ఎండిన పంటను చూసి తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డి పల్లిలో ఈ ఘటన జరిగింది.
ఎండిన పంటను చూసి తట్టుకోలేక..
Dec 25 2015 2:26 PM | Updated on Oct 1 2018 2:36 PM
ధర్మారం: ఎండిన పంటను చూసి తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డి పల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన గడ్డం రవీందర్రెడ్డి (51) మొక్కజొన్న పంట వేశాడు. నీరు లేక పంట ఎండిపోవడంతో చేసిన అప్పులు తీర్చడం కష్టమని మనస్తాపానికి గురైన అతడు గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు రవీందర్రెడ్డిని ధర్మారం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు శుక్రవారం ఉదయం మృతి చెందాడు.
Advertisement
Advertisement