breaking news
-
కల్వకుంట్ల కుటుంబంలో అధికార పంచాయితీ: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: కవిత సస్పెన్షన్పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు స్పందించారు. కవిత సస్పెన్షన్ బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారంగా ఆయన చెప్పుకొచ్చారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవం.. ఆ అవినీతి సొమ్ము పంపకంలో తేడాలు వచ్చాయి. అందుకే ఈ విషయాలన్నీ బయటపడుతున్నాయని రామచందర్రావు వ్యాఖ్యానించారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. కాళేశ్వరంలో అవినీతిపై కవిత మాటలను ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇదే విషయం బీజేపీ చెబితే రాజకీయం అంటారు’’ అని రామచందర్రావు పేర్కొన్నారు.అవినీతి డైవర్షన్.. కవిత సస్పెన్షన్: డీకే అరుణకవిత సస్పెన్షన్ను కల్వకుంట్ల కుటుంబంలో అధికార పంచాయితీగా ఎంపీ డీకే అరుణ అభివర్ణించారు. ఆ కుటుంబంలో అందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కవిత ఏకంగా జైలుకే వెళ్లి వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి డైవర్షన్లో భాగంగానే కవిత సస్పెన్షన్. బీఆర్స్, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి’’ అంటూ డీకే అరుణ వ్యాఖ్యానించారు.కుటుంబ విషయాల్లో బీజేపీ జోక్యం చేసుకోదు: హరీష్బాబుబీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు మాట్లాడుతూ.. కవితపై వేటు పూర్తిగా కుటుంబ వ్యవహారమన్నారు. ‘‘కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు బయటపడుతున్నాయి. కుటుంబ విషయాల్లో బీజేపీ జోక్యం చేసుకోదు. కాళేశ్వరం అవినీతిలో ఇద్దరి పాత్ర ఉందని కవిత చెప్పారు. సీబీఐకి కవిత పూర్తి వివరాలు అందించాలి’’ అని హరీష్బాబు పేర్కొన్నారు. -
అక్కకు అడ్డొస్తే.. కవిత అనుచరుల వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ‘‘వాడెవ్వడు వీడెవ్వడు కవిత అక్కకు అడ్డు ఎవడు’’ అంటూ జాగృతి కార్యాలయంలో కవిత అనుచరులు నినాదాలు చేశారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి.. జై జాగృతి అంటూ నినాదాలు చేశారు. ఖబర్దార్ హరీష్రావు అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవిత అక్కకు అడ్డొస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చిన ఆమె అనుచరులు.. సస్పెండ్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.‘‘కవిత సస్పెన్షన్తో జరిగేది ఏమీలేదు. కేసీఆర్పై సీబీఐ విచారణను కవిత తట్టుకోలేకపోయారు. చాలా రోజులుగా కవితను దూరంపెట్టే యోచన జరుగుతోంది’’ అంటూ బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేయడంపై తెలంగాణ జాగృతి ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ ప్రతిష్ట దిగజార్చే చర్యలను సహించబోమన్న జాగృతి కార్యకర్తలు.. కవిత వ్యాఖ్యలపై కనీసం వివరణ కోరలేదని మండిపడ్డారు. కొందరి కళ్లల్లో ఆనందం కోసమే సస్పెన్షన్ నిర్ణయం’’ అంటూ జాగృతి కార్యకర్తలు మండిపడ్డారు. -
షాకులిచ్చిన కవితకే బిగ్ షాక్!
గీత దాటితే బహిష్కరణలే తప్ప మరొకటి ఉండని పార్టీ.. అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న సంచలన అభియోగం మీద గులాబీ అధినేత కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే.. గతంలో పార్టీ తీసుకున్న చర్యల దృష్ట్యా కవిత బహిష్కరణ తప్పదంటూ ఈ ఉదయం నుంచి జోరుగా ఊహాగానాలు వినిపించాయి. అలాంటప్పుడు సస్పెన్షన్ వేటుతోనే ఎందుకు సరిపెట్టాల్సి వచ్చింది?.. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినా సరే క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. విచారణలు, నోటీసులు, షోకాజ్ల్లాంటివేం లేకుండా నేరుగా కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ నుంచి సాగనంపుతూ వచ్చింది. గతంలో.. గాదె ఇన్నయ్య, విజయశాంతి, ఆలె నరేంద్ర, ఎమ్మెల్సీ భూపతి రెడ్డిపైనా బహిష్కరణ వేటే వేసింది. 2021లో ఈటల రాజేందర్పైనా నేరుగా బహిష్కరణ అస్త్రం ప్రయోగించింది. అలాంటిది గత 12 ఏళ్లుగా పార్టీలో మూలనపడిన క్రమశిక్షణ కమిటీని తెర మీదకు తెచ్చి మరీ.. కవితను సస్పెండ్ చేయడం ఆశ్యర్యానికి కలిగిస్తోంది. కిందటి ఏడాది ఆగస్టులో.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలుకు వెళ్లొచ్చాక కవిత కొంతకాలం పాటు వ్యక్తిగత జీవితం మీదే ఫోకస్ చేశారు. అయితే.. ఈ ఏడాదిలో క్రియాశీలకంగా మారిన ఆమె 2.0 రాజకీయంతో సొంత పార్టీకే వరుస షాకులు ఇస్తూ వచ్చారు.షాక్ నెంబర్ 1..పార్టీ ఆవిర్భావ వేడుకలపై విమర్శలతో బహిరంగ లేఖ రాయడం మే నెలలో కలకలం రేపింది. రజతోత్సవ సభ(బీఆర్ఎస్ సస్లివర జూబ్లీ వేడుకలో)లో సాగిన అధినేత ప్రసంగంపై కేడర్ అసంతృప్తిగా ఉందంటూ.. కేసీఆర్కు బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో కేసీఆర్ దేవుడేకానీ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తన తండ్రికి రాసిన లేఖను కొందరు ఉద్దేశపూర్వకంగానే బయటపెట్టారంటూ మండిపడ్డారామె.షాక్ నెంబర్ 2.. పార్టీ అంతర్గత విషయాలు బయట చర్చించడం మంచిదికాదన్న సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలి... కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా? అని మే 29వ తేదీన జరిగిన మీడియా చిట్చాట్లో వ్యాఖ్యానించారు. ఆపై రెండు రోజులుగా కొత్తగా తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని బంజారాహిల్స్లో ప్రారంభించారు. అంతేకాదు.. ఈ ఏడాది కేటీఆర్ చేతికి కవిత రాఖీ కూడా కట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది.షాక్ నెంబర్ 3..కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు విచారణ నోటీసులు ఇవ్వడంపై నిరసనగా.. జూన్ 10వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారామె. అయితే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పూర్తిగా దూరంగా ఉంది. షాక్ నెంబర్ 4..జూన్ 16వ తేదీన.. ఫార్ములా ఈకార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ముందు విచారణకు హాజరైతే.. అదేరోజు అదేంపట్టనట్లు జగిత్యాలలో ఆమె పర్యటించారు. షాక్ నెంబర్ 5..జులైలో.. జహీరాబాద్లో జరిగిన బీసీ రిజర్వేషన్ల సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్మల్లన్న కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి ఆమె వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు మండలి చైర్మన్కు ఆమె మల్లన్నపై చర్యలు తీసుకోవాలంటూ లేఖ కూడా రాశారు. అయితే ఇంత జరిగినా.. బీఆర్ఎస్ ఈ వ్యవహారానికి దూరంగా ఉంది. షాక్ నెంబర్ 6..బీఆర్ఎస్ కేడర్ను అయోమయానికి గురిచేసిన పరిణామం ఇది. జులై 26వ తేదీన ఉప్పల్లో కేటీఆర్ బీఆర్ఎస్వీ సభ, కొంపల్లిలో తెలంగాణ జాగృతి కార్యక్రమాలను కవిత నిర్వహించారు. షాక్ నెంబర్ 7..పార్టీతో సంబంధం లేకుండా బీసీ రిజర్వేషన్ల సాధనాదీక్ష చేపట్టారు. జై బీసీ.. జై జాగృతి నినాదాలు చేశారుషాక్ నెంబర్ 7..ఆగష్టు 5వ తేదీన మాజీ మంత్రి జగదీష్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండలో బీఆర్ఎస్ను నాశనం చేసిన లిల్లీపుట్ నేత వ్యాఖ్యానించడం తీవ్ర కలకలం రేపింది. షాక్ నెంబర్ 8.. కాళేశ్వరంపై బాంబ్ పేల్చారామె. హరీష్రావు, సంతోష్ రావుల వల్లే కేసీఆర్కు అవినీతి మరక అంటిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రిపై సీబీఐ ఎంక్వైరీనా?అంటూ రగిలిపోయిన ఆమె.. ఇంతదాకా వచ్చినా పట్టనట్లు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారామె. ఈ వరుస షాకులిస్తున్నా.. తనపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆమె విమర్శలకు మరింత పదును పెట్టారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలను అధినేత కేసీఆర్ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కవితపై కఠిన చర్యలే ఉండాలని సీనియర్లు పలువురు కేసీఆర్ వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే జాగృతి సుదీర్ఘంగా బీఆర్ఎస్కు అనుబంధ సంస్థగా కొనసాగుతుండడం.. కవిత విషయంలో కఠిన చర్యలు తీసుకుంటే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ మంతనాలు జరిపారు. కవితపై తీసుకోబోయే చర్యలు రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై తీవ్రంగా చర్చించారు. చివరాఖరికి సస్పెండ్ వైపే మొగ్గు చూపారు. ఇప్పుడు.. కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా.. బీఆర్ఎస్లో 2025 ఏడాది కల్వకుంట్ల కవిత కల్లోలనామ సంవత్సరంగా మిగిలిపోనుంది. -
కవిత సస్పెన్షన్పై టీపీసీసీ చీఫ్ రియాక్షన్
సాక్షి,హైదరాబాద్:ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ నుంచి కవితను స్పస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఈ క్రమంలో కవిత సస్పెన్షన్పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. కవిత సస్పెన్షన్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారం.అందులో మేం తలదూర్చం.ఇది అంతా ఆస్తి పంపకాల్లో గొడవలా కనిపిస్తోంది. కాంగ్రెస్కు కవిత అవసరం లేదు. ఎవరినీ మాపార్టీలో చేర్చుకోవాల్సి అవసరం లేదు’అని వ్యాఖ్యానించారు. -
కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ కుట్ర: పల్లా
సాక్షి, హైదరాబాద్: పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరిపై అయినా చర్యలు తప్పవంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పల్లా చెప్పుకొచ్చారు. కవిత వ్యాఖ్యలు వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందన్న పల్లా.. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. ‘‘ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు.. కేసీఆర్ ఆదేశాలే మాకు శిరోధార్యం’’ అంటూ పల్లా రాజేశ్వర్రెడ్డి తేల్చి చెప్పారు.కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కేపీ వివేకానందకేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ‘‘గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను కవిత అయోమయానికి గురిచేస్తున్నారు. బీఆర్ఎస్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, 60 లక్షల మంది సైనికులు, నాయకులు, కార్యకర్తలు ఉన్న సైన్యం. తప్పు చేస్తే కుటుంబ సభ్యులనైనా సహించమని గతంలోనే కేసీఆర్ చెప్పారు...కన్నకూతురు కంటే కూడా కష్టంలో పార్టీకి అండగా ఉన్న కార్యకర్తల భవిష్యత్త్ ముఖ్యమని తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. పార్టీ కంటే ఎవరు పెద్ద వారు కాదనే విషయం ఈ నిర్ణయంతో స్పష్టమైంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు. ఈ రోజు పార్టీ కోసం కన్న బిడ్డను కూడా వదులుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్’’ అని వివేకానంద పేర్కొన్నారు.కాగా, హరీష్రావు, సంతోష్రావులు అవినీతి అనకొండలన్న కవితపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల కవిత దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీఆర్ఎస్ ఆఫీస్ల్లొ కవిత ఫ్లెక్సీలను తొలగించారు. -
వేటుపై కవిత రియాక్షన్.. సర్వత్రా ఉత్కంఠ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సస్పెన్షన్ విధించడంతో ఎమ్మెల్సీ కవితపై భవిష్యత్ కార్యచరణపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఉత్కంఠకు తెరదించుతూ రేపు (బుధవారం) మధ్యాహ్నం 12గంటలకు కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో కవిత తన రాజకీయ భవిష్యత్ కార్యచరణను ప్రకటించనున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ నుంచి కవితను స్పస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత పార్టీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని హైలెట్ చేస్తూ బీఆర్ఎస్ నోట్ను విడుదల చేసింది. ఆ నోట్లో కవితపై వేటు గల కారణాల్ని ప్రస్తావించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. తనని సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కవిత ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఇదే అంశంపై కవిత స్వయంగా మీడియా ఎదుట వెల్లడించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కవిత.. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
కేసీఆర్ ఆదేశాలతో కవిత సస్పెన్షన్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత కొంతకాలంగా పార్టీ లైన్ దాటి ఆమె వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కవిత వ్యాఖ్యలతో పార్టీకి నష్టం కలుగుతోందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.కవిత ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నష్టం కలిగించే రీతిలోఉన్నందున బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించిందని, తక్షణమే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ప్రధాన కార్యదర్శి టీ రవీందర్రావు, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ మెంబర్ సోమ భరత్కుమార్ పేరిట లేఖ విడుదలైంది. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల నుంచి కవితకు పార్టీకి మధ్య గ్యాప్ మొదలైంది. కేసీఆర్ ప్రసంగంపై ఆమె బహిరంగ లేఖ విడుదల చేయడం కలకలం రేపింది. అటుపై సోదరుడు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా ఆమె అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. ఇక.. లిల్లీపుట్ అంటూ మాజీమంత్రి జగదీష్రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా.. హరీష్రావు, సంతోష్రావులను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలే చేశారామె. పార్టీ MLC శ్రీమతి కె. కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది.పార్టీ అధ్యక్షులు శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు శ్రీమతి కె.… pic.twitter.com/iTSWON3irq— BRS Party (@BRSparty) September 2, 2025 -
షోకాజ్ నోటీసు ఇస్తారా? వేటు వేస్తారా?
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మంగళవారం ఎర్రవెల్లిలోని తన ఫామ్హౌజ్లో కీలక భేటీ నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశంపై ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సుదీర్ఘంగా కొనసాగుతున్న చర్చల దృష్ట్యా కవితపై చర్చలు తప్పవనే సంకేతాలు అందుతున్నాయి.కాళేశ్వరంలో కేసీఆర్కు అవినీతి మరక అంటడానికి హరీష్రావు, సంతోష్రావులే కారణమంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల తర్వాత నిన్న సాయంత్రం నుంచి కీలక నేతలతో సమావేశం జరుపుతున్నారు. మాజీ మంత్రి హరీష్రావు యూకే పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో తాజా పరిణామాలపై అందుబాటులో ఉన్న కీలక నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు.నిన్న అర్ధరాత్రి ఫామ్హౌజ్ నుంచి వెళ్లిపోయిన కేటీఆర్ ఈ ఉదయం మళ్లీ అక్కడకు చేరుకున్నారు. కేటీఆర్తో పాటు జగదీష్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారని సమాచారం. కవిత వ్యాఖ్యలపై పలువురు సీనియర్లతో పాటు కేడర్ కూడా గుర్రుగా ఉంది. మొన్నీమధ్యే బహిరంగ లేఖ పేరిట కేటీఆర్ పైనా ఆమె తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఈ క్రమంలో కవితపై కేసీఆర్ చర్యలకు సిద్ధమవుతున్నారని పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే వ్యాఖ్యలకుగానూ షోకాజ్ నోటీసులు ఇస్తారా? లేదంటే పార్టీ నుంచే సస్పెండ్ చేస్తారా?.. చర్యలు ఎలా ఉండబోతున్నాయనే అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ.. వేటు వేస్తే తలెత్తే పరిణామాలపైనా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి బీఆర్ఎస్కు అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. ఒకవేళ కవితపై వేటు పడితే.. జాగృతిలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎటు వైపు ఉంటారు? అనే కోణంలోనూ చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాళేశ్వరం నివేదిక.. సీబీఐ విచారణకు ఆదేశం దరిమిలా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలో హరీష్రావుపై వ్యాఖ్యలకు నిరసనగా కవిత దిష్టిబొమ్మను దగ్దం చేయడం గమనార్హం. -
ఆ ఇద్దరి వల్లే కేసీఆర్కు మరక: కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: పార్టీ అధినేత పక్కన ఉంటూ ఆయన పేరు చెప్పుకుని అనేక రకాలుగా లబ్ధి పొందిన వారు చేసిన చెత్త పనుల వల్లే కేసీఆర్కు అవినీతి మరక అంటిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాళేశ్వరం అంశంలో కేసీఆర్కు అవినీతి మరక అంటడంలో మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్రావుతో పాటు కాంట్రాక్టర్ మెఘా కృష్ణారెడ్డి పాత్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మేజర్ పాత్ర ఉన్నందునే ఐదేళ్ల పాటు నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్రావును రెండోసారి ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ దూరంగా పెట్టారన్నారు. అమెరికా పర్యటన నుంచి సోమవారం ఉదయం హైదరాబాద్కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.. సాయంత్రం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇలాగైతే పార్టీ ఎలా ముందుకు పోతుంది? ‘కేసీఆర్కు అవినీతి మరక అంటడానికి, ఆయనపై ఆరోపణలు రావడానికి కారకులెవరో బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. కేసీఆర్ ప్రజల కోసం ఆలోచిస్తే.. వీళ్లు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సొంత వనరులు, ఆస్తుల కోసం ఆలోచించారు. కేసీఆర్ కాలిగోటికి సరిపోని వ్యక్తి కేసీఆర్ వైపు వేలెత్తి చూపి సీబీఐ విచారణ జరుపుతా అనేందుకు కారకులు ఎవరు? హరీశ్రావు, సంతోష్రావు నా మీద వ్యక్తిగతంగా అనేక కుట్రలు చేసినా ఇన్నాళ్లూ పేరు పెట్టి విమర్శించలేదు. కానీ ఇలాంటి వారిని మోస్తూ పోతే పార్టీ ఎలా ముందుకు పోతుంది? బీఆర్ఎస్ నాయకులకు కోపం వచ్చినా చేదు నిజాన్ని జీర్ణించుకోక తప్పదు..’అని కవిత అన్నారు. నన్ను విమర్శిస్తే ఖబడ్దార్! ‘హరీశ్, సంతోష్ వెనుక సీఎం రేవంత్ ఉంటూ వాళ్లను అన్ని విషయాల్లో కాపాడుతూ కేసీఆర్ను బదనాం చేస్తున్నారు. బీఆర్ఎస్ను ఇబ్బంది పెడుతున్న అవినీతి అనకొండలను ఏమీ అనడం లేదు. అంతర్గతంగా వారి నడుమ ఉన్న అవగాహన బయటకు రావాలి. నన్ను.. బీజేపీ, కాంగ్రెస్, రేవంత్, బండి సంజయ్ నడిపిస్తున్నారని రేపటి నుంచి సోషల్ మీడియాలో విమర్శిస్తే ఖబడ్దార్. నేను ఎవరో చెప్తే ఆడే తోలు»ొమ్మను కాను. నాది కేసీఆర్ రక్తం. స్వతంత్రంగా నేను అనుకున్న విషయాలను చెప్తా. రాజకీయంగా నాకు జరిగే కష్టం, నష్టాన్ని భరించేందుకు సిద్ధం. మా నాన్నకు లేఖ రాసిన నాటి నుంచి నాకు నరకం చూపిస్తూ సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్లు రాయిస్తున్నారు. కేసీఆర్పై సీబీఐ విచారణ అంటే కడుపు రగులుతోంది. అభివృద్ధి విషయంలో కేసీఆర్ నిజాం బాటలోనే నడుస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టును 200 ఏళ్ల పాటు గుర్తు పెట్టుకుంటారు. అలాంటి ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్పై అభాండాలు వేస్తుంటే గుండె తరుక్కుపోతోంది. మా నాన్న పరువు పోతే నాకు బాధ. కానీ మీకు మాత్రం డబ్బులు కావాలి. ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టాలి. బీఆర్ఎస్ నాయకులు తిట్టుకున్నా, స్థానిక ఎన్నికల్లో నష్టం జరుగుతుందని అనుకున్నా సరే. మా నాన్న మీద సీబీఐ ఎంక్వైరీ పడిన తర్వాత పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత? ఇష్టారీతిన మాట్లాడితే తోలు తీస్తాం ఎన్నికల్లో ఒకసారి ఓడిపోతారు.. మరోసారి గెలుస్తారు. ఇలాంటి దుర్మార్గుల వల్లే ఓడిపోయే పరిస్థితి వచ్చింది. డబ్బులు, టీవీలు, సోషల్ మీడియా ఉన్నాయని ఇష్టారీతిన మాట్లాడితే తోలు తీస్తాం. కేసీఆర్పై పీసీ ఘోష్ కమిషన్లు, సీబీఐ విచారణలు వేస్తే తెలంగాణ బంద్కు పార్టీ పిలుపునివ్వాలి కదా? కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే సీబీఐ విచారణకు ఆదేశించారు. నేను చెప్పిన పేర్లు ఉన్న వారితో రేవంత్కు అవగాహన లేకపోతే వారిపై విచారణ జరపాలి. కేసీఆర్ పేరు చెప్పుకోనిదే రేవంత్కు పూట గడవడం లేదు. వాస్తవానికి కేసీఆర్కు తెలంగాణ తప్ప.. తిండి, డబ్బు ధ్యాస ఉండదు. విచారణ నుంచి కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.’అని కవిత పేర్కొన్నారు. -
హరీష్ రావుపై కేటీఆర్ పొగడ్తల వర్షం
సాక్షి,హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి హరీష్రావును కొనియాడుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేశారు. డైనమిక్ లీడర్ హరీష్రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్ అని ప్రశంసలు కురిపించారు. . నీటిపారుదల గురించి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు.. కేసీఆర్ ప్రియశిష్యుడు హరీష్ ఇచ్చిన పాఠం ఇది అంటూ’ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu https://t.co/w5YGJCETtL— KTR (@KTRBRS) September 1, 2025 -
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ షాక్!
సాక్షి,హైదరాబాద్: ‘కాళేశ్వరం పాపం హరీష్రావు,సంతోష్రావుదేనంటూ’ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలతో ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు షాకిచ్చారు. ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అన్నీ సోషల్ మీడియా అకౌంట్లను అన్ ఫాల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ సైతం హరీష్రావుకు మద్దతు పలుకుతూ ‘సింహం సింగిల్గానే’ వస్తుందని ట్వీట్ చేయడం చర్చాంశనీయంగా మారింది. హరీష్రావు,సంతోష్రావుపై కవిత ఘాటు కామెంట్లు చేశారు. ఆ కామెంట్ల తర్వాత కొద్ది సేపటికే హరీష్రావుపై బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. హరీష్రావు ఆరడుగుల బుల్లెట్టంటూ పోస్టు పెట్టింది. సింహం సింగిల్గానే వస్తుందంటూ ఓ వీడియోను షేర్ చేసింది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ మీడియా గ్రూప్ నుంచి ఎమ్మెల్సీ కవిత పీఆర్వో నవీన్ను తొలగించింది. ఇప్పటి వరకు కవితకు సంబంధించి రోజువారి పార్టీ కార్యచరణను పీఆర్వో నవీన్ బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేస్తూ వస్తున్నారు. హరీష్రావుపై వ్యాఖ్యల తరువాత కవిత పీఆర్వో నవీర్ను గ్రూప్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తొలగించింది. బీఆర్ఎస్ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున కవిత సోషల్ మీడియా అకౌంట్లకు అన్ఫాలో చెబుతున్నారు. కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు పార్టీ ముఖ్య నేతలు జగదీశ్వర్రెడ్డి,పల్లా రాజేశ్వర్రెడ్డి,ప్రశాంత్రెడ్డి ఎర్రవెల్లిలో కేసీఆర్తో చర్చలు జరుపుతున్నారు. వీరి భేటీలో కాళేశ్వరంపై సీబీఐ విచారణ,ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు వంటి అంశాలపై చర్చలు జరుపుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. LIVE: Addressing media https://t.co/C9qlcEwUnc— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 1, 2025 -
‘కవిత వ్యాఖ్యలతో అవినీతి జరిగిందనేది స్పష్టమైంది’
హైదరాబాద్: సీఎం కేవంత్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావులు కలిసి తన తండ్రి కేసీఆర్పై కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే కవిత చేసిన వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ మహేష్గౌడ్ ఖండించారు. సీఎం రేవంత్పై కవిత చేసిన వ్యాఖ్యలను సరికాదన్నారు. కుటుంబ గొడవల్ని తీసుకొచ్చి సీఎం రేవంత్పై రుద్దడం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు మహేష్ గౌడ్. ‘ సీఎం రేవంత్పై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తేలిపోయింది. కాళేశ్వరంలో తప్పు చేసింది కేసీఆర్ లేదా హరీష్ రావా అనేది మాకు అనవసరం. వారి హయాంలో స్కామ్ జరిగిందనేది కవిత వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. కాళేశ్వరంలో మామ కేసీఆర్ వాటా ఎంత..?, అల్లుడు హరీష్ రావు వాటా ఎంత? అనేది తేలాల్సి ఉంది. మీ కుటుంబ కలహాలను మాపై రుద్దడం ఏంటి?’ అని ప్రశ్నించారు. కేసిఆర్ కుటుంబ కలహాలతో కాంగ్రెస్కు సంబంధంలేదన్నారు మహేష్ గౌడ్. ఇదీ చదవండి:కాళేశ్వరంపై బాంబ్ పేల్చిన కవిత -
‘కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోంది?’
హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావును టార్గెట్ చేస్తూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సెటైర్లు వేశారు. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలతో కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోందంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. హరీష్పై కవిత సంచల వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన అద్దంకి దయాకర్.. ‘ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని స్పష్టమైంది. కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోంది. మొన్న కేటీఆర్ను టార్గెట్ చేసిన కవిత.. ఇప్పుడు హరీష్ను టార్గెట్ చేయడం వెనుక ఏదో ఉంది. కేటీఆర్, హరీష్, కవితల మధ్య ఏదో పంచాయితీ ఉంది’ అంటూ అని పేర్కొన్నారు.కాగా, బీఆర్ఎస్ ముఖ్యనేతలు, మాజీ మంత్రి హరీష్రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు వేశారు. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ బద్నాం కావడానికి బీఆర్ఎస్ కీలక నేతలే ముఖ్యకారణమని ఆరోపించారామే. సోమవారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్కు,పార్టీకి నష్టం చేస్తున్న వాళ్ల పేర్లను మొదటిసారి బయటపెడ్తున్నా. కేసీఆర్పై నిందలు ఎవరి వల్ల వస్తున్నాయి. హరీష్రావుది మేజర్ పాత్ర లేదా? హరీష్ రావు,సంతోష్ వెనక సీఎం రేవంత్ ఉన్నారు. హరీష్ రావు, సంతోష్ రావులు నా మీద పెద్ద ఎత్తున కుట్రలు చేశారు. మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వేశారు. నా కడుపు రగిలిపోతుంది. మానాన్నకు తిండి మీద,డబ్బు మీద యావ ఉండదు. తరతతరాల తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్లలో ఉన్న కొంతమంది వల్లే ఇలా జరిగింది. ఇదంతా హరీష్ వల్లే జరిగింది. కేసీఆర్కు అవినీతి మరక ఎలా వచ్చిందో చూడాలి. కేసీఆర్ మీద విచారణ తర్వాత బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ వ్యాఖ్యానించారు. -
‘ఇది ఆరడుగుల బుల్లెట్టు’.. హరీష్రావుకు మద్దతుగా బీఆర్ఎస్
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో మాజీ మంత్రి హరీష్రావు అవినీతికి పాల్పడ్డారంటూ ఆపార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హరీష్ రావుకు బీఆర్ఎస్ మద్దతు పలికింది. హరీష్రావుకు అండగా నిలిచింది. సింహం సింగిల్గా వస్తుందంటూ తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చించిన హరీష్ రావు వీడియోను ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో ఇది ఆరడుగుల బుల్లెట్టు.. సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు అని కామెంట్స్ పెట్టింది. ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి @BRSHarish pic.twitter.com/RT0NtpsgJe— BRS Party (@BRSparty) September 1, 2025 -
కాళేశ్వరంపై బాంబ్ పేల్చిన కల్వకుంట్ల కవిత
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ముఖ్యనేతలు, మాజీ మంత్రి హరీష్రావుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు వేశారు. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ బద్నాం కావడానికి బీఆర్ఎస్ కీలక నేతలే ముఖ్యకారణమని ఆరోపించారామే. సోమవారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్కు,పార్టీకి నష్టం చేస్తున్న వాళ్ల పేర్లను మొదటిసారి బయటపెడ్తున్నా. కేసీఆర్పై నిందలు ఎవరి వల్ల వస్తున్నాయి. హరీష్రావుది మేజర్ పాత్ర లేదా? హరీష్ రావు,సంతోష్ వెనక సీఎం రేవంత్ ఉన్నారు. హరీష్ రావు, సంతోష్ రావులు నా మీద పెద్ద ఎత్తున కుట్రలు చేశారు. మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వేశారు. నా కడుపు రగిలిపోతుంది. మానాన్నకు తిండి మీద,డబ్బు మీద యావ ఉండదు. తరతతరాల తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్లలో ఉన్న కొంతమంది వల్లే ఇలా జరిగింది.ఇదంతా హరీష్ వల్లే జరిగింది. కేసీఆర్కు అవినీతి మరక ఎలా వచ్చిందో చూడాలి. కేసీఆర్ మీద విచారణ తర్వాత బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ వ్యాఖ్యానించారు. నేను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగొచ్చు. నష్టం జరిగినా సరే నేను ఇలాగే మాట్లాడతా. మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్కు మరక అంటడానికి ఇద్దరు, ముగ్గురే కారణం. హరీష్రావు,సంతోష్రావు వల్లే కేసీఆర్పై అవినీతి మరక. ఇలాంటి వారిని ఎందుకు భరించాలి. కేసీఆర్కు అవినీతి మరక ఇలాంటివాళ్ల వల్లనే వచ్చింది. కేసీఆర్ మీద విచారణ అంటే తెలంగాణ బంద్కు పార్టీ ఎందుకు పిలుపునివ్వలేదు?.ఈ సమయంలో తెలంగాణ భగ్గుమనాలి. కానీ పార్టీ ఇలా ఉండటం ఏంటి?.కేసీఆర్పై విచారణ వేసిన తర్వాత పార్టీ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత?.కేసీఆర్కు ఈ వయసులో సీబీఐ ఎంక్వైరీ ఎందుకండి?’.వీళ్లు సొంత వనరులు,ఆస్తులు పెంచుకోవడం కోసం ఇలా చేశారు. దమ్ముంటే హరీష్రావు,సంతోష్రావులపై చర్యలు తీసుకోండి.ఇరిగేషన్ శాఖ అధికారుల వద్ద వందలకోట్లు దొరికాయి. ఆ అధికారుల వెనుక ఎవరున్నారో దర్యాప్తు చేయండి. ఎవరో ఆడిస్తే ఆడే ఆటబొమ్మను కాదు. పిచ్చివాగుడు వాగితే తోలుతీస్తా. కాంప్రమైజ్ అయ్యే ప్రస్తక్తిలేదు. పార్టీ ఓటమికి కారణం కేసీఆర్ వెంట ఉన్నవాళ్లే’ అని ఆవేశంతో మాట్లాడారు. -
‘కాంగ్రెస్,బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ను ప్రజలు గమనిస్తున్నారు’
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్-బీజేపీ బంధం బయటపడిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్,బీజేపీ తీరును ప్రశ్నిస్తూ సోమవారం తెలంగాణ భవన్లో వేముల మీడియాతో మాట్లాడారు.సీబీఐ అంటే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్. బీజేపీ ,సీఎం రేవంత్ రెడ్డి స్నేహ బంధం బయట పడింది. సభలో హరీష్ రావు మాట్లాడుతుంటే 10 మంది మంత్రులు 33 సార్లు అడ్డు తగిలారు. బీజేపీ సభ్యుడిని కాంగ్రెస్ ఉపయోగించుంది. ఎనిమిది మంది సభ్యులున్న బీజేపీకి 90 నిమిషాలు ఇచ్చారు. కాంగ్రెస్,బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ను ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ స్క్రిప్ట్నే పాల్వాయి హరీష్ మాట్లాడారు. హరీష్రావు ప్రసంగాన్ని కాంగ్రెస్,బీజేపీ అడ్డుకుందని ఆరోపించారు. -
తీర్పు పేరుతో భయపెట్టాలని చూశారు.. అది సాధ్యం కాదు: సుదర్శన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ సమయంలో సుదర్శన్ రెడ్డి గెలుపు అవసరం అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే తాను ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు సుదర్శన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీపీఐ సీనియర్ నేత నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, కర్ణాటక రాజ్యసభ సభ్యుడు నసీర్ హుస్సేన్, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఏ పార్టీతో సంబంధం లేదు, సభ్యత్వం కూడా లేదు. ఓటు చోరీ జరుగుతున్న ఈ సమయంలో న్యాయ కోవిదుడి గెలుపు అవసరం. మీ ఆత్మప్రబోధానుసారం ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయండి. రాజ్యాంగాన్ని మార్చాలని ఎన్డీయే ప్రయత్నిస్తోంది. సుదర్శన్ రెడ్డి గెలుపు తెలుగు వారి ప్రతిష్ట పెరుగుతుంది. ఓట్ల చోరీతో ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూస్తోంది. పార్టీలకు అతీతంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించాం. సుదర్శన్ రెడ్డి రాకతో ఎన్డీయేకు బలమైన పోటీ ఇస్తున్నాం. జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సమయంలో సుదర్శన్ రెడ్డి గెలుపు అవసరం. ఉపరాష్ట్రపతి రాజీనామా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాజకీయాలు పక్కన పెట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అసదుద్దీన్ ఒవైసీలు మద్దతు ఇవ్వాలని గతంలో విజ్ఞప్తి చేశాను. మళ్ళీ కోరుతున్నాను అని అన్నారు. అనంతరం, అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లోకి ప్రవేశించలేదు. నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. ఇక ముందు కూడా ఉండదు. రాజకీయం అనే ముళ్ల కిరిటాన్ని నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నావు అని చాలా మంది అడిగారు. రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అని చెప్పాను. పౌర హక్కులు, సామాజిక న్యాయం గురించి మాట్లాడతాను. ఒక తీర్పు గురించి చర్చను ప్రారంభించారు. ఆ తీర్పు గురించి చర్చిస్తే నేను భయపడతానని అనుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు గురించి చర్చ చేసేటప్పుడు ముందు దాన్ని చదవాలి’ అని హితవు పలికారు. -
రేవంత్.. కొండను తవ్వి ఎలుకను పట్టారా?: లక్ష్మణ్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీ బిల్లుపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్. ఇదే సమయంలో కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం రుజువులు మాయం చేసేందుకు పీసీ ఘోష్ కమిషన్ వేశారా? అని ప్రశ్నించారు. విధిలేని పరిస్థితిల్లో సీబీఐకి అప్పగించారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. విధిలేని పరిస్థితిల్లో సీబీఐకి అప్పగించారు. కాళేశ్వరం అవినీతి రుజువులన్నీ సీబీఐకి అప్పగించాలి. 22 నెలల తర్వాత రేవంత్కు కనువిప్పు కలిగింది. ఆరు నెలల్లో నిగ్గు తేల్చుతామని అన్నవారు ఎందుకు కాలయాపన చేశారు. కాళేశ్వరం రుజువులు మాయం చేసేందుకు పీసీ ఘోష్ కమిషన్ వేశారా?. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్కు చిత్తశుద్ది లేదు. ముస్లింలను బీసీల్లో ఎలా చేరుస్తారు?. బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ఉంది. నెహ్రు నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ నేతలు బీసీలను మోసం చేశారు. కాలయాపన కొరకే ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారు.సీబీఐకి అన్ని ఆధారాలు ఇవ్వాలి. లేదంటే బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుంది. ప్రజలకు ఉన్న అనుమానాలు నివృతి చేయాలి. కాంగ్రెస్ బీసీ బిల్లుపై మొదటి నుంచి ద్వంద్వ వైఖరి పాటిస్తుంది. ఒక్కసారేమో ఆర్డినెన్సు అన్నారు. ఇంకోసారి ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రి ధర్నా చేశారు. అసలు న్యాయపరమైన చిక్కులకు మీరు తీసుకున్న చర్యలు ఏంటి?. నెపంతో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. బీసీల కొరకు సర్వే చేశారా? ముస్లిం కొరకు సర్వే చేశారా?. బీసీలను మోసం చేయడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. బిల్లు పెట్టడమే కాదు బిల్లు పాస్ అయ్యేలా సీఎం రేవంత్ పూర్తి బాధ్యత తీసుకోవాలి. బీజేపీ బీసీల 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది’ అని చెప్పుకొచ్చారు. -
‘‘మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా?’’
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) ద్వారా విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి కీలక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకట ఆధారంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కాంగ్రెస్పై సెటైర్లు సంధించారు. సత్యమేవ జయతే అంటూ కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో.. ‘‘కాళేశ్వరంను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ కరెన్సీ మేనేజర్(CM) నిర్ణయం తీసుకున్నారు. విపక్ష పార్టీలను నాశనం చేసే సెల్గా సీబీఐని గతంలో రాహుల్ గాంధీ అభివర్ణించారు. మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే.. The Currency Manager (CM) of Rahul Gandhi in Telangana has decided to handover Kaleshwaram case to CBIThe very CBI that @RahulGandhi had famously called “Opposition Elimination Cell” of the BJPHave you any clue Mr. Gandhi on what your CM is doing? Bring it on, whatever it… pic.twitter.com/3vBYbf5Atd— KTR (@KTRBRS) September 1, 2025ఎన్ని కుట్రలు చేసినా సరే.. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తామని, న్యాయయ వ్యవస్థ, ప్రజలపై మాకు నమ్మకం ఉంది అని ట్వీట్లో పేర్కొన్నారాయన. ఇదిలా ఉంటే.. గతంలో దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభావితం చేస్తోందని చేసిన ట్వీట్ తాలుకా స్క్రీన్ షాట్ను కేటీఆర్ తన ట్వీట్లో పోస్ట్ చేశారు. సీబీఐ, ఈడీలాంటి దర్యాప్తు సంస్థలను రాజకీయంగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలపై టార్గెట్ చేస్తున్నారని గతంలో రాహుల్ గాంధీ పలుమార్లు ఆరోపించారు. తద్వారా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని తీవ్రవ్యాఖ్యలే చేశారాయన. -
చర్చ లేకుండానే బీసీ బిల్లుకు మండలి ఆమోదం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ శాసనమండలిలో సోమవారం తీవ్ర గందరగోళం నెలకొంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం వద్దకు చేరి ‘‘రాహుల్కు సీబీఐ వద్దు.. రేవంత్కు సీబీఐ ముద్దు’’ అంటూ నినాదాలు చేశారు. ఆ ఆందోళనల నడుమే బీసీల రిజర్వేషన్లను పెంచేందుకు వీలుగా రూపొందించిన తెలంగాణ పంచాయతీరాజ్ 2025 బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. అయితే.. ఈ పరిణామంతో బీఆర్ఎస్ సభ్యులు తమ ఆందోళనను మరింత ఉదృతం చేశారు. కాళేశ్వరం ప్రతులను చించేసి మండలి చైర్మన్ మీదకు విసిరేశారు. దీంతో.. మంత్రి పొన్నం బీఆర్ఎస్ సభ్యులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఫ్యూడలిస్ట్ పార్టీ. బీసీల అంశం చర్చకు వస్తె.. ఇలా అడ్డుపడటం సరికాదు. బీసీల పట్ల వాళ్లకున్న గౌరవం, వైఖరి స్పష్టమవుతోంది. సమాజం వాళ్లను గమనిస్తోంది. 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకోకండి. సర్వేలో కూడా పాల్గొనలేదు. కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఇలా అడ్డుకోవడం ఏం పద్ధతి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మీ పార్టీకి బీసీ రిజర్వేషన్లు ఇష్టం లేకపోవచ్చు. కానీ, ఇలా అడ్డుకునే కుట్ర మాత్రం దౌర్భాగ్యం అని మంత్రి పొన్నం అన్నారు. సభలో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జై తెలంగాణ నినాదాలు చేసే అర్హత బీఆర్ఎస్కు లేదు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చినప్పుడే తెలంగాణతో వాళ్ల బంధం తెగిపోయింది. తెలంగాణ ప్రజలను అడుగడుగునా మోసం చేసిన టిఆర్ఎస్కు తెలంగాణ మాట పలికే అర్హతను కోల్పోయింది అని అన్నారామె.అయినా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగడంతో.. చర్చ లేకుండానే పంచాయతీ చట్ట సవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. అనంతరం మండలి నిరవధిక వాయిదా పడింది. -
ఎర్రవల్లికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు.. కేసీఆర్తో కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఎర్రవల్లి ఫాంహౌస్కు చేరుకుంటున్నారు. కేసీఆర్తో కేటీఆర్ భేటీ అయ్యారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక, పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నట్టు సమాచారం. -
డిక్లరేషన్ కాదు.. డెడికేషన్ కావాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నిజంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనుకుంటే కావాల్సింది డిక్లరేషన్లు కాదని, డెడికేషన్ అని అన్నారు. శాసనసభలో ఆదివారం పంచాయతీరాజ్, పురపాలక చట్ట సవరణ బిల్లులపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘కాంగ్రెస్ నేత రాహుల్గాందీ, ప్రధానమంత్రి అరగంటపాటు మాట్లాడుకుంటే అనుకున్న తరహాలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు నిజంగా న్యాయం చేయొచ్చు. అసెంబ్లీలో ఎన్ని గంటలు చర్చించినా ఉపయోగం ఉండదు. నిజంగా బీసీలకు న్యాయం చేయాలంటే ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి. ఈ విషయం ముఖ్యమంత్రికి, మంత్రులకు తెలుసు. తెలిసి కూడా చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దీనిపై ఐదు నాలుకలు, ఐదు స్వరాలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగబద్ధంగా సాధిస్తామని ఒకసారి, ఆర్డినెన్స్ ద్వారా అని ఇంకోసారి, పార్టీ పరంగా అని మరోసారి, రాహుల్గాంధీ ప్రధాని అయిన తర్వాత అని ఓసారి, ఇప్పుడేమో బిల్లు తెచ్చి చేస్తామని అంటున్నారు. ఇదంతా బీసీలు గమనించటం లేదనుకుంటున్నారా?’అని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లకు 50 శాతం సీలింగ్ గత ప్రభుత్వంలో పెట్టారంటూ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ‘స్థానిక సంస్థల్లో బీసీలకు 37 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన బిల్లే రాష్ట్రపతి వద్ద ఇంకా పెండింగులో ఉంది. దాన్ని వెనక్కి తెప్పించి ఇప్పుడు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను పంపాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో పంపిన ఆర్డినెన్స్పైనే సంతకం చేయని గవర్నర్, ఇప్పుడు బిల్లుపై సంతకం చేస్తారని ఎలా భావిస్తున్నారు? జిత్నీ ఆబాదీ ఉత్నా హఖ్, జిత్నీ భాగేదారీ ఉత్నీ హిస్సేదారీ’అని చెప్పే రాహుల్గాంధీ బీసీల రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు’అని కేటీఆర్ నిలదీశారు. ఆర్థికంగా ఎదిగినప్పుడే న్యాయం.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వేలో బీసీల జనాభా 6 శాతం తగ్గిందని తేలినా దానిపై సమీక్షించలేదని కేటీఆర్ విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ‘రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వడంతోనే సామాజిక న్యాయం జరగదు. ఆర్థికంగా కూడా ఎదగాల్సి ఉంటుంది. ఎలాంటి లొసుగులు లేకుండా చట్టాలను చేస్తే ఏ న్యాయ వ్యవస్థ కూడా అడ్డుపడదు. భావ సారూప్యత లేకపోయినా ధ్యేయ సారూప్యతతో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే విషయంలో మేము చిత్తశుద్ధి, నిజాయితీగా ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాం. మా ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచి్చన వెంటనే ప్రస్తుత ముఖ్యమంత్రి సన్నిహితుడైన గోపాల్రెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకు వెళ్లి దాన్ని అడ్డుకున్నారు’అని కేటీఆర్ విమర్శించారు. న్యాయ సమీక్షకు నిలబడని జీఓలతో బీసీల జీవితాలు ఎలా మారుస్తారో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి దగ్గరికి రాష్ట్రం నుంచి అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని సూచించారు. రిజర్వేషన్ల సాధనకు సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలని కోరారు. -
కల్వకుండా చేసే కుటుంబమది!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కుటుంబం రాష్ట్రంలో వివిధ సామాజికవర్గాలు సుహృద్భావంతో కలిసిపోకుండా అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించటం కల్వకుంట్ల కుటుంబానికి ఇష్టంలేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం గరిష్ట పరిమితిని ఎత్తివేసేందుకు ప్రతిపాదించిన మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై ఆదివారం శాసనసభలో జరిగిన చర్చలో బీఆర్ఎస్ సభ్యుడు గంగుల కమలాకర్ చేసిన విమర్శలకు సీఎం రేవంత్ ఘాటుగా సమాధానమిచ్చారు. ‘అది కల్వకుంట్ల కాదు.. ఎవరినీ కల్వకుండ చూసే కుటుంబం. బీసీలు, ఓసీలు కలవొద్దు.. ఎస్సీలు, ఎస్టీలు కలవొద్దు.. హిందువులు, ముస్లింలు కలవకుండా చూసే కుటుంబం అది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే సంతోషంగా ఉండేవారిలో మొదటి వరుసలో తాను ఉంటానని గంగుల కమలాకర్ అన్నారు. కానీ వాళ్ల నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు సంతోషంగా ఉంటారని చెప్పలేదు. వాళ్ల నాయకులు కడుపునిండా విషం పెట్టుకుని ఉన్నారని చెప్పకనే చెప్పారు’అని దుయ్యబట్టారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం.. హైకోర్టు ఆదేశాలను అనుసరించే రాష్ట్రంలో కుల గణన నిర్వహించామని సీఎం తెలిపారు. ‘బీసీల గణన బాధ్యతను తొలుత రాష్ట్ర బీసీ కమిషన్కు అప్పగించగా, డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఆ ప్రక్రియ చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. పిటిషన్ విచారించిన హైకోర్టు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మరుక్షణమే డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసి కుల గణన నిర్వహించాం. ఎలాంటి అడ్డంకులు రాకూడదనే అధికారుల కమిటీని, మంత్రులను ఇతర రాష్ట్రాలకు పంపి సమాచారాన్ని సేకరించాం. న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలను పరిశీలించిన తరువాతనే డెడికేటెడ్ కమిషన్ను నియమించాం. ఈ ప్రక్రియను 2024 ఫిబ్రవరి 4న ప్రారంభించి 2025 ఫిబ్రవరి 4న పూర్తిచేశాం. 365 రోజుల్లోనే పకడ్బందీగా చట్టాన్ని చేసి స్థానిక సంస్థల్లో బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. మంత్రివర్గ తీర్మానం చేసి శాసనసభలో ఆమోదించుకుని.. విద్య, ఉద్యోగ రంగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించిన రెండు వేర్వేరు బిల్లులను గవర్నర్కు పంపించాం. గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారు. 5 నెలలుగా ఆ బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. సెపె్టంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది’అని సీఎం గుర్తు చేశారు. ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా లాబీయింగ్ ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం లోపే ఉండాలని గత ప్రభుత్వం 2018, 2019లో తీసుకొచ్చిన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు గుదిబండగా మారాయి. అందుకే ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని గవర్నర్కు పంపించాం. ఒకప్పుడు ఓ రాష్ట్రానికి ఆయన (గవర్నర్) ఆర్థిక మంత్రి. ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి (ఈటల రాజేందర్)గా పనిచేసిన ఆయనతో మితృత్వం ఉంది. రాష్ట్రపతికి పంపించాలని తెరవెనుక లాబీయింగ్ చేస్తే ఈ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి వద్దకు పోయింది. ఆర్డినెన్స్ ఆమోదం పొందలేదు కాబట్టి అత్యవసరంగా ఆ బిల్లును సభలో ఆమోదించుకుందాం అంటే ఏదేదో మాట్లాడుతున్నారు. బీసీ కమిషన్కు ఇచ్చిన జీఓనైనా, డెడికేటెడ్ కమిషన్కు ఇచ్చిన జీఓనైనాం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆకాంక్షతోనే ఇచ్చాం’అని సీఎం స్పష్టం చేశారు. ఐదుసార్లు కోరినా ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదు.. పెండింగ్ బిల్లులపై సంప్రదించేందుకు ఐదుసార్లు ప్రధానికి లేఖ రాసినా అపాయింట్మెంట్ ఇవ్వలేదని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. అందుకే ప్రధాని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, గంగలు కమలాకర్ అటువైపు కన్నెత్తి చూడలేదని.. అంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి వాళ్ల పార్టీ నాయకుడు సిద్ధంగా లేరని అర్థమవుతోందని ఆరోపించారు.బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ తన పలుకుబడితో ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు. ‘రాహుల్గాంధీ ధర్నాకు రాలేదని గంగుల అన్నారు. రాహుల్గాంధీ చెప్పకపోతే ఇంత ముఖ్యమైన పని నేను చేస్తానా? రాహుల్గాం«దీకి తెలియకుండా ఏదీ చేయను. వందేళ్లుగా చేయని పనిని మేం చేస్తే.. కేసీఆర్ సభకు వచ్చి మమ్మల్ని అభినందించి ఉంటే పెద్దరికం పెరిగి ఉండేది. వారేమో రారుం..వచ్చిన వాళ్లు ఇలా ఉన్నారు’అని సీఎం మండిపడ్డారు. -
నీటి లభ్యత కోసమే మేడిగడ్డకు..: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కొనసాగించేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో కృషి చేశామని.. మహారాష్ట్ర ప్రభుత్వంతోపాటు సీడబ్ల్యూసీ, నిపుణుల కమిటీ, ఇతర సంస్థలన్నీ ఆ ప్రాజెక్టుకు ఒప్పుకోకపోవడం వల్లే దానిని మేడిగడ్డకు మార్చామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో ఆదివారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు గల కారణాలను వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పలుమార్లు హరీశ్రావుకు సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు అడ్డు తగిలారు. ఒక సమయంలో హరీశ్రావుకు స్పీకర్ మైక్ కట్ చేసి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో బీఆర్ఎస్ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు జోక్యంతో హరీశ్రావుకు స్పీకర్ కొంత సమయం ఇచ్చారు. తుమ్మిడిహెట్టి వద్ద ఉపయోగం లేదంటేనే.. నీటి లభ్యత లేకపోవడం, మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం, చాప్రాల్ అభయారణ్యం ఉండటం వంటి కారణాలతోనే తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు ముందుకు సాగలేదని హరీశ్రావు తెలిపారు. కేసీఆర్ స్వయంగా మహారాష్ట్ర సీఎంను కలిసినా ఫలితం లేకపోయిందని చెప్పారు. అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి రాసిన లేఖలోని మూడో పేజీలో తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. 2009 నుంచి 2014 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. ‘తమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చినప్పుడు నీళ్ల ప్రవాహం ఎలా పెరిగింది అని మంత్రి జూపల్లి అంటున్నారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు 116 కిలోమీటర్ల దూరం ఉండగా, మధ్యలో మహారాష్ట్రలోని 16 వాగులు, తెలంగాణలోని 8 వాగుల నీళ్లు కలుస్తాయి. మేడిగడ్డ దగ్గర అదనంగా 120 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది. మా సూచన మేరకే అన్నారం, సుందిళ్ల బరాజ్లు కట్టి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చారని రిటైర్డ్ ఇంజినీర్లు కమిషన్కు స్పష్టంగా చెప్పారు. కానీ కమిషన్ వారి రిపోర్ట్ను పట్టించుకోలేదు’అని హరీశ్రావు వివరించారు. పోలవరం కూలితే ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు? డీపీఆర్ లేకుండా టెండర్లు పిలుస్తారా అంటున్నారు. ప్రాణహితకు డీపీఆర్ 2009లో వస్తే, 28 ప్యాకేజీలకు టెండర్లు, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చింది మీరు (కాంగ్రెస్ ప్రభుత్వం). నారాయణపేట లిఫ్టు ఇరిగేషన్కు డీపీఆర్ లేకుండా టెండర్లు పిలిచింది మీరు కాదా? జలయజ్ఞంలో ఎన్నో ప్రాజెక్టులకు డీపీఆర్లు లేకుండానే టెండర్లు పిలిచారు. ఉత్తమ్కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ గురించి గొప్పగా చెపుతున్నారు. దేశం మొత్తానికి ఒక నీతి, కాళేశ్వరానికి ఒక నీతి ఉంటదా? గోదావరి నదిపై కట్టిన పోలవరం 10 సార్లు కూలింది. ఎందుకు ఒక్కసారి కూడా ఎన్డీఎస్ఏ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు? ఎన్డీఎస్ఏ చైర్మన్గా పనిచేసిన చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం ప్రాజెక్టు సీఈఓగా ఉన్న సమయంలోనే అది 5 సార్లు కూలింది. ఆయన ఇచ్చే రిపోర్టుకు ఇక విశ్వసనీయత ఏముంటది? ఎస్ఎల్బీసీ, సుంకిశాల కూలాయి. వట్టెం మునిగింది, పెద్దవాగు కొట్టుకుపోయింది. అయినా వీటి మీద ఎన్డీఎస్ఏ రాదు, కమిషన్లు వేయరు. ఎన్డీఎస్ఏ తన రిపోర్టులో మేడిగడ్డ బరాజ్ ఏడో బ్లాకు నిర్మించి ఆపరేషన్లోకి తేవాలి అని సూచిస్తే ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?’అని ప్రశ్నించారు. మేడిగడ్డలో మరమ్మతు చేస్తే సరిపోతుంది.. మేడిగడ్డ బరాజ్లోని ఏడో బ్లాకులో మూడు పిల్లర్లు కుంగటం తప్ప వ్యవస్థ అంతా అద్భుతంగా ఉందని హరీశ్రావు తెలిపారు. ఏడు బ్లాకుల్లో ఒక బ్లాకు మొత్తం తీసినా రూ.300 నుంచి రూ. రూ.4 వందల కోట్ల ఖర్చు అవుతుందని చెప్పారు. అది కూడా చేయకుండా ఎందుకు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఒకవైపు కాళేశ్వరం కూలిందని చెబుతూ.. మరోవైపు హైదరాబాద్కు కాళేశ్వరం నీళ్లు తెస్తామని రూ.7,000 కోట్లతో టెండర్లు వేశారని, కాళేశ్వరం కూలిపోతే హైదరాబాద్కు కాళేశ్వరం నీళ్లు ఎక్కడికెళ్లి వస్తాయి?’అని ప్రశ్నించారు. -
కాళేశ్వరంపై సీబీఐ: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలుపంచుకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, పీఎఫ్సీ, ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలుపంచుకున్నందున సీబీఐకి విచారణ అప్పగించడం సముచితమని తమ ప్రభుత్వం భావిస్తుందన్నారు. శాసనసభలో ఆదివారం జరిగిన ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, జస్టిస్ పీసీ ఘోస్ విచారణ కమిషన్ నివేదిక’పై జరిగిన సుమారు తొమ్మిదిన్నర గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆదివారం అర్ధరాత్రి 1:40 గంటల వరకు సాగిన శాసనసభ చర్చలో సీఎం రేవంత్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. లోతైన దర్యాప్తు అవసరం.. ‘తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ (సీఓఐ)ను నియమించింది. విచారణ కమిషన్ తన నివేదికను ఈ ఏడాది జూలై 31న ప్రభుత్వానికి సమర్పించింది. గత నెల 4న జరిగిన మంత్రిమండలి సమావేశం ఈ నివేదికను ఆమోదించింది. తదుపరి చర్చ జరిపేందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కేబినెట్ చేసిన తీర్మానం ప్రకారం ఈ నివేదికపై శాసనసభలో చర్చ జరిగింది. పీసీ ఘోష్ విచారణ కమిషన్ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది. మూడు బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని.. అసలు ప్రణాళిక లేదని కమిషన్ తేల్చిచెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా, మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి’ అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్ల కోసమే మేడిగడ్డకు మార్పు ‘కేసీఆర్ ఆదేశాల మేరకే మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి వ్యాప్కోస్ నివేదిక ఇచ్చింది. లిఫ్టులు, పంపుల సంఖ్య పెరగడంతోనే ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగంది. కాంట్రాక్టర్ల కమీషన్లకు తలొగ్గి నిర్మాణ లోపాలపై కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మేడిగడ్డ కుప్పకూలింది. దుర్మార్గంగా ఆలోచించి దోపిడీ దొంగగా మారి తెలంగాణ సొత్తు లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ దోచుకున్నాడు. కేసీఆర్కు, ఆయన కుటుంబానికి వందల ఎకరాలు, ఫామ్హౌస్లు, మీడియా సంస్థలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 85,449 కోట్లు అప్పు తీసుకున్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ఊరుపేరు మార్చి రూ. 1.50 లక్షల కోట్ల భారాన్ని తెలంగాణపై మోపారు. తెచ్చిన రుణంలో ఇప్పటివరకు అసలు, వడ్డీ కలుపుకుని రూ. 49,835 కోట్లు బ్యాంకులకు అప్పు చెల్లించాం. అసంపూర్తిగా మిగిలి ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఇంకా రూ. 47 వేల కోట్లు అవసరం ఉంది. లోపభూయిష్ట నిర్ణయాలతో ఆర్థికభారం మోపిన కేసీఆర్, హరీశ్రావును శిక్షించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిచేయాల్సిన ప్రాణహిత ప్రాజెక్టు ఉసురు తీసి ఉరి వేసింది కేసీఆర్ కాదా? కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా తెచ్చిన అప్పులను రీ–స్ట్రక్చర్ చేసి వడ్డీ భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. నేను ఢిల్లీకి సర్కస్ చూడటానికి వెళ్లడం లేదు. ఇప్పటివరకు ప్రధాని మోదీని కలిసి రూ. 26,400 కోట్ల రుణం రీ–స్ట్రక్చర్ చేసి ఏటా రూ. 4 వేల కోట్లు ఆదా చేస్తున్నాం. రుణాలు రీ–స్ట్రక్చర్ అయితే ప్రతి నెలా రూ. వేయి కోట్లు ఆదా అవుతాయి. నాకు ప్రధాని మోదీ బడే భాయ్. జెండా, ఎజెండా వేరైనా అనుమతులు, నిధులు తెచ్చుకునే బాధ్యతపై నాపై ఉంది. మోదీని కలిసేందుకు నాకు భేషజాలు లేవు’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.