కనీస వేతనాల కోసం పోరాటం- సీఐటీయూ | Sakshi
Sakshi News home page

కనీస వేతనాల కోసం పోరాటం- సీఐటీయూ

Published Sat, Jun 27 2015 10:12 AM

CITU dharna at ntpc karimnagar

జ్యోతినగర్: కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడంలో తెలంగాణ సర్కారు విఫలమైందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాజారావు అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టు గేటు వద్ద నిర్వహించిన కార్మిక పోరుబాట, బస్సుయాత్రలో భాగంగా రాజారావు మాట్లాడారు. కనీస వేతనాలు చెల్లించే వరకూ కార్మికులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మికులపైనే సమాజం ఆధారపడి ఉందన్నారు.
 

Advertisement
Advertisement