మైనార్టీ ‘కృష్ణుడు’
ఇచ్చోడ (ఆదిలాబాద్): మండలకేంద్రంలో ఫస్ట్స్టెఫ్ స్కూల్లో సోమవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శంశాదభాను అనే మైనార్టీ మహిళా తన కుమారుడిని చిన్నికృష్ణుడు వేషధారణ వేయించి ఆకట్టుకుంది. పాఠశాలలో జరిగే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మండల కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో నివాసముండే శంశాద భాను, లతీఫ్ల దంపతుల కుమారుడు హయాన్ ఫస్ట్స్టెఫ్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్నాడు.
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారని శంశాదభానును కొనియాడారు. ఎవరి మతవిధానం వారిది అని ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవడంతోనే నిజమైన భారతీయత అని శంశాదభాను చెప్పడం మత్యసామరస్యానికి ప్రతీకగా నిలిచింది.