ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత తెలంగాణ కవులు, కళాకారులపై ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు.
హైదరాబాద్ సిటీ: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత తెలంగాణ కవులు, కళాకారులపై ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణ సాంసృ్కతిక వారధి ఛైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో పాటు కవులు, కళాకారులు మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. పాటలు, వివిధ కళారూపాలతో సంక్షేమ పథకాలను ప్రచారం చేసేందుకు ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలిసింది.


