'టీఆర్ఎస్ వినిపించుకోవడం లేదు' | dk aruna takes on trs government | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్ వినిపించుకోవడం లేదు'

Aug 20 2016 1:34 PM | Updated on Sep 4 2017 10:06 AM

'టీఆర్ఎస్ వినిపించుకోవడం లేదు'

'టీఆర్ఎస్ వినిపించుకోవడం లేదు'

గద్వాల్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డి.కె.అరుణ డిమాండ్ చేశారు.

హైదరాబాద్ : గద్వాల్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఏడాది నుంచి పోరాడుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం వినిపించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ ఆరోపించారు. శనివారం టీ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్లో సమావేశమయ్యారు. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై అఖిల పక్షంలో చర్చించాల్సిన అంశాలను ఈ సందర్భంగా టీ నేతలు చర్చించారు. 

ఈ సందర్భంగా డి.కె.అరుణ మాట్లాడుతూ...ఆలంపూర్, గద్వాల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే సదరు నియోజకవర్గాల ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. నోటిఫికేషన్లో గద్వాల్ జిల్లా లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డీకే అరుణ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ ఈ అఖిల పక్ష సమావేశానికి హజరుకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement