రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి ఆగంతకులు బంగారు గొలుసు లాక్కెళ్లారు.
మహబూబ్నగర్ : రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి ఆగంతకులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా జచ్చర్లలోని పద్మావతి కాలనీలో గురువారం చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న మహిళ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆమె వెనక నుంచి బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.