కామారెడ్డి : చదువులో వెనుకబడిన విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు ప్రభుత్వం వేసవి బడులను ప్రారంభించింది. జిల్లాలో సుమారు 125 బడులు నడుస్తున్నాయి. వీటిలో సుమారు ఆరు వేల మంది చదువుకుంటున్నారు. వీరు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు బడిలో ఉంటారు. వీరికి విద్యాబుద్ధులు నేర్పించే బాధ్యత సీఆర్పీలది. ఇంత వరకు బాగానే ఉన్నా వేసవి కాలం కావడంతో ఉదయమే బడికి వచ్చిన విద్యార్థులు ఆకలితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో బడికి వస్తూ 11 గంటల వరకు తరగతి గదిలోనే ఉంటున్నారు.
ఒక వైపు ఎండ వేడి, మరోవైపు ఆకలి అవుతుండడంతో 10 కాగానే సార్... ఆకలవుతుందని అంటున్నారు. ఆ సమయంలో వారిని ఇంటికి పంపించకపోతే మరుసటి రోజు బడికి రావడం లేరని సీఆర్పీలు చెబుతున్నారు. బడి ప్రారంభమైనప్పుడు వచ్చిన విద్యార్థుల సంఖ్యకు ప్రస్తుతం ఉన్న సంఖ్యకు తేడా వచ్చిందని వారు వివరిస్తున్నారు. విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతూ బడికి రావడానికి మారాం చేస్తున్నారని వారు చెబుతున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నట్టుగానే వసతుల విషయంలోనూ అంతే శ్రద్ధ చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అల్పాహారమైనా పెట్టాలి
ఎండ, ఆకలితో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు కనీసం ఏదైనా అల్పాహారం పెడితే బాగుండేదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఏవేవో కార్యక్రమాలతో లక్షలు ఖర్చు చేసే అధికారులు వారికి అల్పాహారం అందిస్తే బాగుంటుందని వారు భావిస్తున్నారు. అధికారులు స్పందిం చి వేసవి బడులకు వచ్చే విద్యార్థుల సం ఖ్య తగ్గకుండా చూడాలని వేడుకుంటున్నారు.
సార్... ఆకలైతాంది
Published Thu, May 7 2015 3:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement