ఘోర ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి ఆర్టీసీ బస్సు బోల్తా | Road accident At Adilabad Utnur Mandal | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి ఆర్టీసీ బస్సు బోల్తా

Feb 23 2026 7:39 AM | Updated on Feb 23 2026 8:07 AM

Road accident At Adilabad Utnur Mandal

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్‌ మండలంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. శ్యామ్‌పూర్ గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బ్రిడ్జి కింద పడిపోయింది. బస్సు ఆదిలాబాద్ వైపు నుంచి ఉట్నూర్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఇక, ఈ ప్రమాదం కారణంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ సహా ప్రయాణీకులకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో బస్సుల్లో 25 మంది ప్రయాణీకులు ఉన్నారు. గాయపడిన వారికి ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement