విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmers dies of electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Dec 4 2015 6:01 PM | Updated on Oct 1 2018 2:44 PM

వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.

కమలాపురం (కరీంనగర్) : వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. అడవి పందుల నుంచి పంటలను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ కంచెకు తాకి రైతు మృతిచెందాడు. ఈ సంఘటన కరీనంగర్ జిల్లా కమలాపురం మండలం ఉప్పల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండారు మొగిలి(48) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం పంట పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement