కొత్తగూడెం: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. పాఠశాలలో వడ్డించిన చికెన్ కర్రీ తిన్న సుమారు 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలతో బాధపడడంతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


