విద్యుదాఘాతంతో రైతు మృతి | farmer died due current shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Aug 10 2015 1:55 PM | Updated on Oct 1 2018 2:44 PM

వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన రైతు విద్యుధ్థాతానికి గురై మృతిచెందాడు.

బెల్లంపల్లి: వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన రైతు విద్యుధ్థాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా భీమిని మండలం మామిడిపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చంద్రయ్య(27) తనకున్న రెండెకరాల పొలంలో వరి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం మోటర్ పెట్టడానికి బావి వద్దకు వెళ్లాడు. రాత్రి వర్షం పడటంతో స్టాటర్ పెట్టెకు విద్యుత్ సరఫరా జరగడంతో విద్యుధ్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య,  కూతురు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement