రైతన్న బలవన్మరణం | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

రైతన్న బలవన్మరణం

Nov 19 2015 5:25 PM | Updated on Nov 6 2018 7:56 PM

నమ్ముకున్న వ్యవసాయం నట్టేట ముంచటంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

జనగాం (వరంగల్) : నమ్ముకున్న వ్యవసాయం నట్టేట ముంచటంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ జిల్లా మద్దూరు మండలం బైరాన్‌పల్లిలో నీరటి రాజు(32) వ్యవసాయం చేసి అప్పుల పాలయ్యాడు. ఈ ఏడు పంటల పరిస్థితి ఆశాజనకంగా లేకపోవటంతో దిగులు చెందాడు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం పొలానికి వెళ్లి అక్కడే పురుగు మందు తాగాడు. తిరిగి వస్తూ పడిపోయిన అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. అతడికి భార్య మాధవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement