ఎండిన పంటను చూసి తట్టుకోలేక.. | farmer commits suicide in karim nagar | Sakshi
Sakshi News home page

ఎండిన పంటను చూసి తట్టుకోలేక..

Dec 25 2015 2:26 PM | Updated on Oct 1 2018 2:36 PM

ఎండిన పంటను చూసి తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డి పల్లిలో ఈ ఘటన జరిగింది.

ధర్మారం: ఎండిన పంటను చూసి తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డి పల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన గడ్డం రవీందర్‌రెడ్డి (51) మొక్కజొన్న పంట వేశాడు. నీరు లేక పంట ఎండిపోవడంతో చేసిన అప్పులు తీర్చడం కష్టమని మనస్తాపానికి గురైన అతడు గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు రవీందర్‌రెడ్డిని ధర్మారం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు శుక్రవారం ఉదయం మృతి చెందాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement