ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అస్వస్థత | Basara IIIT Students Hospitalized due to Food Poisoning | Sakshi
Sakshi News home page

ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అస్వస్థత

Apr 11 2016 3:54 AM | Updated on Oct 5 2018 6:48 PM

ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అస్వస్థత - Sakshi

ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అస్వస్థత

ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలం బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులు ఆదివారం అస్వస్థతకు గురయ్యూరు.

భైంసా: ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలం బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులు ఆదివారం అస్వస్థతకు గురయ్యూరు. ఆదివారం మధ్యాహ్నం కళాశాల ప్రాంగణంలో ఈ-3, ఈ-4 విద్యార్థులు భోజనానికి వెళ్లారు. భోజనం చేసిన కొద్దిసేపటికే సుమారు వంద మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ట్రిపుల్‌ఐటీలోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. వైద్యాధికారి సామ్రాట్ విద్యార్థులందరికీ చికిత్స అందిస్తున్నారు.  ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల పరిస్థితిని వీసీ సత్యనారాయణ ఆస్పత్రికి వెళ్లి పరిశీలించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement