సంగారెడ్డి రూరల్: దేశవ్యాప్తంగా ఎక్కువ మంది విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తూ అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రపంచ స్థాయికి ఎదిగిందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. కందిలో ఇన్ఫోసిస్ సామాజిక సేవ విభాగం, ఫౌండేషన్ భాగస్వామ్యంతో నిర్మించిన మెగా సెంట్రలైజ్ అక్షయపాత్ర కిచెన్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..ఆకలితో ఉన్న పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి మెగా కిచెన్ ఏర్పాటుకు రూ.18.50 కోట్లను అందించిన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మెన్ సుధామూర్తిని అభినందించారు. ఈ కిచెన్కు లక్ష మంది పాఠశాల విద్యార్థులకు సరిపడే మధ్యాహ్న భోజనం తయారు చేసే సామార్థ్యం ఉందన్నారు.
విద్యార్థులకు నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అంధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.550 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధామూర్తి మాట్లాడుతూ..ప్రతీ ఒక్కరూ తమ చేతనైన సహాయం అందిస్తూ పేద విద్యార్థులకు చేయూత నివ్వాలని కోరారు. బడికి వెళ్లే విద్యార్థులు ఆకలితో విద్యకు దూరం కాకుండా అక్షయపాత్ర పని చేస్తోందన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ..అక్షయపాత్ర మెగా కిచెన్ ఏర్పాటుతో సంగారెడ్డి ప్రాంతంలో విద్యార్థులందరికీ పౌష్టికాహారం అందే అవకాశం ఉందన్నారు. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..మెగా కిచెన్ను ఏర్పాటు చేసి రోజుకు లక్ష మంది విద్యార్థులకు భోజనం అందించడంతో బడి మానేసే విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు.
అనంతరం అక్షయపాత్రపై ప్రముఖ గాయకుడు కారుణ్య ఆలపించిన సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యగౌడ చంద్రదాస, వైస్ చైర్మెన్ చంచలపతిదాస, జెడ్పీ చైర్మెన్ రాజమణీ మురళీ యాదవ్, సర్పంచ్ ఉమారాణి శంకర్గౌడ్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ విజేంద్రబోయి, రిజినల్ ఆర్గనైజర్ లక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, గ్రంథాలయ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మెన్ విజేందర్రెడ్డి, జెడ్పీటీసీ మనోహర్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ కొండల్రెడ్డి, టీఆర్ఎస్ మండలా«ధ్యక్షులు చిల్వెరి ప్రభాకర్ పాల్గొన్నారు.
అంతర్జాతీయ స్థాయికి ‘అక్షయపాత్ర’
Published Sat, Mar 31 2018 8:54 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
అవినీతి సొమ్ముకు హెరిటేజ్ ముసుగు
లోక్సభ పోరు నేడే
మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
పోటెత్తాలి మన ఓటు!
Lok Sabha Election 2024: తోటల నగరంలో ఓట్ల వేట!
Lok Sabha Election 2024: సరిహద్దు సమరం
నేడే పోలింగ్.. ప్రజాతీర్పునకు సర్వం సిద్ధం
తోడు దొంగలు
Lok Sabha Election 2024: ఎవరికి రిజర్వుడ్!
వన్స్ మోర్.. 22 జాతీయ మీడియా సర్వేల్లోనూ ‘ఫ్యాన్’కే పట్టం
తప్పక చదవండి
- ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
- రెండ్రోజులు వానలు
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- Lok Sabha Election 2024: తోటల నగరంలో ఓట్ల వేట!
- Lok Sabha Election 2024: సరిహద్దు సమరం
- Lok Sabha Election 2024: ఎవరికి రిజర్వుడ్!
- Lok Sabha Election 2024: ఆ ఊరి కోసం 3 రోజుల ట్రెక్కింగ్!
- వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
- పోలింగ్ సందర్భంగా హింసకు టీడీపీ కుట్ర
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
Advertisement