మెడికల్ అన్ఫిట్ కేసుల్లో నిలదీస్తున్న బాధితులు
డబ్బుల కోసం పెరుగుతున్న ఒత్తిడి
తప్పించు కుతిరుగుతున్న దళారులు
శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : మెడికల్ అన్ఫిట్లో చోటుచేసుకున్న అక్రమాల నేపథ్యంలో ఇటు యాజమాన్యం, అటు ప్రభుత్వం విచారణ చేపట్టడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. మెడికల్ బోర్డు నిర్వహించిన ప్రతీసారి డబ్బులతో పండుగ చేసుకొనే బ్రోకర్ల పరిస్థితి కుడితిల పడిన ఎలుకల తీరుగా మారింది. జబ్బు పడిన వారి నుంచే కాకుండా దొంగ మెడికల్ అన్ఫిట్ కేసులు చేయించడానికి రూ.లక్షల్లో దండుకున్న దళారులకు డబ్బులిచ్చిన కార్మికుల నుంచి రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. దీంతో రేపు.. మాపు.. అంటూ తప్పించుకు తిరుగుతున్నారు. మరి కొందరైతే ముఖం చూపించుకోలేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ప్రకృతికి విరుద్ధమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి భూగర్భం నుంచి బొగ్గు వెలికితీస్తున్న కార్మిక కుటుంబాలకు మేలు చేయడానికి యాజమాన్యం కల్పించిన అవకాశం నేడు దళారులకు, కొందరు నాయకులకు వరంగా మారిపోయింది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇక విధులు నిర్వర్థించలేని కార్మికుడికి మెడికల్ బోర్డు అన్ఫిట్ సర్టిఫికెట్ ఇస్తే అతడి స్థానంలో వారసుడికి సంస్థ ఉద్యోగ అవకాశం కల్పిస్తోంది. దీనిని ఆసరాగా చేసుకున్న దళారులు, నాయకులు బోర్డులోని అధికారులను మచ్చి చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. ఎలాంటి అనారోగ్యం లేకున్నా అన్ఫిట్ చేయిస్తామని ఒక్కో కేసుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశారు. ఈ క్రమంలో వాస్తవంగా అనారోగ్యంతో ఉన్న కార్మికుల నుంచి సైతం త్వరగా అన్ఫిట్ చేయిస్తామని డబ్బులు దండుకున్నారు. సింగరేణి వ్యాప్తంగా సుమారు 150 మందికి పైగానే బ్రోకర్లు ఉన్నారని అంచనా. ఇందులో పలు సంఘాల నేతలు, ఉద్యోగులు, కొందరు అధికారులు, వైద్యుల పాత్రు సైతం ఉన్నట్లు సమాచారం. అయితే మెడికల్ బోర్డులో అక్రమాలపై దుమారం రేగడంతో ఆగస్టు నుంచి మెడికల్ అన్ఫిట్లు ఆగిపోయాయి. ఎప్పుడు మెడికల్ బోర్డు పెడుతారో తెలియకపోవడంతో బ్రోకర్లకు డబ్బులిచ్చిన కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బ్రోకర్ల వెంబడి పడుతున్నారు. ఉదయం, సాయంత్రం వారి ఇళ్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
దీంతో కొందరు ఇంట్లో ఉండి కుటుంబ సభ్యులతో లేడని చెప్పి తప్పించుకుంటున్నారు. కార్మికుల వద్ద నుంచి వసూలు చేసిన డబ్బును కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. అలాంటి వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.
బ్రోకర్లకు బిగుస్తున్న ఉచ్చు
Published Sat, Nov 15 2014 3:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’.. కాంగ్రెస్పై ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
తప్పక చదవండి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement