పోలీస్స్టేషన్ ముందు అధికార పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆందోళన
► తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణ
► ‘నీ సంగతి చెబుతా’ అంటూ బెదిరించారని వెల్లడి
► రమేశ్ రాథోడ్తో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు
ఖానాపూర్: ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ మంగళవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘నీ సంగతి చెబుతా..’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గురువారం పోచంపాడులో సీఎం బహిరంగ సభ నేపథ్యంలో ఖానాపూర్లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితోపాటు జిల్లా నేతలు పాల్గొన్నారు. భేటీలో తన పక్కన కూర్చున్న మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల శ్రీనివాస్ను రమేశ్ రాథోడ్ చేయి పట్టి పక్కకు లాగారని ఎమ్మెల్యే రేఖా నాయక్ తెలిపారు. ఇదేంటని తాను ప్రశ్నిస్తే.. ‘‘ఎక్కడ్నుంచో బతికేందుకు వచ్చావు.. నీ స్థానంలో నీవు ఉండు.. వీళ్లు వెళ్లిపోయాక నీ సంగతి చెబుతా..’’అని బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.
గొడవ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఇతర నాయకులు కలుగచేసుకొని సర్దిచెప్పారన్నారు. సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే నేరుగా స్థానిక పోలీస్స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. రమేశ్ రాథోడ్తో తనకు ప్రాణహాని ఉందని, గతంలో కూడా తనపై గన్మన్ను తోసి దౌర్జన్యానికి దిగారని, మహిళ అని కూడా చూడకుండా అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. సమావేశంలో గొడవకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయన్నారు. వెంటనే రాథోడ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ మేరకు లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్కు సైతం రమేశ్ ప్రవర్తనపై ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
మాజీ ఎంపీ అనుచిత ప్రవర్తన
Published Wed, Aug 9 2017 1:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘నీట్’ మాల్ ప్రాక్టీస్కు చెక్!
నేతన్నల బాధలు సీఎంకు కనిపించలేదా..?
ఎమ్మెల్యే నివాసంలో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశం
ఓటుహక్కుపై ‘ఉపాధి’ కూలీలకు చైతన్యం
శ్రీమద్రామాయణ మహాక్రతువుకు అంకురార్పణ
విద్యార్థులకు అభినందన
వేసవి పూట.. జలకాలాట
రోహిత్ కేసును పునర్విచారించాలి
సంజయ్ ఓ పొలిటికల్ టూరిస్ట్
లోఓల్టేజీ నియంత్రణకు డీటీఆర్ ఏర్పాటు
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement