ఆదిలాబాద్, న్యూస్లైన్ : జిల్లాలో త్వరలో కానిస్టేబుళ్ల బదిలీలు జరుగనున్నాయి. వివిధ ఠాణాల్లో దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు ఈ బదిలీల్లో స్థానభ్రంశం కలుగనుంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ కసరత్తు ప్రారంభించారు. పోలీసు శాఖలో కౌన్సెలింగ్ విధానంలో బదిలీలకు ఆయన స్వీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీర్ఘకాలికంగా ఒకే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్ల బదిలీ కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.
పలువురికి స్థానభ్రంశం
ఐదేళ్ల నుంచి ఒకే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు బదిలీ తప్పనిసరి. జిల్లావ్యాప్తంగా సుమారు 2,400 మంది కానిస్టేబుళ్లు సివిల్ డ్యూటీలో ఉన్నారు. గతేడాది ఐదేళ్లు నిండిన సుమారు 380 కానిస్టేబుళ్లను ఒక ఠాణా నుంచి మరో ఠాణాకు పంపించారు. ఈ బదిలీల్లో 250 మందికిపైగా బదిలీలు జరిగే అవకాశామున్నట్లు సమాచారం. జూన్ 2న కొత్త సర్కారు కొలువుదీరిన అనంతరం బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు.
బదిలీకి ఒక్కో విధానం
గతంలో ఎస్పీలుగా పనిచేసిన వారు ఒక్కొక్కరు ఒక్కో విధానంలో బదిలీ ప్రక్రియ చేపట్టారు. కొన్ని సార్లు ఆ విధానాలు విమర్శలకు దారితీశాయి. గతంలో ఓ ఎస్పీ ఏబీసీడీ గ్రేడ్లుగా విభజించి ఒక గ్రేడ్ నుంచి మరో గ్రేడ్కు, ఒక సబ్ డివిజన్ నుంచి మరో సబ్ డివిజన్కు తప్పనిసరి బదిలీ చేయాలని చేసిన ప్రయత్నాలపై పోలీసు శాఖలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ విధానాన్ని ఆయనకు వెనక్కు తీసుకున్నారు. ఆ తరువాత వచ్చిన ఎస్పీలు కూడా కానిస్టేబుళ్ల బదిలీల విషయంలో ఆప్షన్లకు అవకాశమిచ్చి వారికి అనువుగానే బదిలీలు చేపట్టారు. ప్రధానంగా కానిస్టేబుళ్లు తమ సొంత ప్రాంతాలకు దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్లలో పని చేసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. తద్వారా కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉంటారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తారు. రాత్రిపగలు అని తేడా లేకుండా పోలీస్ డ్యూటీలో ఉండే కానిస్టేబుళ్లు కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తారు.
అనువైన చోటే అవకాశం
ప్రస్తుత ఎస్పీ గజరావు భూపాల్ కౌన్సెలింగ్ విధానంలో ఈ బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో సర్కిల్, సబ్ డివిజన్, గ్రేడ్ అనే విధానాలు కాకుండా కానిస్టేబుల్ తనకు అనువుగా భావించే మూడు పోలీసు స్టేషన్లను ఎంచుకొని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ ఎంచుకున్న స్టేషన్లలో ఎక్కడ ఖాళీ ఉంటుందో అక్కడకు బదిలీ చేస్తారు. ఈ విధానంపై పోలీసు శాఖలో హార్షం వ్యక్తమవుతోంది. అదే విధంగా పైరవీలకు తావు లేకుండా అందరికీ న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. తనకు కానీ, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలున్న పక్షంలో వారిని పట్టణ ప్రాంతాలు, ఆస్పత్రులు ఉన్నచోటికి బదిలీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ విషయమై ‘న్యూస్లైన్’ జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ను వివరణ కోరగా.. దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న కానిస్టేబుళ్లను వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తామని, త్వరలో బదిలీ కౌన్సెలింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు.
త్వరలో కానిస్టేబుళ్ల బదిలీలు
Published Fri, May 30 2014 2:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement