సీఐడీ కస్టడీకి బోధన్‌ స్కామ్‌ నిందితులు | Bodhan scam accused in CID custody | Sakshi
Sakshi News home page

సీఐడీ కస్టడీకి బోధన్‌ స్కామ్‌ నిందితులు

Mar 15 2017 2:28 AM | Updated on Apr 3 2019 5:38 PM

కమర్షియల్‌ ట్యాక్స్‌ చలాన్ల కుంభకోణంలో కోర్టులో లొంగిపోయిన ముగ్గురు నిందితులను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: కమర్షియల్‌ ట్యాక్స్‌ చలాన్ల కుంభకోణంలో కోర్టులో లొంగిపోయిన ముగ్గురు నిందితులను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. బోధన్‌ సర్కిల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఏసీటీవో, ఓ సీనియర్, మరో జూనియర్‌ అసిస్టెంట్‌ గత వారం కోర్టులో లొంగిపోయారు. వారిని విచారించి కేసుకు సంబంధించి మిగిలిన నిందితుల పాత్రను నిరూపించాల్సి ఉందని, కాబట్టి వారిని కస్టడీకి అప్పగించాలని సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు వారం రోజుల పాటు ఆ ముగ్గురిని విచారించేందుకు కోర్టు అనుమతిచ్చిందని సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా తెలిపారు. కేసులో కీలకంగా ఉన్న ప్రైవేట్‌ ట్యాక్స్‌ కన్సల్టెంట్‌ శివరాజు, అతడి కుమారుడు సునీల్‌ కోసం సీఐడీ బృందాలు వేటసాగిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement