విద్యుదాఘాతం రైతు మృతి | Farmer killed with electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతం రైతు మృతి

Nov 4 2015 10:25 AM | Updated on Oct 1 2018 4:01 PM

మోటర్ ఆన్ చేయడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.

మోటర్ ఆన్ చేయడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపాలెం పంచాయతి పరిధిలోని లచ్చిరాంతండలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బానోతు రవి(33) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం వ్యవసాయ బావి వద్ద మోటర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ కరెంటు వైర్లు తాకడంతో.. రైతు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement