* మెడిసిన్లో 40, బీడీఎస్లో 20 సీట్లు సాధిస్తుండటం అభినందనీయం
* ఎస్సీ, ఎస్టీ గురుకులాల ఫలితాల స్ఫూర్తితోనే మైనారిటీ గురుకులాలు
* ప్రతిభావంతులైన విద్యార్థులకు పారితోషికాలు: మంత్రి జగదీశ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-3 ఫలితాల్లో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. మెడిసిన్లో 40 సీట్లు, బీడీఎస్లో 20 సీట్లు సాధించేలా ర్యాంకులు పొందడంతోపాటు ఇతర పోటీ పరీక్షల్లో సత్తా చాటడం శుభపరిణామమని ఆనందం వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అత్యుత్తమ విద్య, భోజనం, వసతి, శిక్షణ అందించడంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అంకితభావంతో పనిచేస్తున్నారని అభినందించారు. చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం తప్పక ఫలితం ఇస్తుందని నిరూపించారని పేర్కొన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఆపరేషన్ బ్లూ క్రిస్టిల్ (ఏబీసీ) ద్వారా 2015-16 సంవత్సరానికి 110 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఎంసెట్లో శిక్షణ ఇప్పించగా, వారిలో మెజారిటీ విద్యార్థులకు మెడిసిన్, బీడీఎస్లలో సీట్లు వచ్చే స్థాయిలో ర్యాంకులు వచ్చాయి.
సొసైటీకి చెందిన విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీల్లో 25 మంది, టీఐఎస్ఎస్లో ఆరుగురు, అజీం ప్రేమ్జీ సంస్థలో 11 మంది, ఐఐటీల్లో 45 మంది, నిట్లలో ఐదుగురు, సీఏ కోర్సుల్లో ఐదుగురు ప్రవేశాలు పొందారు. ఎస్టీ విద్యార్థులు 9 మంది మెడిసిన్లో, నలుగురు బీడీఎస్లలో, 50 మంది ఐఐటీ, నిట్ వంటి సంస్థల్లో ప్రవేశం పొందారు. ఈ ఫలితాలపై కేసీఆర్ స్పందిస్తూ, ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యార్థులు సాధించిన విజయాలను చూసిన తర్వాత మైనారిటీలకు గురుకులాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. విద్యా సంస్థలను అంకితభావంతో నడుపుతున్నారని ప్రవీణ్కుమార్కు సీఎం ఫోన్ చేసి అభినందించారు. గురుకుల విద్యార్థుల చదువు పట్ల సీఎం చూపిస్తున్న శ్రద్ధ కారణంగానే ఈ ఫలితాలని ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు
మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్లో ప్రతిభ కనబరిచిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సొసైటీ వైస్ చైర్మన్ మహేశ్దత్ ఎక్కా, కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్కుమార్, రంగారెడ్డి జిల్లా డీఎస్ఓఏ వి.రంగారెడ్డి, గౌలిదొడ్డి ప్రిన్సిపాల్ ప్రమోద తదితరులు మంత్రిని కలసి విద్యార్థుల ప్రతిభ గురించి వివరించారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన జగదీశ్.. మెడిసిన్లో సీట్లు పొందే 40 మంది విద్యార్థులకు రూ.50 వేల చొప్పున, బీడీఎస్లో సీట్లు సాధించే వారికి రూ.40 వేల చొప్పున నగదు ప్రోత్సాహం అందించనున్నట్లు తెలిపారు.
గురుకుల విద్యార్థులు భేష్: సీఎం
Published Sat, Sep 17 2016 2:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..
యధార్థ సంఘటనల ఆధారంగా ‘100 క్రోర్స్’
సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే
పథకాలు ఆపగలరు కానీ.. మా విజయాన్ని ఆపలేరు: సీఎం జగన్
మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు
పోలింగ్ బూత్లలో లూటీ.. అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement