ఎన్నికలు.. ఎన్నో విశేషాలు..

Changes In Election Commission Of India And Voting System - Sakshi

సాక్షి, ఆలేరు : భారత ఎన్నికల సంఘం కాలక్రమేణ ఎన్నో సంస్కరణలు చేపట్టింది. ఎన్నికల సంఘం స్వంతంత్ర రాజ్యంగ వ్యవస్థ. నిర్ణయాలు స్వతంద్రంగా తీసుకుంటుంది. దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించే సమయంలో సుమారు 50లక్షల మంది ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటోందని ఓ అంచనా. 

  • దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు హిమాచల్‌ప్రదేశ్‌లోని ‘చిని’లో నిర్వహించారు
  • దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 17.30కోట్లు అని నివేదికలు తెలుపుతున్నాయి
  • 1993లో జరిగిన 13వ సాధారణ ఎన్నికల్లో మొదటిసారి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను వినియోగించారు.
  • గతంలో ఓటు హక్కుకు కనీస వయస్సు 21 సంవత్సరాలు కాగా 61వ రాజ్యాంగ సవరణలో18 సంవత్సరాలకు కుదించారు
  • ఎన్నికల నిర్వహణలో సమూల సంస్కరణలు ప్రవేశపెట్టిన సమర్థుడిగా పదో ఎన్నికల సంఘం కమిషనర్‌గా టీఎన్‌ శేషన్‌ గుర్తింపు పొందారు.
  • 1952లో 55పార్టీలు ఎన్నికల్లో పాల్గొనగా 2014 నాటికి ఆ సంఖ్య 370కి చేరింది.
  • దేశంలో ఎంపీలుగా గెలిచిన వారిలో 30శాతం మందిపై పలు కేసులు నమోదయ్యాయని బీబీసీ నివేదిక పేర్కొంది.   
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top