పోలీసుల దాడితో పాడైన కిడ్నీలు | Kidneys damaged with police attack | Sakshi
Sakshi News home page

పోలీసుల దాడితో పాడైన కిడ్నీలు

May 30 2017 2:04 AM | Updated on Sep 4 2018 5:07 PM

పోలీసుల దాడితో పాడైన కిడ్నీలు - Sakshi

పోలీసుల దాడితో పాడైన కిడ్నీలు

పోలీసులు అకారణంగా ఓ యువకుడిపై దాడి చేయడంతో రెండు కిడ్నీలు పాడై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

► ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి బాధితుడి కుటుంబ సభ్యుల వినతి

వికారాబాద్‌ అర్బన్‌: పోలీసులు అకారణంగా ఓ యువకుడిపై దాడి చేయడంతో రెండు కిడ్నీలు పాడై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి బాధ్యులైన ఎస్‌ఐ తోపాటు కానిస్టేబుళ్లపై బాధితుడి కుటుం బ సభ్యులు సోమవారం వికారాబాద్‌ జిల్లా ఎస్పీ అన్నపూర్ణకు ఫిర్యాదు చేశారు. వికారాబాద్‌ మండలం ఎర్రవల్లికి చెందిన కన్నారెడ్డి డిగ్రీ పూర్తి చేశాడు. మోమిన్‌పేట మండల కేంద్రంలో ఫర్టిలైజర్‌ షాపు ప్రారంభిద్దామని మండల వ్యవసాయ అధికారి(ఏవో) నీరజను సంప్రదించాడు.

2 నెలలపాటు కార్యాలయానికి తిప్పించుకున్న ఆమె వ్యాపారానికి అనుమతి ఇచ్చేందుకు రూ.20 వేల లంచం ఇవ్వా లని అడిగారని బాధితుడు ఆరోపిస్తు న్నాడు. దీనికి కన్నారెడ్డి అంగీకరించక పోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరి గింది.  ఈ నెల 20న మోమిన్‌పేట పోలీ సులకు నీరజ ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ రాజు కార్యాలయానికి వెళ్లి కన్నారెడ్డిని చితకబాదారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులతో తీవ్రంగా కొట్టిం చారు.

తీవ్ర అస్వస్థతకు గురైన కన్నారెడ్డిని కుటుంబీకులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అతడి రెండు కిడ్నీలు పాడైనట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం కన్నా రెడ్డి ఆస్పత్రిలోనే చికిత్స పొందున్నాడు.   ఎస్‌ఐతోపాటు పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబీకులు  వికారాబాద్‌ ఎస్పీ అన్నపూర్ణను కలసి విజ్ఞప్తి చేశారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement