► నాణ్యతా ప్రమాణాల కోసం పెంచుకునే దిశగా కసరత్తు
► పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని అగ్ర శ్రేణి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) సంస్థల్లో మరోసారి ఫీజులు పెరగనున్నాయి. ఈ దిశగా ఐఐటీలతోపాటు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆలోచనలు చేస్తోంది. గత విద్యా సంవత్సరంలోనే ఐఐటీల కౌన్సిల్ ఫీజులను పెంచింది. రూ.90 వేలుగా ఉన్న వార్షిక ఫీజును రూ.2 లక్షలకు పెంచింది. ప్రస్తుతం మళ్లీ ఫీజుల పెంపు అంశం చర్చకు వచ్చింది. అయితే అన్ని ఐఐటీల్లో ఫీజులు పెంచుకునే అవకాశం ఇవ్వాలా, లేదా టాప్ ఐఐటీలకే ఆ అధికారాన్ని ఇవ్వాలా, అనే అంశంపైనా కేంద్రం పరిశీలన జరుపుతోంది. ప్రపంచస్థాయి విద్యా సంస్థల జాబితాలో ఐఐటీలు చోటు పొందాలంటే మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టడం, పరిశోధనలను విస్తృతం చేసేందుకు అవసరమైన ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది.
ఈ మేరకు ప్రపంచస్థాయి ర్యాంకింగ్ కోసం పోటీ పడే కొన్ని ఐఐటీలకే ఫీజులను నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా విదేశీ విద్యార్థులకు పది శాతం అదనపు సీట్లు కేటాయించి, వారి నుంచి వసూలు చేసేలా చర్యలు చేపట్టాలన్న మరో ప్రతిపాదన పరిశీలనలో ఉంది. అయితే సీట్ల పెంపునకు కౌన్సిల్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఫీజులు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఖరగ్పూర్, ముంబై సహా అరడజను ఐఐటీలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో (ఎన్ఐఆర్ఎఫ్) ప్రపంచ స్థాయి విద్యా సంస్థల జాబితాలో ప్రభుత్వ విద్యా సంస్థలకంటే ప్రైవేటు యూనివర్సిటీలు, విద్యా సంస్థలే ఎక్కువగా ఉన్నాయి.
అయితే ఆ విద్యా సంస్థలు ఒక్కోటి రూ.200 కోట్ల కార్పస్ ఫండ్తో కొనసాగుతున్నాయి. అదే స్థాయిలో 20 ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే ముఖ్యమైన ఐఐటీల్లో ఫీజు పెంపు అంశం తెరపైకి వచ్చింది. దీనిపై వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాల సమయం నాటికి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
టాప్ ఐఐటీల్లో మళ్లీ ఫీజు పెంపు?
Published Sat, Oct 22 2016 1:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement