వరంగల్ రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం | bomb threat for warangal railway station | Sakshi
Sakshi News home page

వరంగల్ రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం

May 1 2015 6:39 PM | Updated on Sep 3 2017 1:14 AM

వరంగల్ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం బాంబు కలకలం రేగింది.

వరంగల్ (కరీమాబాద్) : వరంగల్ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం బాంబు కలకలం రేగింది. ఓ ఆగంతకుడు రైల్వే ఎస్పీకి ఫోన్ చేసి స్టేషన్ ఆవరణలో బాంబు పెట్టినట్లు తెలిపాడు. దీంతో అప్రమత్తమైన రైల్వే, జిల్లా పోలీసులు డీఎస్పీ సురేంద్రనాథ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. బాంబ్, డాగ్ స్కాడ్‌లు స్టేషన్‌లో అణువణువూ గాలించారు. కాగా ఇప్పటి వరకు ఎలాంటి బాంబు లభ్యం కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement