కలెక్టరేట్ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం | couple attempts suicide | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం

Feb 9 2015 1:23 PM | Updated on Jul 10 2019 7:55 PM

తమకు పాస్ బుక్ లు ఇవ్వడం లేదని దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలోని కలెక్టరేట్ వద్ద సోమవారం మధ్యాహ్నం కలకలం రేపింది.

మహబూబ్ నగర్: తమకు పాస్ బుక్ లు ఇవ్వడం లేదని దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలోని కలెక్టరేట్ వద్ద సోమవారం మధ్యాహ్నం కలకలం రేపింది.  శ్రీనివాసపురానికి చెందిన శ్రీనివాసులు, శ్రీలక్ష్మి తమకు పాస్ బుక్ లు ఇప్పించాలంటూ కలెక్టర్ వద్దకు వచ్చారు.

 

అందులో భాగంగానే తమ పాస్ బుక్ లు ఇవ్వకుండా అధికారులు తిప్పుకుంటున్నారని ఆరోపించిన ఆ జంట ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేశారు. అయితే అక్కడ ఉన్న పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement