♦ ప్రత్యామ్నాయ స్థలంపై రక్షణ శాఖ సానుకూలత?
♦ ప్యాట్నీ–శామీర్పేట, ప్యారడైజ్–సుచిత్ర కూడలి
♦ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మోక్షం
♦ కంటోన్మెంట్ భూములు సేకరించేందుకు ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్, కరీంనగర్ రహదారులను నగరంతో ట్రాఫిక్ చిక్కులు లేకుండా అనుసంధానించే రెండు భారీ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు రక్షణ శాఖ సానుకూల సంకేతాలిచ్చింది. నగరంలోని స్థలం ఇచ్చి దాని బదులు వికారాబాద్ సమీపంలోని మన్నెగూడ వద్ద వంద ఎకరాలకుపైగా భూమిని తీసుకునేందుకు రక్షణ శాఖ సమ్మతించినట్టు తెలిసింది. ఇక్కడ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేసుకోనుంది.
అందుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందా లేదా అన్న విషయంలో స్పష్టత కోసం కంటోన్మెంట్ అధికారులను పరిశీలించాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు కంటోన్మెంట్ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అది అనుకూలంగానే ఉంటుందని ఢిల్లీలోని రక్షణ శాఖ ప్రధాన కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫలితంగా కంటోన్మెంట్ మీదుగా రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమమవుతోంది.
ట్రాఫిక్ చిక్కులు లేకుండా...
నిజామాబాద్ జాతీయ రహదారి, కరీంనగర్ రాజీవ్ రహదారి గుండా నగరంలోకి వచ్చే వాహనాలు శివారు వరకు వేగంగానే వచ్చినా, అక్కడి నుంచి ట్రాఫిక్లో ఇరుక్కుని నగరం చేరేందుకు దాదాపు గంటకుపైగా సమయం పడుతోంది. దీంతో ట్రాఫిక్ చిక్కుల నుంచి మోక్షం కలిపిస్తూ, వాహనాలు వేగంగా నగరంలోకి వచ్చేలా భారీ వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది జరగాలంటే కచ్చితంగా కంటోన్మెంట్ భూముల మీదుగానే నిర్మించాలి.
ప్యాట్నీ కూడలి నుంచి శామీర్పేట వరకు రాజీవ్ రహదారిని అనుసంధానిస్తూ ఓ కారిడార్, ప్యారడైజ్ కూడలి నుంచి నిజామాబాద్ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ సుచిత్ర కూడలి వరకు మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని రోడ్లు, భవనాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ రెండు కారిడార్ల నిర్మాణానికి దాదాపు 96 ఎకరాల కంటోన్మెంట్ భూమిని సేకరించాలి. సీఎం స్థాయిలో రక్షణశాఖ మంత్రితో గతంలో చర్చించిన మీదట రక్షణ శాఖ దీనికి సానుకూలత వ్యక్తం చేసింది.
‘ఏఓసీ’కి ప్రత్యామ్నాయ మార్గం కూడా...
మరోవైపు సికింద్రాబాద్ నుంచి అటు రామకృష్ణాపురం వంతెన మీదుగా ఈసీఐఎల్ రోడ్డు.. ఇటు సఫిల్గూడ రోడ్డుకు చేరుకునేలా కంటోన్మెంట్లోని ఏఓసీ మార్గాన్ని వినియోగిస్తున్నారు. క్రమంగా వాహనాల రద్దీ బాగా పెరగడంతో తమకు ఇబ్బందిగా మారిందని పేర్కొంటూ కంటోన్మెంట్ యంత్రాంగం ఆ రోడ్డును మూసేయాలని నిర్ణయించి పలుమార్లు దాన్ని తాత్కాలికంగా అమలు చేసింది. ఆ రోడ్డు మూసేస్తే ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బంది ఎదురు కానున్నందున ఆ ప్రతిపాదనను విరమించుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని రక్షణశాఖ కొట్టిపారేసింది.
ప్రత్యామ్నాయ మార్గాన్ని నిర్మించుకునేందుకు కొంత గడువు ఇస్తామని ప్రకటించటంతో ప్రభుత్వం ఆ అన్వేషణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి కూడా మార్గం సుగమమవుతోందని రోడ్లు భవనాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కంటోన్మెంట్ సరిహద్దుల మీదుగా ఉన్న ప్రత్యామ్నాయ రోడ్లను వెడల్పు చేసి వాటిని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం కంటోన్మెంట్కు సంబంధించిన 40 ఎకరాలను సేకరించనుంది. దీనికి కూడా ప్రత్యామ్నాయ స్థలం తీసుకునేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.
మన్నెగూడలో ఫైరింగ్ రేంజ్!
Published Fri, Apr 28 2017 2:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement