తెలంగాణ బీజేఎల్పీ నాయకుడిగా లక్ష్మణ్ | K.Laxman elected as Telangana BJLP leader | Sakshi
Sakshi News home page

తెలంగాణ బీజేఎల్పీ నాయకుడిగా లక్ష్మణ్

Jun 2 2014 4:54 PM | Updated on Sep 2 2017 8:13 AM

తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సీనియర్ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ ఎంపికయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సీనియర్ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ ఎంపికయ్యారు. సోమవారం తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నేత జేపీ నద్దా పరిశీలకునిగా హాజరయ్యారు. శాసన సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ తెలంగాణలో ఐదు సీట్లను గెల్చుకుంది. లక్ష్మణ్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు ఎన్నికయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement