మరో మూడు ఆస్పత్రుల్లో నైట్‌ షెల్టర్లు ప్రారంభం | 3 new night shelters open | Sakshi
Sakshi News home page

మరో మూడు ఆస్పత్రుల్లో నైట్‌ షెల్టర్లు ప్రారంభం

Jan 13 2018 4:16 PM | Updated on Oct 17 2018 5:43 PM

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల బంధువుల కోసం జీహెచ్‌ఎంసీ మరిన్ని నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 12 ఉండగా మరో మూడింటిని కొత్తగా ఏర్పాటు చేశారు. నిలోఫర్, మహావీర్, కోఠి ప్రసూతి ఆస్పత్రుల్లో రూ.4.8 కోట్లతో వీటిని ఏర్పాటు చేశారు.  ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, నగర మేయర్ రామ్మోహన్‌లు వీటిని ప్రారంభించారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న తమ వారి కోసం వచ్చే అటెండెంట్లు రాత్రివేళ బస చేసేందుకు సరైన నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నైట్‌ షెల్టర్లు వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement