తెలంగాణ: ఒక్కరోజే 107 పాజిటివ్‌

Coronavirus 107 New Positive Cases Reported In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 107 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2098 కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఆరుగురు కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 63కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో తెలంగాణ నుంచి 39 మంది, వలసదారులు 19 మంది, విదేశాల నుంచి వచ్చినవారిలో 49 మంది ఉన్నారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం రాత్రి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. తాజాగా 37 మంది కోలుకోగా, వారితో కలిపి ఇప్పటివరకు 1321 మంది డిశ్చార్జి అయ్యారని వివరించారు. ప్రస్తుతం 714 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. 

(చదవండి: తెలంగాణ: మే నెలలోనూ జీతాల్లో కోతలే!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top