ఈతకెళ్లిన బాలుడు మృతి | boy dies while swimming | Sakshi
Sakshi News home page

ఈతకెళ్లిన బాలుడు మృతి

May 8 2015 2:50 PM | Updated on Jul 12 2019 3:02 PM

స్నేహితులతో కలిసి ఈతకెళ్ళిన ఓ బాలుడు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.

సూర్యాపేట(నల్లగొండ) :  స్నేహితులతో కలిసి ఈతకెళ్ళిన ఓ బాలుడు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా రామచంద్రాపురానికి చెందిన శాంతి చంద్రం అనే వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి ఓ వివాహం కోసం సూర్యాపేట వెళ్ళారు. బస్సులు బంద్ కావడంతో అక్కడే ఉండిపోయారు. కాగా శుక్రవారం ఉదయం శాంతి చంద్రం కుమారుడు భాను ప్రసాద్(14) ఈత కోసం స్నేహితులతో కలిసి మామిళ్లగడ్డ బాపన బావికి వెళ్ళాడు. ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు బావి నీటిలో మునిగి బాలుడు మృతి చెందాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు బోరున విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement