* భోపాల్ రిటైర్డ్ ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్ ఉద్బోధ
* ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా స్మారకోపన్యాసం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగంలో విద్యావ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా సమాజాభివృద్ధికి పాటుపడాలని భోపాల్కు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్ ఉద్బోధించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, తెలంగాణలో ఆంగ్ల భాషతోపాటు మాతృభాషలో కూడా బోధన ఉండాలని అన్నారు.
తెలంగాణ ఉద్యమ రూపశిల్పి ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటు చేసిన నాల్గో స్మారకోపన్యాసంలో కార్పొరేటీకరణ-ప్రకృతి వనరులు-విద్య అనే అంశంపై ఆయన ప్రసంగించారు. విద్యా హక్కు అందరికి ఉండాలని, విద్యాబోధన పద్ధతులు మారాలని ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్ అన్నారు. అంబేడ్కర్ స్పూర్తితో జయశంకర్ పోరాడారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ రూపకర్తగా నిలిచారని కొనియాడారు.
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ప్రజలను చైతన్యం చేయటంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ముందుండాలన్నారు. రాష్ట్ర నవ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ విద్యారంగ నిర్మాణంలో మార్పులు అవసరమన్నారు. విద్య అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. తెలంగాణ కోసం పరితపించిన జయశంకర్ ఆశయాల సాధన కోసం మనమందరం కృషి చేయాలన్నారు.
జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రజల త్యాగాలను కొందరు భోగాలుగా అనుభవిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ వి.శివలింగ ప్రసాద్, విద్యావంతుల వేదిక స్టీరింగ్ కమిటీ కన్వీనర్ మల్లెపల్లి లక్ష్యయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పర్తి యాదయ్య, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, విరసం నేత వరవరరావు, ప్రొఫెసర్ హరగోపాల్, విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవీందర్రావు పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యావ్యవస్థ పటిష్టం కావాలి
Published Mon, Jun 22 2015 12:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం
మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!
పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
మెట్ గాలాలో మరోసారి సందడి చేయనున్న సుధారెడ్డి! ఎవరీమె..?
ఎండ దెబ్బతో జేబుకు చిల్లులు! ఆందోళన కలిగిస్తున్న అంచనాలు
సినిమా అట్టర్ ఫ్లాప్.. కొత్తిల్లు కొన్న రజనీ కూతురు
పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!
చేజారిన కెప్టెన్సీ.. ఎట్టకేలకు మౌనం వీడిన రోహిత్ శర్మ
సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ
అందుకే ‘ఓటుకు నోటు’ విచారణ బదిలీ కోరుతున్నాం
తప్పక చదవండి
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
- ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
- టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్గా మారా: స్టార్ హీరోయిన్
- మోసాల బాబు మరో అబద్ధం..
- మోసాల బాబు మరో అబద్ధం..
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
Advertisement