విద్యుదాఘాతం రైతు మృతి | Farmer killed with electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతం రైతు మృతి

Nov 4 2015 10:25 AM | Updated on Oct 1 2018 4:01 PM

మోటర్ ఆన్ చేయడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.

మోటర్ ఆన్ చేయడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపాలెం పంచాయతి పరిధిలోని లచ్చిరాంతండలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బానోతు రవి(33) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం వ్యవసాయ బావి వద్ద మోటర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ కరెంటు వైర్లు తాకడంతో.. రైతు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement