కోటిలింగాలకు పోటెత్తిన భక్తులు | heavy rush at kotilingala godavari pushkaralu | Sakshi
Sakshi News home page

కోటిలింగాలకు పోటెత్తిన భక్తులు

Jul 20 2015 9:49 AM | Updated on Sep 3 2017 5:51 AM

కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో పుష్కర స్నానాలకు భక్తులు పోటెత్తారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో పుష్కర స్నానాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారు జామున నుంచి ఘాట్ల వద్ద భక్తులు బారులు తీరారు. దీంతో అధికారులు అక్కడకు వస్తున్న భక్తులను ధర్మపురికి తరలిస్తున్నారు. గోదావరిలో నీటి మట్టం పెరుగుతుండటంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మంథనిలో భక్తుల రద్దీ సోమవారం సాధారణంగా ఉంది. పుష్కర భక్తులతో వేములవాడలో రద్దీ పెరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement