* గోదాముల్లో గోల్మాల్ లేదట..!
* ‘సాక్షి’కి సివిల్ సప్లయ్ మేనేజర్ వివరణ
సాక్షి, టాస్క్ఫోర్స్, మెదక్: కోట్లాది రూపాయలు ఖర్చు చేసి.. ప్రజా సంక్షేమం కోసం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం (సివిల్ సప్లయ్) అక్రమార్కుల పాలవుతున్నాయని, వీటిని రవాణా చేయకుండానే చేసినట్లు గోదాం స్టాక్ రిజిస్టర్లో నమోదు చేస్తున్న వైనంపై ‘గోదాములో గోల్ మాల్ ’ శీర్షికతో ఈ నెల 21న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందిం చిన మంత్రి హరీష్ విచారణకు ఆదేశించారు. అయితే కథనంపై సివిల్ సప్లయ్ మేనేజర్ జయరావు ఈ నెల 22న పత్రికలకు వివరణ ఇచ్చారు. ఈ కాపీ బుధవారం ‘సాక్షి’కి చేరింది. దీనిలో ‘గోదాముల్లో గోల్మాల్’ పూర్తిగా అవాస్తవమని ఖండించారు.
ఆయన వివరణ అసంపూర్ణంగా, అస్పష్టంగా ఉంది. కథనంలో ని వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకు విచారణ లేకుండానే అ క్రమాలకు పాల్పడుతున్న వారిని వెనకేసుకొచ్చినట్లు ఉంది. పాపన్నపేట గోదాం ఇన్ చార్జ నరేందర్ బదిలీ కావడంతో, ఆయన స్థానంలో శంకరంపేట గోదాం ఇన్చార్జి నర్సిం లుకు పాపన్నపేట అదనపు బాధ్యతలు అప్పజెప్పామని, తప్పనిసరి పరిస్థితిలో నర్సిం లు చేతనే పాపన్నపేట గోదాంలో సరుకులు పంపిణీ చేయించామని వివరణ ఇచ్చారు. అం తేకాకుండా పాపన్నపేట, టేక్మాల్లో రెవెన్యూ సిబ్బంది లేకపోవడం వల్లేశంకరంపేట గో దాం ఇన్చార్జిని పాపన్నపేటకు తాత్కాలిక ఇన్చార్జిగాని యమించామన్నారు. ఆర్ఓలు రాయకుండానే స్టేజి-1,స్టేజి-2 గోదాముల్లో ఆక్రమా లు జరుగుతున్నాయనడం అవాస్తవమన్నారు.
సారూ.. ఈ ప్రశ్నలకు బదులేవీ..
* పాపన్నపేట గోదాంకు ఇన్చార్జిగా నియమించిన శంకరంపేట గోదాం ఇన్చార్జి నర్సింహులేనా? ఈ వ్యక్తి ఎవరికి బంధు వు? రెవెన్యూ శాఖతో సంబంధం లేని ఈ ప్రైవేటు వ్యక్తి ఏ హోదాలో పాపన్నపేట గోదాంలో సరుకులు పంపిణీ చేస్తున్నారు. అది తేల్చి చెప్పండి. గతంలో కూడా ఈ వ్యక్తే గోదాం ఇన్చార్జి నర్సింహులుకు బదులు విధులు నిర్వహించడంపై మీకు ఫిర్యాదులు అందింది నిజమా కాదా..?
* పాపన్నపేటలో ఇద్దరు ఆర్ఐలు ఉన్నా, వారిని కాదని నర్సింహులుకు ఎలా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు? ‘సాక్షి’లో కథ నం వచ్చాక అప్పటికప్పుడు ఉరుకులు పరుగుల మీద బుధవారం రోజున నర్సింహులును తప్పించి పాపన్నపేట ఆర్ఐ మారుతికి బాధ్యతలు ఎందుకు అప్పగించారు..?
* ఇక మీరు చెప్పినట్టే అక్రమాలు అవాస్తవం అనుకుందాం. ‘సాక్షి’ కథనం వచ్చిన రోజునే మంత్రి హరీష్రావు ఎందుకు స్పం దించారు. సివిల్ సప్లయ్ గోదాంలపై ఇప్పటికీ మూడు సార్లు ఫిర్యాదులు వచ్చాయని అదే రోజు సిద్దిపేటలో జరిగిన ఒక సభలో ఆయన స్వయంగా ఎందుకు చెప్పారు. విచారణ జరపాల్సిందిగా జిల్లా కలెక్టర్కు ఎందుకు సూచించారు.
మరి మీరు ఏ గో దాం లోనైనా విచారణ జరిపారా..! కనీసం ‘సాక్షి’ ఆరోపణ చేసిన గోదాంలోనైనా తని ఖీలు చేశారా? చేస్తే వివరణలో ఎందుకు పొం దుపరచలేదు. విచారణ జరపకుం డానే గోల్మాల్ జరగలేదని ప్రకటించడం, అక్రమార్కులను వెనుకేసుకు రావడం కాదా..?
అబద్ధాలూ.. అతకలే!
Published Thu, Dec 25 2014 2:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
గాజువాకలో సీఎం రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
సడెన్గా మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణం ఇదే..
హైదరాబాద్లో కుండపోత.. వాతావరణశాఖ వార్నింగ్
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @గాజువాక (విశాఖపట్నం జిల్లా)
ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
తప్పక చదవండి
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement