హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పక్కా సదుపాయాలు కల్పించేం దుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మౌలిక సదుపాయాలు లేక, సరిపడా తరగతి గదులులేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పరిస్థితులను చక్కదిద్దాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 465 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉంటే.. మొదట265 కాలేజీల్లో వసతుల కల్పనకు చర్యలు చేపట్టింది. ఇందులో 9 జిల్లాల్లోని 177 కాలేజీల్లో మరుగుదొడ్లు, నీటి శుద్ధి కేంద్రాలు, 69 కాలేజీల్లో అదనపు తరగతి గదులు, 19 కాలేజీల్లో ప్రహరీగోడలు, ఇతర సదుపాయాలను కల్పించనుంది.
ఈ మేరకు రూ. 82.25 కోట్లతో ఈ కాలేజీల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం నిధులు మం జూరు చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశా రు. నాబార్డు ఆర్థిక సహకారంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మంచి రోజులు వచ్చినట్లేనని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. అలాగే ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారిస్తే విద్యారంగం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
కాలేజీల్లో వసతులకు నిధులు
Published Thu, Apr 9 2015 12:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement