జాతిపితకు మహా నివాళి

Governor Tamilisai And CM KCR Pay Tribute To Mahatma Gandhi - Sakshi

బాపూఘాట్‌ వద్ద నివాళులు అర్పించిన గవర్నర్, ముఖ్యమంత్రి

లంగర్‌హౌస్‌: మహాత్మా గాంధీ 150వ జయంతి సంద్భంగా బుధవారం లంగర్‌హౌస్‌ త్రివేణి సంగమంలోని బాపూ సమాధి వద్ద గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌లు నివాళులు అర్పించారు. అనంతరం బాపూధ్యాన మందిరానికి వెళ్లి అక్కడ నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే బాపూఘాట్‌లోని గాం«దీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అరి్పంచారు. నివాళులర్పించిన వారిలో మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, చేమకూర మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్‌ గౌడ్, దానం నాగేందర్, బాల్క సుమన్, వివేక్, అరికెపుడి గాం«దీ, ఎమ్మెల్సీలు ప్రభాకర్, మల్లే‹Ù, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్, మేయర్‌ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, తీగల క్రిష్ణారెడ్డి ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top