప్రకారం వారానికి రెండు ములాఖత్లను అనుమతిస్తారు. సోమవారం ములాఖత్ కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, కుమారుడు లోకేష్ మంగళవారం ఆయన్ను ములాఖత్లో కలిసేందుకు జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. -
పొడగరి.. పదో తరగతి పాసయ్యాడు!
రాజాం/సంతకవిటి : ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడిని గుర్తుపట్టారా? సంతకవిటి మండలం తలతంపర గ్రామానికి చెందిన ఇజ్జాడ షణ్ముఖరావు. వయసు 19 ఏళ్లు. హార్మోణుల ప్రభావం కారణంగా ఎనిమిది అడుగుల ఎత్తు పెరిగాడు. చిన్న వయసులో పాఠశాలకు వెళ్లి చదువుకునే విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో స్వస్తి చెప్పాడు. ఉపాధి అవకాశాలు లేక.. స్థానికంగా పనులు దొరక్క అగచాట్లు పడుతుండేవాడు. అయితే ఈ యువకుడి అసాధారణంగా పొడవు పెరగడంపై ఏడాదిన్నర క్రితం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు షణ్ముఖరావు వివరాలు సేకరించారు. పదో తరగతి పూర్తి చేస్తే ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పట్టువదలని విక్రమార్కుడిలా ఓపెన్ విద్య ద్వారా పదో తరగతి చదివాడు. రెండు నెలల క్రితం పాలకొండ కేంద్రంగా పరీక్షలు రాశాడు. ఇటీవల వచ్చిన ఫలితాల్లో పాసయ్యాడు. సంబంధిత సర్టిఫికెట్ను షణ్ముఖరావుకు సంతకవిటి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు యు.రవిశంకర్ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా పొడగరి షణ్ముఖరావు మాట్లాడుతూ.. అధికారులు స్పందించి ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. -
ఆర్థిక బిల్లుకు ఆమోదం: లోక్సభ రేపటికి వాయిదా
సాక్షి,న్యూఢిల్లీ: 2018 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆర్థికబిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. సభలో విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే 21 సవరణలు, 3 కొత్త క్లాజులతో 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను సప్లిమెంటరీ డిమాండ్లను సభ ఆమోదించింది. అనంతరం లోక్ సభ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి. కాగా ఇవాళ పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై, వివిధ సమస్యలపై పలు పార్టీలు ఆందోళన చేయడంతో లోక్సభ ఎనిమిదో రోజు కూడా అట్టుడికింది. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు. కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్లుకోవాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. దీంతో సభను స్పీకర్ సుమిత్రామహాజన్ కొంతసేపు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన అనంతరం ఫైనాన్షియల్ బిల్లు ఆమోదం పొందిన వెంటనే ప్రతిపక్ష పార్టీల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో లోక్సభ స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. -
చర్చలేకుండానే ఆమోదం
భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఓకే - రైతు సమస్యలపై చర్చకు కాంగ్రెస్ డిమాండ్ - సభ్యుల ఆందోళనతో అట్టుడికిన సభ - వెల్లోకి ప్రవేశించేందుకు యత్నం.. అడ్డుకున్న మార్షల్స్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు–మార్షల్స్ మధ్య తోపులాట.. ఉద్రిక్తత - చర్చ లేకుండానే బిల్లు ఆమోదానికి మహమూద్ అలీ ప్రతిపాదన - ఆ వెంటనే బిల్లు ఆమోదం పొందినట్టు ప్రకటించిన స్పీకర్ - సభ నిరవధిక వాయిదా.. మండలిలో 5 నిమిషాల్లోనే ఆమోదం - ప్లకార్డులు ప్రదర్శించిన కాంగ్రెస్ సభ్యులు - బిల్లును ఆమోదించాలని చైర్మన్ను కోరిన మంత్రి హరీశ్ - ఆమోదం పొందినట్లు చైర్మన్ ప్రకటన.. సభ నిరవధిక వాయిదా సాక్షి, హైదరాబాద్: చర్చ లేకుండానే భూసేకరణ చట్ట సవరణకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ సభ్యుల ఆందోళనల మధ్య పట్టుమని పది నిమిషాల్లోనే బిల్లును పాస్ చేసింది. అటు శాసనమండలిలోనూ చర్చ లేకుండానే బిల్లును ఆమోదించారు. శాసనసభ గతంలో ఆమోదించిన భూసేకరణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు సూచించటంతో ప్రభుత్వం ఆదివారం ప్రత్యేకంగా అసెంబ్లీ, మండలి సమావేశం నిర్వహించింది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవగానే ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. రైతు సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం మొదలైంది. నల్ల కండువాలు ధరించి హాజరైన కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రైతు సమస్యలపై చర్చకు పట్టుబట్టారు. సీఎల్పీ నేత జానారెడ్డి మినహా కాంగ్రెస్ సభ్యులందరూ తమ స్థానాల నుంచి లేచి నిలబడి నినాదాలు చేయటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు భూసేకరణ చట్ట సవరణల బిల్లుపై మాత్రమే మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని స్పీకర్ మధుసూదనాచారి కాంగ్రెస్ సభ్యులకు పలుమార్లు స్పష్టం చేశారు. తనకు మాట్లాడే అవకాశమివ్వాలని జానారెడ్డి కోరగా... కాంగ్రెస్ సభ్యులంతా ఎవరి స్థానాల్లో వారు వెళ్లి కూర్చుంటే అవకాశం కల్పిస్తామని స్పీకర్ బదులిచ్చారు. అయినా కాంగ్రెస్ సభ్యులు పట్టు వీడకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో సవరణ బిల్లుపై మాట్లాడేందుకు కాంగ్రెస్కు బదులుగా ఎంఐఎం పార్టీకి స్పీకర్ మొదటి అవకాశమిచ్చారు. వెంటనే కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పొడియం వైపు దూసుకు వెళ్లగా మార్షల్స్ అడ్డుకున్నారు. కాంగ్రెస్ సభ్యులు, మార్షల్స్ మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. బిల్లుపై ఎంఐఎం సభ్యుడు అహ్మద్ పాషా ఖాద్రీ చర్చను ప్రారంభించడంతో కాంగ్రెస్ సభ్యులు తమ ఆందోళనను తీవ్రం చేశారు. ‘రైతులు చనిపోతుంటే ఎక్కడి బిల్... రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి..’ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు చించి స్పీకర్ పోడియం వైపు విసిరేశారు. ఒకదశలో స్పీకర్ పొడియం ముందు కాంగ్రెస్ సభ్యులు, మార్షల్స్ మధ్య తోపులాట కొనసాగింది. కాంగ్రెస్ సభ్యుడు సంపత్కుమార్ ఆగ్రహంతో మార్షల్స్ను తోసేందుకు ప్రయత్నించగా, మార్షల్స్ ఆయన్ను వెనక్కి నెట్టేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఉత్తమ్కుమార్రెడ్డి సైతం మార్షల్స్ను తోసివేసేందుకు ప్రయత్నించారు. మహిళా కాంగ్రెస్ సభ్యులు డీకే అరుణతోపాటు పద్మావతిరెడ్డి పోడియం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా మహిళా మార్షల్స్ అడ్డుకున్నారు. ఇదే సమయంలో.. చర్చ లేకుండానే భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలపాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రతిపాదించారు. బిల్లులో ప్రతిపాదించిన మూడు సవరణలకు విడివిడిగా స్పీకర్ మూజువాణి ఓటింగ్ నిర్వహించారు. అధికార పార్టీ, ఎంఐఎం మద్దతు తెలపడంతో భూసేకరణ చట్ట సవరణల బిల్లును సభ ఆమోదించిందని స్పీకర్ ప్రకటించారు. ఆ వెంటనే టీఆర్ఎస్ సభ్యులు బల్లలు చరిచి సంబరాలు చేసుకున్నారు. ఆ మరుక్షణమే స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement