పత్తి రైతు బలవన్మరణం | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

పత్తి రైతు బలవన్మరణం

Nov 22 2015 11:42 AM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల పాలైన ఓ రైతు పంట ఎండిపోయిన పరిస్థితి చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

కేతేపల్లి/వేములపల్లి (నల్లగొండ) : అప్పుల పాలైన ఓ రైతు పంట ఎండిపోయిన పరిస్థితి చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం పాములపాడు గ్రామానికి చెందిన పూనుకుంట లింగయ్య (45)కు కేతేపల్లి మండలం బీమారం శివారులో రెండెకరాల భూమి ఉంది. మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. అది కాస్తా ఎండిపోవడంతో చూసి తట్టుకోలేకపోయాడు. సాగు కోసం రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ పరిస్థితులతో మనస్తాపం చెందిన లింగయ్య ఆదివారం తెల్లవారుజామున తన పొలంలో వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లింగయ్యకు ముగ్గురు కుమార్తెలతోపాటు మానసిక స్థితి సరిగా లేని భార్య ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement