'ముగింపు వేడుకల్లో' సీఎం, గవర్నర్ దంపతులు | cm kcr and narasimhan partcipate in telangana formation day celebrations | Sakshi
Sakshi News home page

'ముగింపు వేడుకల్లో' సీఎం, గవర్నర్ దంపతులు

Jun 7 2015 7:42 PM | Updated on Oct 3 2018 7:02 PM

'ముగింపు వేడుకల్లో' సీఎం, గవర్నర్ దంపతులు - Sakshi

'ముగింపు వేడుకల్లో' సీఎం, గవర్నర్ దంపతులు

కొన్ని దశాబ్దాల సుదీర్ఘ పోరాటం అనంతరం సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవపు ముగింపు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

హైదరాబాద్:కొన్ని దశాబ్దాల సుదీర్ఘ పోరాటం అనంతరం సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ముగింపు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం పీపుల్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ వరకూ నిర్వహించిన భారీ ర్యాలీ ఆకట్టుకుంది. దాదాపు లక్ష మంది ప్రజలతో చేపట్టిన ర్యాలీ కన్నుల పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో , గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు.

 

తెలంగాణ సాంస్కృతిక, కళా వైభవాన్ని చాటేలా వివిధ కళా రూపాలను ట్యాంక్‌బండ్‌పై ప్రదర్శిస్తున్నారు. ధూంధాం, ఆట, పాటలు, బతుకమ్మలు, బోనాలతో ట్యాంక్‌బండ్‌పై సందడి నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement