హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన వైఖరి మార్చుకోవాలని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం హెచ్చరించారు. లేదంటే రెండు తెలుగు ప్రాంతాలకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలతో రాజకీయ పబ్బంగడుపుకోవాలనుకోవడం సరికాదన్నారు. శనివారం ఈమేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన కోదండరాం వెనుకబడిన తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం వల్ల సీమాంధ్ర రాజకీయనాయకుల గుత్తాధిపత్యం పోయి తెలంగాణ అభివృద్ధికి అవకాశం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల ఆంధ్రా ప్రాంతానికి నష్టం జరుగకపోగా, మరింత అభివృద్ది చెందడానికి అవకాశం ఏర్పడిందని అన్నారు. కేవలం పిడికెడు సీమాంధ్ర రాజకీయ నాయకుల, పెట్టుబడిదారుల ప్రయోజనాలకోసమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అనేక దశాబ్దాలపాటు అడ్డుకున్నారని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యంకాదని నమ్మి తెలంగాణకు అనుకూలం అని చెప్పిన చంద్రబాబు తెలంగాణ వస్తుందని తెలిశాక మాత్రం అనేక సాకులు చూపించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని చూశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా చంద్రబాబు తన వైఖరి మార్చుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. కేవలం ఆంధ్రా ప్రాంత ప్రజల మనోభావాలను రెచ్చ గొట్టి, రాజకీయ పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు, సంఘటిత శక్తి, త్యాగాల కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చంద్రబాబు గ్రహిస్తే బాగుంటుందన్నారు.
తెలంగాణపై ద్వేషపూరిత వైఖరే అనేక అంశాలలో విభజన ప్రక్రియ నత్తనడక నడవడానికి, ఇప్పటికీ పూర్తి కాకపోవడానికి ప్రధాన కారణం అని గుర్తు చేశారు. చంద్రబాబు వైఖరి రెండు ప్రాంతాలకూ నష్టం కలుగ జేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా తెలంగాణలో కొనసాగుతున్నకొందరు సీమాంధ్ర రాజకీయనాయకుల, పెట్టుబడిదారుల జోక్యాన్ని తాము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
చంద్రబాబు వైఖరి మార్చుకో.. లేదంటే...: కోదండరాం
Published Sat, Mar 4 2017 5:59 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
పరిపూర్ణం.. కోన సంబరం
ఉపాధికి మెండైన పాలి‘టెక్నిక్’
● ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లె యువకుడు మృతి ● ఒక్కగానొక్క కుమారుడి మృతితో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ● దుఃఖంలోనూ అవయవదానానికి అంగీకారం
షోకాజ్ నోటీసులను ఉపసంహరించండి
ట్రాన్స్కో వర్క్ ఆర్డర్లు పూర్తి చేయాలి
కౌంటింగ్పై అవగాహన తప్పనిసరి
● మగబిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే బాలింత మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు ● ఆస్పత్రి వద్ద ధర్నా.. పోలీసులకు ఫిర్యాదు
న్యాయమూర్తులకు ముగిసిన శిక్షణ
● మరో పదిరోజుల్లో ఓట్ల లెక్కింపు ● ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ ● జూన్ 4వ తేదీన తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
వైభవం.. వసంతోత్సవం
తప్పక చదవండి
- బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హత్య చేసిన భర్త
- ఇషా అంబానీకి జియో బంపర్ డీల్! సక్సెస్ అయితే..
- భారత టాలెంట్ సరిహద్దులు దాటుతోంది: రాజమౌళి
- సీఎం నిర్ణయాలే ఫైనల్.. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్?
- టీ20 వరల్డ్కప్-2024 అంబాసిడర్గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
- 'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా!
- స్వాతి మలివాల్పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
- మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
- వామ్మో వీళ్లే.. పీఎస్! వీళ్లదే.. కోర్టు తీర్పు!!
- చారిత్రక విజయానికి ఐదేళ్లు...
Advertisement