మారుతండ్రి కర్కశత్వం | Harrasement by parents | Sakshi
Sakshi News home page

మారుతండ్రి కర్కశత్వం

Jul 23 2015 11:58 PM | Updated on Mar 28 2018 11:08 AM

మారుతండ్రి కర్కశత్వం - Sakshi

మారుతండ్రి కర్కశత్వం

కన్నతండ్రి, మారుతల్లి చేతుల్లో చిత్రహింసలకు గురైన ప్రత్యూష వ్యవహారం మరచిపోకముందే జవహర్‌నగర్‌లో మరో దారుణం వెలుగుచూసింది...

నాలుగేళ్ల కూతురుకు వాతలు పెట్టి చిత్రహింసలు
జవహర్‌నగర్‌లోని బీజేఆర్‌నగర్‌లో దారుణం
జవహర్‌నగర్:
కన్నతండ్రి, మారుతల్లి చేతుల్లో చిత్రహింసలకు గురైన ప్రత్యూష వ్యవహారం మరచిపోకముందే జవహర్‌నగర్‌లో మరో దారుణం వెలుగుచూసింది. నాలుగేళ్ల కూతురుని మారుతండ్రి చిత్రహింసలకు గురిచేశాడు. కంటికి రెప్పలా కాపాడి ప్రేమను పంచాల్సిన కన్నతల్లి వంతపాడింది. తల్లిదండ్రుల కర్కశత్వానికి ఆ చిన్నారి చివరకు నడవలేని స్థితికి చేరుకుంది. జవహర్‌నగర్ సీఐ వెంకటగిరి కథనం ప్రకారం.. మెదక్ జిల్లా శివంపేట మండలం ఊసిరికపల్లికి చెందిన వెంకట్‌రెడ్డి, ప్రమీల దంపతులు. వీరికి కుమార్తెలు పవిత్ర, సంధ్య(4) ఉన్నారు. బతుకుదెరువుకోసం జవహర్‌నగర్ కు వలస వచ్చి బీజేఆర్‌నగర్‌లో నివాసముంటున్నారు. అనారోగ్యంతో వెంకట్‌రెడ్డి నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ప్రమీల తన తల్లి సుశీలతో కలసి ఉంటోంది. రెండు నెలల క్రితం ప్రమీల అల్వాల్‌కు చెందిన ప్రశాంత్‌కుమార్‌ను వివాహం చేసుకుంది.

ఇటీవల ప్రశాంత్ సంధ్యను చెంపలపై గాయపర్చి.. తొడలపై వాతలు పెట్టాడు. నెల రోజులగా అతడు వేధిస్తున్నా చిన్నారి ఏడుస్తూ భరించింది. ఇదంతా చూస్తూ కన్న తల్లి ప్రమీల భర్తకు వంతపాడింది. దీంతో పాపను చూసి తల్లడిల్లిన అమ్మమ్మ సుశీల, మేనమామ శ్రీనివాస్‌లు పలుమార్లు ప్రమీల దంపతులను హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ప్రశాంత్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement