అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | A farmer suicide due to financial problems | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Mar 11 2015 5:49 PM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేసారం గ్రామంలో జరిగింది.

చేవెళ్ల రూరల్ (రంగారెడ్డి): అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేసారం గ్రామంలో జరిగింది. పాలె పెంటయ్య (30) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఓ వేడుక కోసం వెళ్లినట్టు సమాచారం. తిరిగి బుధవారం ఉదయం వారు ఇంటికి చేరుకోగా ఆత్మహత్య వెలుగు చూసింది. సాగు కోసం రూ.2 లక్షల వరకు అప్పులు చేసిన పెంటయ్య మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement