breaking news
-
TS:ఖర్గేతో డీకే శివకుమార్ కీలక భేటీ... సీఎం ఫైనల్ అయ్యే ఛాన్స్ !
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ సీఎం ఎంపికపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే నివాసలంలో కీలక భేటీ జరుగుతోంది. ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్, పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ ఠాక్రే ఏఐసీసీ చీఫ్ ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన ఎమ్మెల్యేల అభిప్రాయాలతో పాటు ఉత్తమ్, భట్టిలతో జరిగిన సమావేశ వివరాలపై డీకే ఏఐసీసీ చీఫ్కు నివేదిక అందించారు. సీఎం ఎంపికపై ఖర్గే నివాసానికి వెళ్లే ముందు డీకేఎస్ మీడయాతో మాట్లాడారు. ‘తెలంగాణ సీఎల్పీ నేతను హై కమాండ్ నిర్ణయిస్తుంది. ఫైనల్గా హై కమాండ్ సరైన నిర్ణయం తీసుకుంటుంది’ అని డీకే శివకుమార్ చెప్పారు. అంతకముందు హైదరాబాద్ నుంచి ఇవాళే ఢిల్లీకి వచ్చిన భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డిలతో డీకే శివకుమార్, ఠాక్రేలు విడివిడిగా భేటీ అయ్యారు. సీఎం ఎంపికపై వారిరువురి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. కాగా, ఉదయం ఇండియా కూటమి సమావేశానికి వెళ్లేముందు ఏఐసీసీ చీఫ్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ఎప్పటిలోగా సీఎం ఎంపిక ఉంటుందనేదానిపై క్లారిటీ ఇచ్చారు. సాయంత్రంలోగా సీఎం పేరును ప్రకటిస్తామని తెలిపారు. ఇదీచదవండి..సీం ఎవరు..? సాయంత్రానికి సస్పెన్స్కు తెర! -
TS: సీఎం ఎవరు..?ఏఐసీసీ చీఫ్ ఖర్గే కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ సీఎం ఎవరు? కొత్త మంత్రులు ఎవరనేదానిపై ఉత్కంఠకు ఇవాళ తెరపడే ఛాన్సుంది. పార్లమెంట్లోని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఛాంబర్లో ఇండియా కూటమి సమావేశానికి వెళ్తూ ఖర్గే ఈ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం ఎవరనేది సాయంత్రానికల్లా వెల్లడిస్తామని చెప్పారు. కాగా, సీఎం అభ్యర్థిని నిర్ణయించేందుకుగాను ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో చర్చించడానికి సోమవారమే డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఆయన ఖర్గేతో సమావేశమై చర్చించిన అనంతరం నిర్ణయం వెలువడే ఛాన్సుంది. మరోవైపు భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ఖర్గేతో డీకేఎస్ భేటీకి ముందు భట్టి, ఉత్తమ్లు డీకేఎస్తో సమావేశమై సీఎం, మంత్రివర్గ కూర్పుపై తమ వాదనలు బలంగా వినిపించనున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్కుమార్రెడ్డి తన ఎంపీ పదవికి ఇవాళే రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇదీచదవండి..సీం ఎవరు..? సాయంత్రానికి సస్పెన్స్కు తెర! -
TS: సీల్డ్ కవర్తో హైదరాబాద్కు డీకే శివకుమార్ !
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ సీఎం ఎవరనే సస్పెన్స్కు ఇవాళ సాయంత్రానికి తెరపడనున్నట్లు తెలుస్తోంది. సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత ఢిల్లీ వెళ్లిన ఏఐసీసీ ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ కానున్నారు. సీఎం, మంత్రుల జాబితాపై ఖర్గేతో చర్చించి ఫైనల్ చేయనున్నారు. అనంతరం డీకేఎస్తో పాటు మిగిలిన పరిశీలకులు సీల్డ్ కవర్తో మధ్యాహ్నమే హైదరాబాద్ బయలుదేరనున్నారు. డీకే శివకుమార్ నేరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేసిన ఎల్లా హోటల్కు వెళ్లి వారతో సమావేశమవుతారు. అక్కడ సీల్డ్ కవర్లో ఉన్న సీఎం పేరును ప్రకటిస్తారు. అనంతరం ముఖ్యమైన పోర్ట్ఫోలియోలకు మంత్రులెవరనేది కూడా వెల్లడిస్తారు. మొత్తానికి సీఎం పదవి చేపట్టనుందెవరనేది సాయంత్రానికి తేలిపోయే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం ప్రమాణ స్వీకారం ఎప్పుడుంటుందనేదానిపై పేరు ప్రకటించిన తర్వాతే క్లారిటీ వచ్చే ఛాన్సుంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు గెలిచి మ్యాజిక్ ఫిగర్ సాధించిన విషయం తెలిసిందే. లెజిస్లేచర్ పార్టీ లీడర్ (సీఎల్పీ) నేతను ఎన్నుకోవడానికి గెలిచిన ఎమ్మెల్యేలంతా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సోమవారం సమావేశమయ్యారు. అయితే ఈ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో సీఎం ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకవ్యాఖ్య తీర్మానం చేసి పంపించారు. తర్వాత డీకే శివకుమార్ సహా ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీ వెళ్లారు. ఇదీచదవండి..గ్రేటర్ హైదరాబాద్లో మంత్రి పదవి వరించేదెవరిని... -
తెలంగాణ సీఎంగా రేవంత్రెడ్డికే పట్టం
Telangana CM Announcement Live Updates 9న తెలంగాణ కాంగ్రెస్ కృతజ్ఞత సభ డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ కృతజ్ఞత సభ అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞత తెలియజేయనున్న కాంగ్రెస్ అంతకు ముందే కొలువు దీరనున్న తెలంగాణ కేబినెట్ డిసెంబర్ 7వ తేదీనే ప్రమాణం చేయనున్న రేవంత్రెడ్డి రేవంత్తో పాటు మరికొందరు మంత్రులుగా కూడా! ఆరు గ్యారెంటీలపై కృతజ్ఞత సభలో కీలక ప్రకటన చేసే అవకాశం సీనియర్లు సీఎం పదవి ఆశించడం సహజం: పొన్నం కామెంట్స్ హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ సీఎం పదవిని సీనియర్లు ఆశించడం సహజం పార్టీ అధిష్టాన నిర్ణయానికే కట్టుబడి ఉంటాం ఎన్నికైన ఎమ్మెల్యేలమంతా ఏకవాక్య తీర్మానంతో సీఎం అభ్యర్థి నిర్ణయించే అధికారం అధిష్టానానికి అప్పగించాం అధిష్టాన నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటే కొందరు రాజకీయం చేస్తున్నారు కాంగ్రెస్ లో అప్పుడే డిల్లీ నిర్ణయాలు మొదలయ్యాయని ప్రచారం చేశారు ఏనాడైనా కేసిఆర్ ను ఇలా ప్రశ్నించారా? కేసిఆర్ బీసీలను ఎప్పుడు పట్టించుకోలేదు రేవంత్ రెడ్డిని సీఎంగా నిర్ణయించడం స్వాగతిస్తున్నాం. 7న సీఎంతో పాటు పూర్తిస్థాయి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుంది. మంత్రివర్గంలో నాకు చోటు దక్కొచ్చని అనుకుంటున్నా రేవంత్రెడ్డికి ప్రముఖుల శుభాకాంక్షలు తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రముఖుల స్పందన సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షల వెల్లువ శుభాకాంక్షలు తెలియజేసిన సీనియర్ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రేవంత్కు శుభాకాంక్షలు తెలియజేసిన బండ్ల గణేష్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులైన మా నాయకుడు, నిరంతరం నా శ్రేయస్సును కోరుకునే మా అన్న *శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి* 💐గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. @revanth_anumula @INCTelangana pic.twitter.com/M7K2QSPliJ — BANDLA GANESH. (@ganeshbandla) December 5, 2023 రేవంత్తో చర్చించాకే మంత్రివర్గ కూర్పు తెలంగాణ మంత్రి వర్గ కూర్పుపై దృష్టిసారించిన కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరిన రేవంత్రెడ్డి ఎల్లుండి ప్రమాణ స్వీకారానికి అగ్రనేతల్ని వ్యక్తిగతంగా ఆహ్వానించనున్న రేవంత్ రేపు కూడా ఢిల్లీలోనే రేవంత్? రేవంత్తో చర్చించాకే మంత్రి వర్గం కూర్పును ఖరారు చేయనున్న హైకమాండ్ కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నల్లోనే కీలక పదవులు, నిర్ణయాలు మా రేవంత్ పటేల్ ఇక సీఎం: కొండారెడ్డిపల్లి గ్రామస్తులు సీఎంగా రేవంత్రెడ్డి పేరు ప్రకటన తర్వాత కొండారెడ్డిపల్లి గ్రామంలో సంబురాలు ఢిల్లీకి రాజు అయినా.. తల్లికి కొడుకే: గ్రామస్తులు రేవంత్ అప్పటికీ.. ఇప్పటికీ మా మంచి పటేల్ : గ్రామస్తులు ఇకపై మా ఊరు కొండారెడ్డిపల్లి కాదు.. సీఎం ఊరు: గ్రామస్తులు ఎప్పుడు ఊరికి వచ్చినా ఆప్యాయంగా పలకరిస్తారు: గ్రామస్తులు అందరికీ ధన్యవాదాలు: రేవంత్రెడ్డి అందరికీ ధన్యవాదాలు తెలిపిన రేవంత్రెడ్డి సీఎల్పీ నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు ఎంపిక చేసిన ఖర్గేకు కృతజ్ఞతలు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు ధన్యవాదాలు నాకు మద్దతుగా నిలిచిన సోనియా, రాహుల్, ప్రియాంకలకు ధన్యవాదాలు మద్ధతుగా నిలిచిన కాంగ్రెస్ పెద్దలందరికీ ధన్యవాదాలు పాలమూరు గడ్డ నుంచి మరో సీఎం తెలంగాణ సీఎంగా రేవంత్రెడ్డి రేవంత్ సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ గతంలో హైదరాబాద్ స్టేట్కు సీఎం(రెండో, ఆఖరి కూడా..)గా పని చేసిన బూర్గుల రామకృష్ణారావు బూర్గుల స్వస్థలం కల్వకుర్తి(ఉమ్మడి మహబూబ్నగర్) పాలమూరు నుంచి రెండో సీఎంగా ఇప్పుడు రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారానికి అగ్రనేతలకు ఆహ్వానం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేయనున్న రేవంత్ ఎల్లుండి డిసెంబర్ 7వ తేదీన సీఎంగా ప్రమాణం సోనియా, ఖర్గే, రాహుల్ గాంధీలతో పాటు పలువురు ఏఐసీసీ నేతలకు రేవంత్ ఆహ్వానం రేవంత్ రెడ్డి గురించి.. 1969 నవంబరు 8న జననం అనుముల రేవంత్రెడ్డి స్వస్థలం నాగర్కర్నూల్(ప్రస్తుతం.. పూర్వపు మహబూబ్నగర్) జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామం విద్యార్థి దశలో ఏబీవీపీతో అనుబంధం 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ 2014–17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ 2017 అక్టోబరులో టీడీపీకి రాజీనామా 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిక 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి 2019 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం 2021లో జూన్ 26న పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ 2021 జూలై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం 2023 డిసెంబర్ 3.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొండగల్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక, కామారెడ్డి నుంచి ఓటమి 2023 డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ పేరు ప్రకటించిన కేసీ వేణుగోపాల్ 2023 డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఎల్లుండి సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం రేవంత్ నివాసం దగ్గర భద్రత పెంపు సీఎల్పీ నేతగా రేవంత్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కొత్త సీఎల్పీ నేత ఎంపికపై నిన్న భేటీ జరిగింది: కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ఢిల్లీ రావాలని రేవంత్రెడ్డికి అధిష్టానం పిలుపు అధిష్టానం పిలుపుతో ఢిల్లీ బయల్దేరిన రేవంత్రెడ్డి కాసేపట్లో కేసీ వేణుగోపాల్ ప్రెస్మీట్ ఢిల్లీలో ముగిసిన భేటీ ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ ముగిసిన భేటీ భట్టి, ఉత్తమ్లతో చర్చలు జరిపిన అధిష్టానం చర్చకు హాజరైన డీకే శివకుమార్, మాణిక్రావ్ థాక్రే సీఎం అభ్యర్థి ఎంపికతో పాటు కేబినెట్ కూర్పు పైనా చర్చా? అధిష్టాన నిర్ణయంపై ఉత్కంఠ తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్ రేవంత్రెడ్డితో సీపీఐ నేతలు భేటీ హోటల్ ఎల్లాలో రేవంత్రెడ్డితో సీపీఐ నేతలు నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు భేటీ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యాం: కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో అభినందనలు తెలిపాం మంత్రివర్గంలో సీపీఐ చేరడం లేదు కాంగ్రెస్ ఎవరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన వారికే మా ఓటు సీఎం ఫలానా వ్యక్తి కావాలని సీపీఐ కోరుకోవడం లేదు సీఎం ఎవరనేది నిర్ణయించేది కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ ప్రభుత్వానికి కామారెడ్డి ఎమ్మెల్యే హెచ్చరిక ఏడాదికోసారి రేషన్, పింఛన్లను అప్డేట్ చేయాల్సిందే: బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో అవినీతి రహిత పాలన అందిస్తా ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తా కామారెడ్డిని అభివృద్ధి దిశగా తీసుకెళ్తా విజయం అందించిన ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు ఢిల్లీ: కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక భేటీ ►కేసీ వేణుగోపాల్తో డీకే శివకుమార్, థాక్రే, భట్టి విక్రమార్క సమావేశం కాంగ్రెస్లోనే ఉన్నా.. బయటి నుంచి రాలేదు: ఉత్తమ్ పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీకి వచ్చాను కాంగ్రెస్ పెద్దలను కలిసి చెప్పాల్సింది చెప్పాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను మొదటి నుంచి కాంగ్రెస్లోనే ఉన్నా పార్టీని ఎప్పుడూ వీడలేదు.. బయటి నుంచి రాలేదు నేనూ నా భార్య ఎప్పుడూ క్షేత్రస్థాయిలో పని చేస్తుంటాం నాకిచ్చిన పనిని సమర్థవంతంగా చేస్తుంటా ప్రతీ ఎన్నికలకు ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి నేను టీపీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు బీఆర్ఎస్పై ఇంత ప్రజా వ్యతిరేకత లేదు ఇప్పుడు బాగా పెరిగింది అందుకే ఈ ఎన్నికల్లో 70 సీట్ల దాకా వస్తాయి అనుకున్నాం కానీ, 64 దగ్గరే ఆగిపోవడం నిరాశపర్చింది తెలంగాణ ప్రజల్లో గాంధీ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది ఏది ఏమైనా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తాం మీడియాతో ఉత్తమ్కుమార్రెడ్డి వ్యాఖ్యలు సీఎం పదవిపై శ్రీధర్బాబు కామెంట్స్ గెలిచిన 64 మందిలో ఎవరైనా సీఎం కావొచ్చు.. శ్రీధర్బాబు ఐదుసార్లు నెగ్గాను కానీ, సీఎం అభ్యర్థి విషయం లో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ ►రేవంత్ రెడ్డిని సీఎం చేయాలంటూ హోటల్ ఎల్లా ముందు పెట్రోల్ పోసుకుని ఓయూ విద్యార్థి నేత ప్రతాప్ రెడ్డి ఆత్మహత్యాయత్నం హోటల్ ఎల్లాకు చేరుకున్న సీపీఐ నారాయణ, చాడ వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డితో భేటీ కానున్న సీపీఐ నేతలు.. కాసేపట్లో హైదరాబాద్ బయలుదేరనున్న డీకే తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై ముగిసిన కసరత్తు మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి బయటికి వచ్చిన డీకే శివకుమార్ , మాణిక్ రావ్ థాకరే అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థిని సీల్డ్ కవర్లో తీసుకెళ్తున్న డీకే సాయంత్రం హైదరాబాద్లో సీఎల్పీ సమావేశంలో అధిష్టానం నిర్ణయాన్ని వెల్లడించనున్న డీకే ఢిల్లీలో తెలంగాణ రాజకీయాలు కాంగ్రెస్లో ముఖ్యమంత్రుల పంచాయతీ మేమంటే మేము సీఎం అంటున్న సీనియర్ నేతలు రేసులో ఉన్నామంటున్న భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు ఇప్పటికే డీకే , ఠాక్రే తో విడివిడిగా భేటీ అయిన సీనియర్ నేతలు ఢిల్లీ పెద్దలతో లాబీయింగ్ నిర్వహిస్తున్న భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు ప్రతి పేదవాడి గుండె తాకిన క్షణాలు... గుండె నిండా ఆత్మ స్థైర్యం, కుంగిపోతున్న జీవితాలకు ఈ అరాచక పాలన నుండి విముక్తి ఇవ్వాలన్న లక్ష్యం, నైరాశ్యం లో ఉన్న క్షేత్ర స్థాయి కాంగ్రెస్స్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాలన్న ఆశ.. ఇవే నా పాదయాత్రకు ఆయువు పోసి నడిపించాయి. దట్టమైన గుట్టలు,… pic.twitter.com/lcgP3kbFUm — Bhatti Vikramarka Mallu (@BhattiCLP) December 5, 2023 రేవంత్ను సీఎం చేయాలంటూ నినాదాలు గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా వద్ద కార్యకర్తల హంగామా హోటల్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేసిన కార్యకర్తలు ఆందోళన చేసిన కార్యకర్తలను నిలువరించి బయటికి పంపించిన పోలీసులు రేవంత్ పేరు ఖరారు..? ఖర్గే నివాసంలో ముగిసిన సమావేశం బయటికి వచ్చిన రాహుల్ గాంధీ సీఎం పదవికి రేవంత్ పేరు ఫైనల్ అయిందని ప్రచారం కాసేపట్లో అధికారిక ప్రకటన ఢిల్లీలో కొనసాగుతున్న డీకేఎస్, ఖర్గే భేటీ కాసేపట్లో సీఎం ఫైనల్ అయ్యే అవకాశం భేటీలో పాల్గొన్న రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఠాక్రే ప్రత్యేక నివేదిక అందించిన డీకే శివకుమార్ ఢిల్లీలో వరుస సమావేశాలు ఖర్గే నివాసానికి రాహుల్, కేసీ వేణుగోపాల్ డీకేతో సమావేశమైన ఉత్తమ్, భట్టి కాసేపట్లో ఖర్గేతో భేటీ కానున్న డీకే శివకుమార్ కాసేపట్లో ఖర్గేతో డీకేఎస్, ఠాక్రే భేటీ ఏఐసీసీచీఫ్తో భేటీ అవనున్న డీకేఎస్, ఠాక్రే భేటీ సీఎం పదవిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ డీకేఎస్తో ఉత్తమ్ భేటీ డీకే శివకుమార్తో ఉత్తమ్ కుమార్ భేటీ కాసేపట్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో డీకేఎస్ సమావేశం ఢిల్లీలోనే ఉన్న భట్టి విక్రమార్క ఢిల్లీలో ఉత్తమ్, భట్టి ఎంపీ పదవికి రిజైన్ చేయనున్న ఉత్తమ్కుమార్రెడ్డి ఢిల్లీ చేరుకున్న ఉత్తమ్కుమార్, భట్టి ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది నేడు నిర్ణయిస్తాం మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి అధ్యక్షుడు మధ్యాహ్నం సీఎం పేరు వెల్లడి మధ్యాహ్నం సీల్డ్ కవర్తో హైదరాబాద్కు డీకే శివకుమార్ సీల్డ్ కవర్లో ముఖ్యమంత్రి పేరు సీఎం పదవిపై ఇవాళ సాయంత్రానికి సస్పెన్స్కు తెర ఢిల్లీకి బయలుదేరిన కాంగ్రెస్ సీనియర్లు ఢిల్లీకి బయలుదేరిన భట్టి విక్రమార్క ,ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం ఖర్గేను కలవనున్న ఉత్తమ్ ,భట్టి 12 గంటలకు ఖర్గేతో డీకే శివకుమార్ భేటీ మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ కానున్న డీకే శివకుమార్ తెలంగాణ సీఎం అభ్యర్థి పై చర్చించనున్నఏఐసీసీ పరిశీలకులు ఖర్గేతో భేటీ తర్వాతే తదుపరి కార్యాచరణ కాంగ్రెస్ అధిష్టానం కోర్టులోకి సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఈ అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడికి కట్టబెడుతూ సీఎల్పీ ఏకవాక్య తీర్మానం డీకే శివకుమార్ పర్యవేక్షణలో హైదరాబాద్లో సమావేశం.. హాజరైన 64 మంది కొత్త ఎమ్మెల్యేలు అంతకుముందు డీకేతో భట్టి, ఉత్తమ్, దామోదర, రాజగోపాల్, శ్రీధర్బాబు, ప్రేమ్సాగర్రావు భేటీ హడావుడిగా వద్దని, అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి సీఎల్పీ భేటీ తర్వాత ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడిన పరిశీలకులు ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్న దానిపై అభిప్రాయ సేకరణ అధిష్టానం ఎవరికి ఇచ్చినా ఓకే అన్న ఎమ్మెల్యేలు ఇంతలో ఢిల్లీకి రావాలంటూ డీకే టీమ్కు పిలుపు.. నేడు ఏఐసీసీ పెద్దలతో సమాలోచనలు ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్తో పాలు నలుగురు పరిశీలకులు కూడా ఢిల్లీకి సీఎం ఎంపికపై నిర్ణయం.. తర్వాత సీఎల్పీ భేటీలో లాంఛనంగా ఆమోదం సీఎం ఎవరైతే బాగుంటుంది? ఏఐసీసీ పరిశీలకులు సీఎల్పీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేలందరితో విడివిడిగా సమావేశమై.. సీఎం ఎవరైతే బాగుంటుందన్న అభిప్రాయాలు ఈ క్రమంలో కొందరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ పేరు చెప్పగా, మరికొందరు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డిల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇంకొందరు మాత్రం ఏఐసీసీ ఎవరిని ఎంపిక చేసినా తమకు సమ్మతమేనని చెప్పినట్టు సమాచారం. డీకే బృందం ఈ అభిప్రాయాలను వెంటనే ఢిల్లీకి చేరవేసింది. వాటిని హైకమాండ్ పరిశీలించి ఏం చెప్తుందోనని సాయంత్రం వరకు ఎదురుచూపులు ఆ కథనాల్ని నమ్మొద్దు: భట్టి ►హైదరాబాదులో సీఎల్పీ సమావేశం జరిగింది ►ఈ సమావేశంలో సీఎల్పీ నాయకుడి ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేసి పంపించడం జరిగింది ►పార్టీ అధిష్టానం సిఎల్పీ నాయకుడిని ప్రకటిస్తుంది ►ప్రస్తుతం ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వివిధ కథనాలు ఊహాగానాలు మాత్రమే.. వాటిని ఎవరు నమ్మొద్దు. తేలేదాకా హోటల్లోనే.. ►హైదరాబాద్ ఎల్లా హోటల్ లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ►అదిష్టానం సీఎం అభ్యర్థి ని ప్రకటించే వరకు హోటల్ కే పరిమితం కానున్న ఎమ్మెల్యేలు ►అదిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేలు ►డీకే శివకుమార్ ద్వారా నిర్ణయం వెల్లడించనున్న కాంగ్రెస్ అధిష్టానం ► అధిష్టానం చెంతక చేరడంతో సీఎం అభ్యర్థి ఉత్కంఠ వీడుతుందా? అనే అనుమానంలో కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్లో ఓ విధానం ఉంటుంది: మాణిక్యం ఠాగూర్ ►తెలంగాణ పరిణామాలపై AICC స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మాణిక్యం ఠాగూర్ ►తెలంగాణ ఎమ్మెల్యేల అభిప్రాయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు చేరింది ►రేపు ఖర్గే ఏఐసీసీ పరిశీలకులతో భేటీ అవుతారు ►సీఎం అభ్యర్థి ఎవరనేది ఆయనే ప్రకటిస్తారు ►కాంగ్రెస్లో ఓ విధానం ఉంటుంది ►సరైన అభ్యర్థినే సీఎంగా హైకమాండ్ ప్రకటిస్తుంది ‘తెలంగాణ సీఎం అభ్యర్థి’పై సోనియా చర్చ! ►కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ సమాశంలో తెలంగాణ సీఎం అభ్యర్థి పై నో చర్చ ►కానీ, ఆ తర్వాత సోనియా గాంధీ మరో సమావేశం ►ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన సోనియా ►తెలంగాణ ఫలితాలు, సీఎం అభ్యర్థిపై చర్చించిన సోనియా -
జనంలో ఉందాం!
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజలు వేరే పార్టీకి అవకాశం ఇచ్చినా మనకు గౌరవ ప్రదమైన స్థానాలు కట్టబెట్టారు. ప్రజలు మనకు ఇచ్చిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దాం. ఓటమితో అధైర్య పడకుండా జనంలో ఉంటూ ప్రజలకు సంబంధించిన అంశాలపై పోరాడుదాం..’అని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్కు చేరుకున్న కేటీఆర్, బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ అభ్యర్థులు, సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన పార్టీ అభ్యర్థులు, ఇతర నేతలతో తెలంగాణ భవన్కు వచ్చారు. గెలుపొందిన ఎమ్మెల్యేలను కేటీఆర్ అభినందించారు. ఓటమి పాలైన అభ్యర్థులకు ధైర్యంగా ఉండి కలిసి పనిచేద్దామంటూ భరోసా ఇచ్చారు. ప్రజల నుంచి సానుకూల స్పందన ‘ఎన్నికల తర్వాత ప్రజల నుంచి మన పార్టీ నాయకత్వం విషయంలో ఒక సానుకూల స్పందన వస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోతుందని అనుకోలేదంటూ సమాజంలోని అన్ని వర్గాల నుంచి వందలాది మెసేజ్లు వస్తున్నాయి. తెలంగాణ బాగు కోరుకున్న అనేక మంది భావోద్వేగానికి గురవుతూ సందేశాలు పెడుతున్నారు. ఓటమితో నిరాశ చెందకుండా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగుదాం. రెండు మూడురోజుల్లో పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళదాం. ప్రభుత్వంలో, అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం, ప్రగతిభవన్ కేంద్రంగా విధులు, కార్యకలాపాలు కొనసాగించిన మనమంతా ఇకపై తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉందాం’అని కేటీఆర్ అన్నారు. నేతల భావోద్వేగం ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, నేతలు భావోద్వేగానికి గురయ్యారు. సుమారు రెండు దశాబ్దాలకు పైగా పార్టీ అడుగుజాడల్లో నడిచిన తాము ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 10 నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారైన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. పలువురు నేతలు కేటీఆర్, కవితతో ఫోటోలు దిగేందుకు పోటీలు పడ్డారు. వందలాది మంది తెలంగాణ భవన్కు తరలిరావడంతో పరిసరాలు సందడిగా కనిపించాయి. సుమారు మూడు గంటల పాటు తెలంగాణ భవన్లోనే గడిపిన కేటీఆర్ కొందరితో గ్రూపుగా, మరికొందరితో ముఖాముఖి సంభాషించారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, సబిత ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, మహమూద్ అలీతో పాటు ఎంపీ రంజిత్రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, కృష్ణారావు, గోపీనాథ్, వివేకానంద, ఎమ్మెల్సీలు ఎల్.రమణ, శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
లెక్క ఎక్కడ తప్పింది?
సాక్షి, హైదరాబాద్: కమలదళంలో అంతర్మథనం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడానికి కారణాలేమిటి? గట్టిగా పోరాడినా కూడా అనుకున్న విధంగా ఫలితాలను ఎందుకు సాధించలేకపోయామనే కోణంలో పార్టీలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీచేసిన 111 సీట్లలో 8 స్థానాల్లో మాత్రమే గెలుపునకు పరిమితం కావడంపై రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయిల్లో అంతర్గత సమీక్షలకు రంగం సిద్ధమైంది. పార్టీకి పట్టుతో పాటు, ముగ్గురు ఎంపీలు గెలిచిన ఉమ్మడి జిల్లాల పరిధిలో, ముఖ్యనేతలు (ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, అర్వింద్ ధర్మపురి, సోయం బాపూరావు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్) ఓటమి పాలవడం, దుబ్బాకలో మరో ఎమ్మెల్యే రఘునందన్రావు ఓటమికి కారణాలు ఏమిటంటూ పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే, 2023లో 8 సీట్లలో గెలుపు, ఓటింగ్ శాతం 14కి పెంచుకోవడం ద్వారా మరీ తీసికట్టుగా కాకుండా గౌరవప్రదమైన ఫలితాలనే సాధించినా పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకోలేక పోయేందుకు ప్రభావం చూపిన అంశాలేమిటా అన్న లోతైన చర్చ సాగుతోంది. గతం కంటే మెరుగే కానీ.. ఎక్కడి నుంచి ఎక్కడికి పడ్డాం.. ఈ ఎన్నికల్లో 111 స్థానాల్లో పోటీచేసి 46 చోట్ల డిపాజిట్లు దక్కించుకోవడం (2018లో 118 సీట్లలో పోటీచేస్తే 104 చోట్ల డిపాజిట్లు గల్లంతు), పలు సీట్లలో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలవడంతో పాటు గణనీయమైన సంఖ్యలో ఓట్లను సాధించడం వంటివి పార్టీకి కలిసొచ్చే అంశాలేనని అంచనా వేస్తున్నారు. గత రెండు, మూడేళ్లుగా కేసీఆర్ సర్కార్పై, అధికార బీఆర్ఎస్పై హోరాహోరీగా పోరాడినా.. వివిధ వర్గాల ప్రజల సమస్యలపై ఉద్యమించినా.. ఆ మేరకు గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలవకపోవడానికి కారణాలు ఏమిటనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. శాసనసభ ఎన్నికలపై దృష్టితో బీజేపీ సాగించిన కృషితో అధికార బీఆర్ఎస్కు బీజేపీనే తగిన ప్రత్యామ్నాయం అన్న స్థాయికి వెళ్లి అక్కడి నుంచి పరిస్థితి దిగజారడానికి దారితీసిన పరిణామాలను విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనన్న దుష్ప్రచార ప్రభావమే బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనంటూ కాంగ్రెస్ క్రమం తప్పకుండా సాగించిన దుష్ప్రచారం ప్రభావం చూపిందని భావిస్తున్నారు. ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు రాష్ట్రనేతలు గట్టిగా తిప్పికొట్టలేకపోవడం, ఎన్నికల సమయంలో పార్టీని వీడిన కొందరు నేతలు అదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించడం వంటివి నష్టాన్ని కలగజేశాయని అంచనా వేస్తున్నారు. లోపాయికారిగా మిలాఖత్ కారణంగానే బీఆర్ఎస్ సర్కార్ అవినీతి, అక్రమాలపై కేంద్రప్రభుత్వం, వివిధ దర్యాప్తు సంస్థలు, ఏజెన్సీలు తగిన చర్యలు తీసుకోలేదనే పద్ధతుల్లో కాంగ్రెస్ సహా కొన్ని పక్షాలు చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. దీంతో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ కాదంటూ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపేలా చేసిందనే చర్చ కూడా పార్టీలో వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వీలైనంత తొందరలో క్షేత్రస్థాయి సమీక్షలు ముగించుకుని వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలని భావిస్తోంది. నిర్ణీత గడువు ప్రకారమైతే మరో నాలుగు నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి మెజారిటీ ఎంపీ సీట్లు గెలవడం ద్వారా మళ్లీ బీజేపీ సత్తాను చాటాలనే భావన పార్టీ ముఖ్యనేతల్లో వ్యక్తమవుతోంది. -
ప్రజాతీర్పును గౌరవిద్దాం..
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా జనవరి 16వ తేదీ వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశమున్నా ప్రజల తీర్పును గౌరవిస్తూ హుందాగా తప్పుకున్నాం. ప్రజల తీర్పును గౌరవిస్తూ కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం. రాష్ట్ర రాజకీయాలు, పాలనలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూద్దాం..’అంటూ భారత్ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, పలువురు నేతలు కేసీఆర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ అధినేత ఆశీర్వాదం తీసుకున్నారు. త్వరలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ‘త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసుకుందాం. ఎన్నికల క్షేత్రంలో గెలుపోటములు అత్యంత సహజం. నిరాశ చెందకుండా ప్రజలతో మమేకమై వారి విశ్వాసాన్ని తిరిగి చూరగొనాల్సిన బాధ్యత నాయకులపైనే ఉంటుంది. అందువల్ల నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలి. త్వరలో పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని కూడా ఎన్నుకునేందుకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుందాం..’అని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లకుపైగా సుస్థిర పాలన అందించి అభివృద్ధి, సంక్షేమంతో చెరగని ముద్ర వేసుకోగలిగామని సంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టడమేగాకుండా ప్రతి గడపకూ సంక్షేమ పథకాలను అందించి గొప్ప పరివర్తన తీసుకురాగలిగామన్నారు. బీఆర్ఎస్ అంటే ఒక భరోసా అనే విశ్వాసాన్ని కలిగించామని చెప్పారు. మెజారిటీ ఎంత వచ్చింది? ఎన్నిక ఏ విధంగా జరిగింది? ఏ తరహా పోటీని ఎదుర్కొన్నారు? లాంటి కొన్ని సాధారణ అంశాలను కూడా కేసీఆర్ ఆరా తీశారని ఆయనను కలిసిన నేతలు ‘సాక్షి’కి తెలిపారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన భేటీలో ఆయన కుశల ప్రశ్నలు సైతం వేసినట్లు చెప్పారు. హరీశ్, తదితరుల భేటీ ఉదయం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన కేటీఆర్ ఫామ్హౌస్ భేటీకి వెళ్లలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇలావుండగా ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి హరీశ్రావు కూడా కేసీఆర్ను కలిశారు. గజ్వేల్ ఎన్నికలో కేసీఆర్ ఎన్నికల ఏజెంట్గా వ్యవహరించిన అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ‘ఎన్నిక ధ్రువీకరణ సర్టిఫికెట్’ను అందజేశారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో కత్తిపోటుకు గురై కోలుకుంటున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య స్థితిపై కేసీఆర్ వాకబు చేశారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్గౌడ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ యాదవ్, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కేసీఆర్ను కలిసిన వారిలో ఉన్నారు. ప్రగతిభవన్ నుంచి ఫామ్హౌస్కు.. కేసీఆర్ దంపతులు ఆదివారం రాత్రి ప్రగతిభవన్ నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఒకటి రెండు రోజుల్లో బంజారాహిల్స్ నందినగర్లోని తన నివాసానికి మారనున్నారు. వ్యక్తిగత సామానును తరలించే పని జరుగుతున్నట్లు ప్రగతిభవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే కేటీఆర్ జనవాడలోని ఫామ్హౌస్ నుంచి రాకపోకలు సాగించే అవకాశమున్నట్లు తెలిసింది. -
అత్యధిక ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ముందుకెళతామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి తెలిపారు. కలిసికట్టుగా ముందుకుసాగుతూ తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేలా పోరాడుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచినా మరింత గట్టిగా పోరాడి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లు సాధించేలా ఇప్పటి నుంచే పట్టుదలతో కృషి ప్రారంభిస్తామని చెప్పారు. ఎంతో కష్టపడినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదని, ఈ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించిందని, 7 నుంచి 14 శాతానికి ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే 100 శాతం ఓటింగ్ పెరిగిందని చెప్పారు. పార్టీ నేతలు కాసం వెంకటేశ్వర్లుయాదవ్, ప్రేంసింగ్రాథోడ్, చింతా సాంబమూర్తి, ప్రకాష్రెడ్డి తదితరులతో కలిసి కిషన్రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. ఓడిన స్థానాలపై జాతీయస్థాయి నుంచి జిల్లా, మండల, బూత్ స్థాయి వరకు సమీక్ష జరిపి వచ్చే లోక్సభ ఎన్నికలకల్లా లోటుపాట్లను సరిదిద్దుకుంటామని చెప్పారు. లోక్సభకు ఓటేస్తామన్నారు : అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బీజేపీ నేతలు వెళ్లినప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్లకు మద్దతు తెలిపే ఓటర్లు తాము అసెంబ్లీకి ఎవరికి ఓటేసినా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి వేస్తామని చెప్పారన్నారు. తాము గెలిచింది 8 స్థానాలే అయినా, 80 మంది ఎమ్మెల్యేల బలాన్ని ప్రజలు ఇచ్చారని చెప్పారు. క్రియాశీల ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తామని, ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని తెలి పారు. అధికార బీఆర్ఎస్పై ఐదేళ్లుగా బీజేపీ సాగించిన పోరు వల్ల కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో లాభం పొందిందన్నా రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతూ రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారేందుకు కృషి చేస్తామన్నారు. బీజేపీపై పడి ఏడ్చి బురదచల్లిన వారు ఈ రోజు ఫామ్హౌస్కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని (మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి) వ్యాఖ్యానించారు. అక్కడ కాంగ్రెస్కు ఆ పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్న పరిస్థితి ఛత్తీస్గఢ్, రా జస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లేదని కిషన్రెడ్డి పేర్కొన్నా రు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని బీజేపీ చేజిక్కించుకుందని, మధ్యప్రదేశ్లో గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధించిందని చెప్పారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్, సీఎం అభ్యర్థి అని చెబుతున్న రేవంత్రెడ్డిని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఓడించి రికార్డు సృష్టించారన్నారు. ఇలాంటి రికార్డు దేశంలో మరే రాష్ట్రంలోనూ సాధ్యం కాలేదన్నారు. పార్టీ పోటీచేసిన స్థానాల్లో ఓటమికి దారి తీసిన కారణాలను విశ్లేషించుకుంటామని, ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకత్వంతో సమావేశమై రాష్ట్రంలో ఎన్నికల సరళి, ప్రభావం చూపిన అంశాలు, తదితర విషయాలపై చర్చిస్తామని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు, రాబో యే లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావడం, తెలంగాణ ఎన్నికల తీరుతెన్నులపై సవివరంగా తెలియజేస్తామన్నారు. తమ పార్టీ వారే తనను ఓడించారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఒక విలేకరి ప్రస్తావించగా, ఆ వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని కిషన్రెడ్డి సమాధానమిచ్చారు. బీఆర్ఎస్, మజ్లిస్ కుట్రలను తిప్పికొట్టారు: కిషన్రెడ్డి రాజాసింగ్ నివాసానికి వెళ్లి అభినందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల అధినేతలు కేసీఆర్, అసదుద్దీన్ ఎన్ని కుట్రలు చేసినా ఎమ్మెల్యే రాజాసింగ్ బలమైన విశ్వాసం, ధైర్యంతో తిప్పికొట్టారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ప్రశంసించారు. ముఖ్యంగా మజ్లిస్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం కొనసాగిస్తూ, ప్రజల ఆశీస్సులతో రాజాసింగ్ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారని అన్నారు. అధికార దురి్వనియోగం, కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టినా గోషామహల్లో ధర్మం, జాతీయ భావజాలమే గెలిచింద ని పేర్కొన్నారు. సోమవారం గోషామహల్లో రాజా సింగ్ నివాసానికి వెళ్లిన కిషన్రెడ్డి ఆయనను అభినందించారు. తప్పుడు ప్రచారాలతో అనేక శక్తులు పన్ని న కుట్రలను ఎదుర్కొని బీజేపీ ఎమ్మెల్యేగా రాజాసింగ్ను గెలిపించిన గోషామహల్ ప్రజలకు, ఆయన విజయం కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్నరోజుల్లో పార్టీ మరింత విస్తరణకు రాజాసింగ్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా వినియోగించుకుంటామన్నారు. 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ విజయం కోసం కృషి చేస్తామని కిషన్రెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్కు ‘కౌన్సిల్’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభలో అధికారం చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో మాత్రం విచిత్రమైన స్థితిని ఎదుర్కోనుంది. 40 మంది సభ్యులున్న మండలిలో 37 మంది ప్రతిపక్షాలకు చెందిన వారు కాగా కేవలం ముగ్గురు (బీఆర్ఎస్ను వీడిన ఇద్దరితో కలిపి) మాత్రమే కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో రెండు స్థానాలు మాత్రమే ఖాళీగా ఉండగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు సభ్యులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో ప్రస్తుతం కేవలం ఐదు స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అయితే మూడు ఖాళీలు మాత్రమే స్వల్ప సమయంలో భర్తీ అయ్యే అవకాశం ఉంది. 2025 మార్చి లోపు ఏ కోటాలోనూ రిటైర్ అయ్యే సభ్యులు ఎవరూ లేకపోవడంతో కాంగ్రెస్ తరఫున పెద్ద సంఖ్యలో సభ్యులు మండలిలో అడుగు పెట్టేందుకు ఏడాదిన్నర వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల కోటాలో 14 స్థానాలు ఉండగా 2028లో 18 మంది రిటైర్ అవుతారు. ప్రస్తుతం మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ సహా ఎక్కువమంది బీఆర్ఎస్కు చెందిన వారే ఉండటంతో శాసనస భ ఆమోదించే తీర్మానాలు, బిల్లులు మండలిలో నెగ్గడం బీఆర్ఎస్పైనే ఆధారపడి ఉంటుంది. ముగ్గురు తోడయ్యే చాన్స్ శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు ఈ ఏడాది ఆగస్టులో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను కేసీఆర్ ప్రభుత్వం సిఫారసు చేసింది. అయితే వీరు రాజకీయ పార్టీల సభ్యులుగా ఉన్నారనే కారణంతో గవర్నర్ తిరస్కరించారు. దీంతో ఈ రెండు ఖాళీల్లో ఇద్దరిని గవర్నర్ కోటాలో నామినేట్ చేసే అవకాశం కొత్త ప్రభుత్వానికి ఉంటుంది. ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి జగిత్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా ఓటమి పాలు కావడంతో ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి), కూచుకుళ్ల దామోదర్రెడ్డి ఆయన కుమారుడు రాజేశ్రెడ్డి (నాగర్కర్నూల్) కాంగ్రెస్ టికెట్ కోసం బీఆర్ఎస్ను వీడారు. కసిరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ప్రస్తుతం మండలిలో జీవన్రెడ్డి, దామోదర్రెడ్డి మాత్రమే కాంగ్రెస్ సభ్యులుగా కొనసాగనున్నారు. మరోవైపు కసిరెడ్డితో పాటు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి (జనగామ), కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్) కూడా ప్రస్తుత ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికవడంతో మండలిలో 3 సీట్లు ఖాళీ కానున్నాయి. వీరిలో పల్లా రాజేశ్వర్రెడ్డి గ్రాడ్యుయేట్స్, కసిరెడ్డి స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన నేపథ్యంలో వీరి స్థానంలో కొత్తగా వచ్చే వారు ప్రత్యక్ష ఎన్నిక ద్వారానే మండలిలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. కడియం శ్రీహరి ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక కావడంతో కాంగ్రెస్కు ఉన్న సంఖ్యా బలం ప్రకారం పార్టీ ఎంపిక చేసిన వారికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుంది. అంటే ఇప్పటికిప్పుడు గవర్నర్ కోటాలో ఇద్దరు, ఎమ్మెల్యే కోటాలో ఒకరే కాంగ్రెస్ తరఫున మండలికి ఎన్నికయ్యేందుకు అవకాశం ఉందన్నమాట. బీఆర్ఎస్ తరహాలో వలసలు? తొలిసారి 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు కాంగ్రెస్, టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుని మండలిలో బలోపేతమైంది. ఇప్పుడదే తరహా వ్యూహాన్ని కాంగ్రెస్ కూడా అనుసరిస్తుందా? అన్న అంశంపై చర్చ ప్రారంభమైంది. -
ఆ లోక్సభ సెగ్మెంట్లలో మిశ్రమ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ సెగ్మెంట్ల వారీగా చూస్తే..అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆయా రాజకీయపార్టీలకు మిశ్రమ స్పందన మిగిల్చాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్కు నాలుగు లోక్సభ సెగ్మెంట్లలో కనీస ప్రాతినిధ్యమే దక్కలేదు. కాంగ్రెస్ పార్టీకి సైతం రాజధాని పరిధిలోని 3 లోక్సభ సెగ్మెంట్లలో గెలవలేకపోయింది. నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ కేవలం ఆదిలాబాద్లోనే నాలుగు అసెంబ్లీ సీట్లతో పూర్తి ఆధిపత్యాన్ని చాటుకుంది. నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్ లోక్సభ స్థానాల పరిధిలో గుడ్డిలో మెల్లగా ఒకటి రెండు సీట్లతో ఉనికిని చాటుకుంది. బీఆర్ఎస్ నాలుగు చోట్ల జీరో... మూడు చోట్ల ఒక్కో స్థానమే 39 అసెంబ్లీ సెగ్మెంట్లలో సీట్లు గెలిచి బలమైన ప్రతిపక్షంగా అవతరించిన బీఆర్ఎస్కు లోక్సభ సెగ్మెంట్ల వారీగా చూస్తే...నాలుగు చోట్ల ప్రాతినిధ్యం దక్కలేదు. పెద్దపల్లి, మహబూబ్నగర్, ఖమ్మంలతోపాటు హైదరాబాద్ లోక్సభ స్థానాల్లోని 28 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. హైదరాబాద్ లోక్సభ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎంఐఎం, గోషామహల్లో బీజేపీ గెలిచింది. ఇక పెద్దపల్లి, మహబూబ్నగర్, ఖమ్మంలోని 21 స్థానాల్లో కాంగ్రెస్కు ఎదురే లేకుండా పోయింది. భువనగిరి ఎంపీ పరిధిలో కేవలం జనగామలో మాత్రమే టీఆర్ఎస్ గెలవగా, మిగతా ఆరు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లాయి. వరంగల్ లోక్సభ పరిధిలోని స్టేషన్ ఘన్పూర్, నల్లగొండలో సూర్యాపేట, మహబూబాబాద్లో భద్రాచలం సీట్లు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకోగా, మిగతా ఆరేసి సీట్లను కాంగ్రెస్ సొంతం చేసుకోవడం గమనార్హం. కాంగ్రెస్ రాజధానిలో హస్తవాసి బాగాలేదు ముఖ్యమంత్రి రేసులో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి దేశంలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గాల్లో ఒకటి. ఈ లోక్సభ స్థానం నుంచి రేవంత్రెడ్డి 2019 ఎన్నికల్లో 13వేల స్వల్ప తేడాతో విజయం సాధించారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పరిధిలోని ఏడు సెగ్మెంట్లలోనూ బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా ఉన్న హైదరాబాద్లో కూడా కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా దక్కలేదు. మెదక్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో మెదక్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందగా, మిగతా ఆరుచోట్ల బీఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేసింది. బీజేపీ నలుగురు ఎంపీలున్నా నిరాశే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు లోక్సభసీట్లలోనూ నిరాశే మిగిలింది. కేవలం ఆదిలాబాద్ ఎంపీ పరిధిలోనే బీజేపీ మెరుగైన స్థానాలు సాధించింది. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సోయం బాపూరావు బోథ్ అసెంబ్లీ నుంచి ఓడిపోయినా, ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూరు, ముథోల్లలో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఒకింత ఓదార్పు. మరో ఎంపీ సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లోక్సభ పరిధిలోని ఏడు సీట్లలో నాలుగు కాంగ్రెస్, మూడు బీఆర్ఎస్ గెలుచుకుంది. సంజయ్ పోటీ చేసిన కరీంనగర్, సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్లలో బీఆర్ఎస్ గెలుపొందడం విశేషం. మరో ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్లో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్లలో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. సిట్టింగ్ ఎంపీ అర్వింద్ పోటీ చేసిన కోరుట్లలో ఆయనే ఓడిపోయారు. ఇక కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించగా, నాంపల్లిలో ఎంఐఎం స్వల్ప తేడాతో కాంగ్రెస్పై విజయం సాధించింది. -
కొత్త సర్కారుకు శ్రీకారం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా.. తాజా ఎన్నికల్లో గెలిచినవారి జాబితాతో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్రాజ్ సోమవారం గెజిట్ జారీ చేశారు. ఆ వెంటనే సీఈఓ వికాస్రాజ్ రాజ్భవన్కు చేరుకుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు గెజిట్ నోటిఫికేషన్ ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా సీఈఓ వికాస్రాజ్ నేతృత్వంలోని ఎన్నికల అధికారుల బృందం గవర్నర్ తమిళిసైతో కొంతసేపు మర్యాదపూర్వకంగా సమావేశమైంది. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ శాససభాపక్ష (సీఎల్పి) నేతను ఎన్నుకోవడానికి సోమవారం సమావేశమయ్యారు. సీఎల్పీ నేతగా రేవంత్రెడ్డి ఎన్నికవుతున్నారని, ఆయన రాజ్భవన్కు చేరుకుని సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని, మరో ఒకరిద్దరు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రాజ్భవన్ ఉన్నతాధికారులు సోమవారం ఉదయమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభించారు. రాజ్భవన్ దర్బార్హాల్లో కొత్త సీఎం, మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించడానికి వీలుగా పొడియంను, కార్యక్రమానికి వచ్చే ఆహ్వానితుల కోసం కుర్చిలను సిద్ధం చేశారు. దర్బార్ హాల్ను అలంకరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీర్మానం తీసుకుని సీఎల్పీ నేత రాజ్భవన్కు వచ్చే అవకాశం ఉండటంతో గవర్నర్ తమిళిసై, రాజ్భవన్ అధికారులు సాయంత్రం వరకు వేచిచూశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రాజ్భవన్ వద్దకు చేరుకోవడంతో సందడి నెలకొంది. కాన్వాయ్లనూ సిద్ధం చేసినా.. కొత్త సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రొటోకాల్ ప్రకారం వారికి ప్రత్యేక కాన్వాయ్ల కోసం కూడా ఏర్పాట్లు జరిగాయి. రాజ్భవన్ పక్కనే ఉన్న దిల్కుషా అతిథి గృహం వద్ద ఈ మేరకు వాహనాలను సిద్ధంగా ఉంచారు. అయితే సీఎల్పీ నేత ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం రాలేదని, కొత్త సీఎం ప్రమాణ స్వీకారం సోమవారం ఉండదనే స్పష్టత రావడంతో జీఏడీ అధికారులు రాజ్భవన్ నుంచి వెనుతిరిగారు. కొత్త కొత్తగా సచివాలయం నూతన సీఎం, మంత్రులకు రాష్ట్ర సచివాలయంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. సచివాలయంలో పాత ప్రభుత్వంలోని కీలక ప్రజాప్రతినిధుల నేమ్ ప్లేట్లను అధికారులు సోమ వారం తొలగించారు. కొత్త సీఎం, మంత్రుల కోసం చాంబర్లను సిద్ధం చేస్తున్నారు. కొత్త సీఎం, మంత్రులకు సంబంధించి తమకు ఎలాంటి కబురు అందలేదని, అధికారికంగా సమాచారం అందగానే వారి కి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని సాధారణ పరిపాలన విభాగం అధికారులు తెలిపారు. అసెంబ్లీ కూడా ముస్తాబు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, కొత్తగా ఎన్నికైన వారితో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని కూడా ముస్తాబు చేస్తున్నారు. అసెంబ్లీ భవనానికి రంగులు వేయడంతోపాటు పాత ఫర్నిచర్ను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు, సీఎం చాంబర్లను అందంగా తీర్చిదిద్దే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రెండో శాసనసభ రద్దు కేసీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గం సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రద్దు ఉత్తర్వులు ఆదివారం (డిసెంబర్ 3) మధ్యాహ్నం నుంచే వర్తిస్తాయని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉపసంహరణ సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనానియమావళి అమలును కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అజయ్కుమార్ వర్మ సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)కు లేఖ రాశారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అక్టోబర్ 9న రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనానియమావళి అమల్లోకి వచి్చన విషయం తెలిసిందే. -
ఓవర్ టు ఢిల్లీ..!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించినా.. ముఖ్యమంత్రిని ఎంపిక అంశం కొలిక్కి రాలేదు. సోమవారం పొద్దంతా భేటీలు, సమావేశాలు, చర్చలు, ఇంకాసేపట్లోనే ప్రమాణ స్వీకారమనే ప్రచారాల మధ్య ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. పార్టీ శాసనసభాపక్షం (సీఎల్పీ) నాయకుడిని నిర్ణయించేందుకు సోమవారం హైదరాబాద్లోని ఎల్లా హోటల్లో సమావేశమైన కొత్త ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని వెల్లడించేందుకు మాత్రమే పరిమితమయ్యారు. వారి అభిప్రాయాలను ఢిల్లీకి పంపి, అధిష్టానం స్పందన కోసం ఎదురుచూసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని పరిశీలకుల బృందం.. ఎలాంటి తుది నిర్ణయాన్ని ప్రకటించకుండానే హస్తిన బాట పట్టింది. మంగళవారం పార్టీ అధిష్టానం పెద్దలతో డీకే బృందం భేటీ కానుంది. అనంతరం సీఎం, మంత్రి పదవులు, ఇతర కీలక అంశాలపై తుది నిర్ణయం వెలువడనుందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. అయితే తుది నిర్ణయాన్ని వెలువరించే ముందు అధిష్టానం పెద్దలు మరోసారి టీపీసీసీ ముఖ్యులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని అంటున్నాయి. ఈ ప్రక్రియ ముగిసేందుకు రెండు రోజుల సమయం పడుతుందని పేర్కొంటున్నాయి. సీఎంతోపాటు డిప్యూటీ సీఎంలు, మంత్రివర్గ బెర్తులు ఖరారైన తర్వాతే ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించాలన్న అభిప్రాయాల నేపథ్యంలో.. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు ఎప్పుడైనా కొత్త ప్రభుత్వం కొలువు దీరనుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఏకవాక్య తీర్మానానికి ఆమోదం సోమవారం ఉదయం 11.30 గంటలకు ఎల్లా హోటల్ వేదికగా కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశమైంది. కాంగ్రెస్ నుంచి తాజాగా గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు దీనికి హాజరయ్యారు. డీకే శివకుమార్ పర్యవేక్షణలో ఏఐసీసీ పరిశీలకులు కేజీ జార్జి, దీపాదాస్మున్షీ, అజయ్కుమార్, ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. తొలుత పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి డీకే శివకుమార్ మాట్లాడారు. గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపి.. సీఎం ఎంపిక వ్యవహారంలో పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. తర్వాత సీఎం అభ్యర్థి ఎంపిక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడికి కట్టబెడుతూ టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సీఎల్పీ నేత భట్టి తీర్మానాన్ని సమరి్థంచగా.. మిగతా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. సీఎం ఎవరైతే బాగుంటుంది? ఏఐసీసీ పరిశీలకులు సీఎల్పీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేలందరితో విడివిడిగా సమావేశమై.. సీఎం ఎవరైతే బాగుంటుందన్న అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ పేరు చెప్పగా, మరికొందరు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డిల పేర్లు చెప్పారని, ఇంకొందరు మాత్రం ఏఐసీసీ ఎవరిని ఎంపిక చేసినా తమకు సమ్మతమేనని చెప్పినట్టు సమాచారం. డీకే బృందం ఈ అభిప్రాయాలను వెంటనే ఢిల్లీకి చేరవేసింది. వాటిని హైకమాండ్ పరిశీలించి ఏం చెప్తుందోనని సాయంత్రం వరకు ఎదురుచూసింది. కానీ డీకే బృందాన్ని ఢిల్లీ రావాల్సిందిగా అధిష్టానం నుంచి పిలుపువచ్చింది. దీంతో డీకే శివకుమార్, ఏఐసీసీ పరిశీలకులు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం తెలంగాణ సీఎం ఎంపిక వ్యవహారంపై హైకమాండ్ పెద్దలతో చర్చించనున్నారు. సీఎం క్యాండిడేట్పై స్పష్టతకు వచ్చాక రాష్ట్రంలోని ముఖ్య నేతలతో చర్చించి, అవసరమైతే వారిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడనున్నట్టు సమాచారం. తర్వాత సీల్డ్ కవర్లో సీఎం అభ్యర్థి పేరును హైదరాబాద్కు పంపి, సీఎల్పీ సమావేశంలో సదరు నేతను ఎన్నుకుంటారని తెలిసింది. గెలిచిన వారికి అభినందనలు ఢిల్లీలోని సోనియా నివాసంలో సోమవారం జరిగిన పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశం తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అభినందించింది. ఈ సమావేశంలో సీఎం ఎంపిక వ్యవహారంపై ఎలాంటి చర్చ జరగలేదని ఏఐసీసీ నేతలు జైరాం రమేశ్, మాణిక్యం ఠాగూర్ తెలిపారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి వస్తున్న ఏఐసీసీ పరిశీలకులతో మాట్లాడాక హైకమాండ్ తుదినిర్ణయం తీసుకుంటుందన్నారు. సోమవారమే ప్రమాణమంటూ హడావుడి! సోమవారం మధ్యాహ్నం సీఎల్పీ సమావేశం ముగియకముందే కాంగ్రెస్ పక్షాన సీఎం ఎంపిక పూర్తయిందని, సాయంత్రమే రాజ్భవన్లో సీఎం, ఒకరిద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ మేరకు రాజ్భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ కొన్ని వీడియోలు కూడా బయటికి వచ్చాయి. గాం«దీభవన్ వర్గాల్లోనూ దీనిపై చర్చ జరిగింది. కానీ ఏఐసీసీ పెద్దలు డీకే టీమ్ను ఢిల్లీకి పిలిపించాక ఈ హడావుడి ఆగిపోయింది. హడావుడి వద్దు... ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి సీఎల్పీ సమావేశానికి ముందు హోటల్ పార్క్ హయత్లో కీలక సమావేశం జరిగింది. భట్టి, ఉత్తమ్, శ్రీధర్బాబు, ప్రేమ్సాగర్రావు, దామోదర రాజనర్సింహ, రాజగోపాల్రెడ్డి తదితరులు డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య వాడీవేడి చర్చ జరిగినట్టు తెలిసింది. ముఖ్యంగా సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారం, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న హడావుడి పార్టీకి నష్టం చేస్తుందని వారు డీకేతో పేర్కొన్నట్టు సమాచారం. ‘‘ఫలానా వారికి సీఎం పదవి ఇవ్వవద్దని మేమేమీ అనడం లేదు. కానీ అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకోవాలి. ఆ అభిప్రాయాలపై నిర్ణయం తీసుకునేందుకు అనంతరం జరిగే పరిణామాల గురించి ఆలోచించాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మనం ఇప్పుడు ప్రజల్లోకి పంపాల్సింది ‘స్ట్రాంగ్’ మెసేజ్ కాదు.. ‘స్మార్ట్’ మెసేజ్. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేసి ఫలితాలు సాధించాల్సిన బాధ్యతను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని వారు డీకేకు స్పష్టం చేసినట్టు సమాచారం. పార్టీ భవిష్యత్తును, పార్టీ పట్ల విధేయత, అనుభవాలను ఆచితూచి అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని.. ఇప్పటికిప్పుడే ఎమ్మెల్యేలకు వచ్చే ఇబ్బందేమీ ఉండదని వారు పేర్కొన్నట్టు తెలిసింది. -
TS: సీఎం పదవి పంచాయితీ..ఢిల్లీకి సీనియర్లు..?
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ మార్కు రాజకీయం మళ్లీ స్టార్టయింది. ఎన్నికల ఫలితాల్లో పార్టీ గెలిచిన వెంటనే జరగాల్సిన సీఎం ఎంపిక తంతు వాయిదాపడింది. సీఎం పదవి ఎవరికివ్వాలనే పంచాయితీ అంత ఈజీగా తేలేలా కనిపించడం లేదు. సీఎం ఎంపిక కోసం సోమవారం హైదరాబాద్లో జరగిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. గచ్చిబౌలిలోని ఓ హోటల్లో జరిగిన ఎమ్మెల్యేల మీటింగ్లో సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయం రాలేదు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సీఎం ఎవరనేది నిర్ణయించే బాధ్యతను ఎమ్మెల్యేలలంతా కలిసి ఏకవాక్య తీర్మానం ద్వారా అధిష్టానానికి అప్పగించారు. దీంతో సీన్ ఒక్కసారిగా ఢిల్లీకి మారిపోయింది. ఏఐసీసీ ముఖ్య పరిశీలకునిగా వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఎమ్మెల్యేల సమావేశం నుంచి అలిగి బయటికి వెళ్లిన భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ కూడా ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లి లాబీయింగ్..? సీఎం పదవిపై ఇప్పటికే రేసులో ఉన్న అగ్రనేతలెవరూ పట్టు వీడటం లేదని తెలుస్తోంది. తామూ పదవికి అర్హులమేనని ఢిల్లీ వెళ్లి హై కమాండ్కు మొర పెట్టుకోనున్నట్లు సమాచారం. దీంతో రేసులో ఉన్నవారందరి పేర్లు పరిగణలోకి తీసుకుని త్వరలో ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం అభ్యర్థి ఎవరనేది వెల్లడవుతుందనుకుని ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసిన ప్రభుత్వ అధికారులు, పోలీసులు పార్టీ నుంచి ఏ నిర్ణయం రాకపోవడంతో రాజ్భవన్ నుంచి ఇవాళ సాయంత్రం వెళ్లిపోయారు. ఎల్లా హోటల్లోనే ఎమ్మెల్యేలు.. అయితే సీఎం ఎవరనేదానిపై మంగళవారం క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్, ఇతర ఏఐసీసీ పరిశీలకులు రేపు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సమావేశమై చర్చించనున్నారు. భేటీ తర్వాత సీఎం ఎవరనే నిర్ణయాన్ని ఖర్గే వెల్లడిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఢిల్లీకి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు క్యూ కట్టనుండడంతో ఒక్కరోజులో అధిష్టానం సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తుందా లేదా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సోమవారం సమావేశమైన గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బస చేస్తున్నారు. సీఎం అభ్యర్థి ఫైనలయ్యేదాకా వారంతా అక్కడే ఉండాలని పార్టీ ఆదేశించినట్లు సమాచారం. ఇదీచదవండి..ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారి ఇలా.. ఆసక్తికర వ్యాఖ్యలు -
గుండెపోటుతో బీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్ మృతి
సాక్షి, జనగామ: జనగామ జిల్లా జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. హన్మకొండలోని చైతన్యపురిలోని నివాసంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు సంపత్రెడ్డిని నగరంలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే సంపత్రెడ్డి మృతి చెందారు. ఎనిమిది సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో సంపత్రెడ్డి కుమారుడు మృతి చెందాడు. ఇటుక బట్టీల వ్యాపారం చేసే సంపత్రెడ్డి 2004లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత జెడ్పీటీసీ ఎన్నికల్లో చిల్పూర్ మండల జెడ్పీటీసీగా గెలుపొందారు. తర్వాత జెడ్పీ చైర్మన్ అయ్యారు. జెడ్పీ చైర్మన్గా ఉంటూనే జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంపత్రెడ్డి మృతితో ఆయన స్వగ్రామమైన రాజవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. మృతదేహాన్ని స్వగ్రామం రాజవరానికి తీసుకెళ్లి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రేపు నివాళులర్పించనున్న కేసీఆర్.. జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జిల్లా జెడ్పీచైర్మన్ సంపత్రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మంగళవారం కేసీఆర్ జనగామకు వెళ్లి సంపత్రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. ఒకే ఏడాదిలో రెండో జెడ్పీచెర్మన్.. ఇదే ఏడాది జూన్లో ములుగు జిల్లా జెడ్పీచైర్మన్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుసుమ జగదీష్ గుండెపోటుతో మృతి చెందారు. ఈయన కూడా బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్తో నడిచిన వారిలో ఒకరు. జగదీష్ మృతి చెందినపుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటన నుంచి కోలుకోక ముందు తొలి నుంచి పార్టీలో ఉన్న మరో జెడ్పీచైర్మన్, జిల్లా అధ్యక్షుడిని సంపత్రెడ్డి రూపంలో కోల్పోవడం బీఆర్ఎస్ పార్టీ వర్గాలను కలవర పరుస్తోంది. ఇదీచదవండి..ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారి ఇలా.. ఆసక్తికర వ్యాఖ్యలు -
ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారి ఇలా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత తొలిసారి స్పందించారు. సోమవారం సాయంత్రం ఎర్రవల్లిలోని తన ఫామ్హౌజ్లో గెలిచిన ఎమ్మెల్యేతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు. వచ్చే నెల 16వ తేదీ దాకా మన ప్రభుత్వం కొనసాగేందుకు అవకాశం ఉంది(తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి గడువు జనవరి 16వ తేదీ దాకా ఉంది). కానీ, ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకున్నాం. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరగుతుందో చూద్దాం’’ అని అన్నట్లు తెలుస్తోంది. అలాగే.. త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ మీటింగ్ జరుపుదాం. ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేద్దాం. అదే మీటింగ్లో బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతను ఎన్నుకుందాం అని ఆయన ఎమ్మెల్యేలతో అన్నారు. సీఎం కేసీఆర్ను కలిసిన వాళ్లలో నెగ్గిన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్లు ఉన్నారు. -
TS: సీఎం ప్రమాణస్వీకారం వాయిదా
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్తో పాటు మరో నలుగురు అబ్జర్వర్లు కూడా ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పరిశీలకులు సమావేశమవనున్నారు.దీంతో ఇవాళ సీఎల్పీ నేత ప్రకటన లేనట్లేనని సమాచారం. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల(సీఎల్పీ)సమావేశం సోమవారం ఉదయం గచ్చిబౌలిలోని ఎల్లాహోటల్లో జరిగింది. ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు. ఏకాభిప్రాయం రాకపోవడంతో సీఎల్పీ నేతల ఎన్నిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాఖ్య తీర్మానం చేసి హైకమాండ్కు పంపారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి సీఎల్పీ నేత పేరుపై క్లారిటీ వస్తుందని అంతా ఎదురు చూశారు. కానీ చివరకు డీకే శివకుమార్ సహా నలుగురు ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీకి పయనమయ్యారు. దీంతో సీఎల్పీ నేత ఎంపిక వాయిదా పడింది. మరోపక్క తెలంగాణ రెండవ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ మూడో శాసనసభను గెజిట్లో నోటిఫై చేశారు. జీఏడీ అధికారులు కూడా సీఎం ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త సీఎం కోసం కొత్త కాన్వాయ్ని కూడా రెడీ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సీఎల్పీ నేత ఎవరో వెల్లడించిన వెంటనే కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని అంతా భావించారు. చివరకు పరిశీలకులు ఢిల్లీ వెళ్లడంతో సీఎల్పీనేత ఎంపికతో పాటు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం కూడా ఇవాళ లేనట్లేనని తేలిపోయింది. సీఎం ప్రమాణ స్వీకారం వాయిదాపడిందని తెలియడంతో రాజ్భవన్ నుంచి పోలీసులు, అధికారులు వెళ్లిపోయారు. ఇదీచదవండి..తెలంగాణలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. అప్డేట్స్ -
బీఆర్ఎస్ది ఘోర పరాజయం కాదా?
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీది ఘన విజయమేనా? ఇంతకాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ది ఘోర పరాజయమేనా?.. ఈ ఫలితాలు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంకేతాలు ఇచ్చాయి? మొత్తం ఫలితాలను విశ్లేషిస్తే.. కాంగ్రెస్ పార్టీది పూర్తి స్థాయి వేవ్ కాదనే అర్ధం అవుతోంది. అలాగే బీఆర్ఎస్ది ఘోర పరాజయం కాదని తెలుస్తుంది. ఎంత కాదన్నా ఓటమి ఓటమే కాబట్టి దానికి ఎలాంటి మినహాయంపు ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేసీఆర్ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతే కాని, కాంగ్రెస్ కు వచ్చిన పాజిటివ్ ఓటు కాదనిపిస్తోంది. ✍️కాంగ్రెస్ ప్రభంజనం అయితే డెబ్బై నుంచి ఎనభై సీట్లవరకు సంపాదించి ఉండేది. మిత్రపక్షం సీపీఐ గెలిచిన సీటుతో కలిపి కాంగ్రెస్కు 65 స్థానాలే దక్కాయి. అంటే మెజార్టీకి అవసరమైన దానికన్నా ఐదు సీట్లే ఎక్కువచ్చాయి. బొటాబొటి మెజార్టీ అన్నమాట!. గత ఎన్నికలలో బీఆర్ఎస్ కు 88 సీట్లు వచ్చాయి. అప్పుడు అది పాజిటివ్ వేవ్ గా కనిపించింది. ఇప్పుడు కాంగ్రెస్ కు అదే తరహాలో సీట్లు వచ్చి ఉంటే వారి మేనిఫెస్టోకి ప్రజలు ఆకర్షితులై ఓట్లు వేశారన్న భావన కలిగేది. ఎందుకంటే ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ల మేనిఫెస్టోలు రెండూ దాదాపు ఒకరకంగానే ఉన్నాయి. ✍️ఉమ్మడి ఖమ్మం,నల్గొండ,వరంగల్ వంటి జిల్లాలలో కాంగ్రెస్ స్వీప్ చేస్తే.. హైదరాబాద్ నగరం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలో బీఆర్ఎస్ వేవ్ వచ్చింది. హైదరాబాద్ నగరంలో ఒకటి తప్పా అన్ని సీట్లు బీఆర్ఎస్, ఎంఐఎం ఖాతాలోకి రాగా, కాంగ్రెస్కు ఒక్క సీటు దక్కకపోవడం నిదర్శనంగా కనిపిస్తోంది. అయినా బీఆర్ఎస్ ఎందుకు ఓటమిపాలైంది? ఇది బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్వయంకృతాపరాధం అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన అహంభావ దోరణే అయనను దెబ్బ తీసింది. కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలను ఆయనే పోశారనిపిస్తోంది. ✍️భారతీయ జనతా పార్టీ తన గ్రాఫ్ పెంచుకుంటుందని ఊహించినట్లే జరిగింది. కాని, అది ఆశించినంత పెరగలేదని చెప్పాలి. కాంగ్రెస్కు వేవ్ రాకపోతే హంగ్ పరిస్థితి ఏర్పడవలసి ఉంది. బీఆర్ఎస్ కు సొంతంగా పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదని ఎన్నికల ప్రక్రియ ఆరంభం అయినప్పటి నుంచి కనిపిస్తూనే ఉంది. ఆ విషయాన్ని ఎంతో అనుభవం కలిగిన కేసీఆర్ కనిపెట్టలేకపోయారు. ముందస్తుగా అభ్యర్ధుల ప్రకటన చేయడం వ్యూహాత్మకంగా సరైందే అయినా.. వారిలో నెగిటివ్ ఉన్న సిటింగ్ ఎమ్మెల్యేలను ఎక్కువ మందిని మార్చకుండా అతి విశ్వాసానికి పోయారు. ఫలితంగా.. 39 సీట్లకే పరిమితం అయ్యారు. ఎమ్మెల్యేల మార్చకపోవడం వల్ల కనీసం పది,పదిహేను సీట్లను ఆయన చేజేతులారా కోల్పోయారు. అవి వచ్చి ఉంటే ఏభై నుంచి ఏభైఐదు సీట్ల వరకు బీఆర్ఎస్ లాగగలిగేది. అప్పుడు కాంగ్రెస్ కు అరవైఐదు సీట్లు రావడం కష్టం అయ్యేది. అయితే.. ఆఖర్లో కెసిఆర్ పన్నెండు సీట్లలో మార్చితే.. తొమ్మిదింట కొత్తవారు గెలిచిన సంగతి గమనించాలి. ✍️తెలంగాణలో హంగ్ వచ్చి ఉంటే.. కాంగ్రెస్ కు బీజేపీ మద్దతు ఇవ్వలేదు. ఎంఐఎం ఎటూ తనకే మద్దతు ఇస్తుంది కనుక బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి చాన్స్ ఉండేది. అది కేసీఆర్ వైఫల్యం. కేసీఆర్ తనకు అవసరం లేకపోయినా గత ఎన్నికలలో గెలిచిన తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. దానివల్ల బీఆర్ఎస్ లో ఉన్న నేతలకు ఈసారి టిక్కెట్లు ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలలో పది మంది వరకు ఓటమి చెందారు. దీనికి ఉదాహరణ పాలేరు, కొత్తగూడెం లలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వడం వల్ల పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటివారిని ఆయన వదలుకోవల్సి వచ్చింది. ఇతర విమర్శలను పక్కనపెడితే.. వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ఇలాంటి రాజకీయతప్పిదాలు చేయడం వల్ల వారు భారీ మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది. ✍️ కాంగ్రెస్ విషయాన్ని చూస్తే.. వరసగా మూడు ఉప ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయిన పార్టీ.. అసాధారణ రీతిలో అరవై ఐదు సీట్లు గెలవడం గొప్ప విషయమే. ఇది కాదనం.. కాకపోతే దీనిని ఘన విజయంతో పోల్చలేకపోవడానికి కారణం ఏమిటంటే అనుకూల వేవ్ తెచ్చుకోలేకపోవడం. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఎన్నికైనప్పటి నుంచి వరస పరాజయాలు ఎదురైనా, ఆయన ఎక్కడా వెనక్కి తగ్గకుండా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతూ వచ్చారు. ఘాటైన విమర్శలు సాగిస్తూ వచ్చారు. కాంగ్రెస్లో అందరిని కలుపుకుని వెళ్లడంలో ఇబ్బందులు ఉన్నా సర్దుకుపోయారు. టిక్కెట్ల కేటాయింపు సమయంలో కొంతమంది వృద్దనేతలను పక్కన బెట్టి యూత్ కు అవకాశం ఇచ్చారు. అలాగే మిర్యాలగూడ వంటి కాంగ్రెస్ గెలుపు అవకాశం ఉన్న సీటును సీపీఎంకు ఇవ్వకుండా నిరాకరించి పొత్తును వదలుకోవడానికి కూడా సిద్దపడ్డారు. పార్టీలో టిక్కెట్లురాని వారి అసంతృప్తిని తగ్గించడంలో అసమ్మతి ఎక్కువగా లేకుండాచేయడంలో ఆయన సఫలం అయ్యారు. ఒకవైపు తనను తాను అందరికి ఆమోదయోగ్యమైన నేతగా గుర్తింపు పొందే విధంగా ప్రయత్నిస్తూనే తన ఆధిపత్యం తగ్గకుండా జాగ్రత్తపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిన ప్రధాన నేతగా రేవంత్ ఒక్కరే కనిపించారు.తద్వారా పార్టీలో జోష్ పెంచారు. ✍️ భారతీయ జనతా పార్టీ నిజానికి బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అవుతుందని ఒక దశలో వాతావరణం ఏర్పడింది. కానీ ఆ పార్టీ అధిష్టానం ఏ ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు చేసిందోకాని, అలాగే కొన్నిపరిణామాలకు ఎందుకు కారణం అయిందో కాని.. కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్లయింది. కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని తానే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయని ప్రజలలో గుర్తింపు పొందగలిగింది. ఆరు గ్యారంటీలను చూసే ప్రజలు ఓట్లు వేశారని చెప్పలేం. కాకపోతే ఎన్నికలలో గెలిచాక ఆ మేనిఫెస్టోపై అందరూ దృష్టి పెడతారు. ప్రజలు ముందు అధికారంలో ఉన్న పార్టీపై తమ వ్యతిరేకత చూపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఏమి చేయబోతోంది గమనిస్తారు!. ✍️ కేసీఆర్ అత్యధిక సమయం ప్రగతి భవన్ కే పరిమితం అవడం, ప్రజలకు తగు సమయం ఇవ్వకపోవడం, ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా కలవరన్న ప్రచారం జరగడం మొదలైన విషయాలు బాగా అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. కొత్త సచివాలయం కట్టాలని ఏ జ్యోతిష్కుడు చెప్పారో కాని.. అది కూడా ప్రజలలో నెగిటివ్ పెంచింది. వందల కోట్ల రూపాయలు వృథా చేశారన్న అభిప్రాయం వచ్చింది. దళిత బంధు స్కీం పేరుతో పది లక్షల రూపాయల ఆర్దికసాయం చేయడం ఆచరణ సాధ్యం కాదని తెలిసినా. దానిని అమలు చేయడానికి ముందుకు వెళ్లి బొక్కబోర్లా పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ వారికే అవి దక్కుతున్నాయని మిగిలినవారికి కోపం తెప్పించింది.అందులో ముప్పై శాతం డబ్బు అవినీతి కింద పోతోందని స్వయంగా కేసీఆరే ప్రకటించారు. దళితులకుమాత్రమే బంధు స్కీమ్ ఇస్తారా అని బీసీలు, మైనార్టీలు తదితర వర్గాలు ప్రశ్నించసాగాయి. అవన్నీ బీఆర్ఎస్కు తీవ్ర నష్టాన్ని తెచ్చి పెట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడంలో మంచి ఉద్దేశమే ఉన్నా, దానిని నిపుణుల నిర్ణయాలకు వదలకుండా, తానే అన్నీ చేయగలనని భావించి తదనుగుణంగా వ్యవహరించడం పెద్ద ప్రమాదమే అయింది. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ కుంగి పోవడం కేసీఆర్కు తీరని అప్రతిష్ట తెచ్చింది. నిజంగా ఆ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం కలిగి ఉంటే ఉత్తర తెలంగాణలో భారీ స్థాయిలో సీట్లు గెలవాల్సి ఉంది. అక్కడ కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా గణనీయ ఫలితాలు సాధించింది. దీనిని బట్టే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. ✍️ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరిగా పరీక్షలు నిర్వహించలేకపోవడం, గ్రూప్ పరీక్షలు జరిగి ఉద్యోగాలు రాకపోవడం కూడా బాగా డ్యామేజ్ అయింది. కేటీఆర్ స్వయంగా వెళ్లి దానిని చక్కదిద్దడానికి యత్నించినా, అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. తెలంగాణ ఉద్యమకారులను దూరం చేసుకోవడం తో వారిలో పలువురు ఊరూవాడా తిరిగి బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసి ప్రభావితం చేయగలిగారు. కుటుంబ పాలన అనే విమర్శకు సరైన సమాధానం చెప్పలేకపోయారు.వీటన్నిటికి మించి ఆయన రెండో నియోజకవర్గంగా కామారెడ్డిని ఎంపిక చేసుకోవడం కూడా తెలివైన నిర్ణయం కాదని ఆయన ఓటమి రుజువు చేసింది. ఎవరికి చెప్పకుండా, అచ్చంగా గతంలో ఎన్.టి.ఆర్ కల్వకుర్తిలో పోటీచేసి పరాజయం చెందిన రీతిలోనే కేసీఆర్ ఓటమిపాలయ్యారు. ఇన్ని లోపాలు ఉన్నా ఓవరాల్ గా చూసినప్పుడు ప్రభుత్వ పనితీరు మరీ నాసిరకంగా లేదు. ✍️మంత్రిగా కేటీఆర్ బాగానే రాణించారు. హైదరాబాద్ లో ఐటి పరిశ్రమకు సంబందించి ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. హైదరాబాద్ లో అభివృద్ది పనులు బాగానే చేశారు. అందువల్లే పార్టీకి ఈ మాత్రం అయినా సీట్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు సంక్షేమ స్కీములను అమలు చేశారు. రైతు బంధు , రైతుల రుణ మాఫీ వంటివాటిని చాలావరకు చేశారు. అయితే పట్టణాలపై పెట్టిన దృష్టి.. పల్లె ప్రాంతాలలో పెట్టలేదన్న భావన బలపడింది. ఎందుకో ఏడాది నుంచే పల్లెల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది. దానిని తగ్గించుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయింది. ఇంకో సంగతి చెప్పాలి. ఈనాడు వంటి మీడియా కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలిచి, ప్రభుత్వ పొరపాట్లను,లోటుపాట్లను బయటకు రాకుండా చేయాలని ప్రయత్నించినా అది సఫలం కాలేదు. కేవలం మీడియా వల్లే పార్టీలు గెలవడం, ఓడడం జరగదని మరోసారి తేలింది. కేసీఆర్ యజ్ఞం చేసినా ఈ విడత విజయం సాధించలేదు. అందువల్ల అలాంటి సెంటిమెంట్లు కొంతమేరే తప్ప ఎప్పుడూ ఉపయోగపడవని కూడా రుజువైంది. బీజేపీ గనుక బండి సంజయ్ ను మార్చకపోవడం, డిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్టు చేస్తామంటూ ప్రచారం చేసినా, అలా జరగకపోవడం తదితర కారణాలతో బీజేపీ తన అవకాశాలాను తానే వదలుకుందనిపిస్తుంది. బీజేపీ మరికాస్త మెరుగ్గా పనిచేసినా హంగ్ వచ్చి ఉండేది. అప్పుడు బీజేపీకి చక్రం తిప్పే అవకాశం వచ్చేదేమో! ✍️తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత విజయం సాధించడం కాంగ్రెస్కు పెద్ద ఊరట. మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలవలేకపోయిన బాధ ఉన్న సమయంలో కొంత ఊరటగా తెలంగాణలో గెలిచారు. తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలను యధావిధిగా అమలు చేయడం అంత తేలికైన సంగతి కాదు. కాంగ్రెస్ వాటిని అమలు చేస్తే వచ్చే పార్లమెంటు ఎన్నికలలో మంచి ఫలితాలు పొందగలుగుతుంది. లేకపోతే మాత్రం ఆ ఎన్నికలు కాంగ్రెస్ కు పెద్ద సవాలు అవుతాయి. బీఆర్ఎస్ పార్టీని పటిష్టంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమైన పాయింటే. ఆ పార్టీలో నాయకత్వ స్థాయిలో కేటీఆర్, హరీష్ రావు ల మధ్య విబేధాలు వంటివి చోటు చేసుకుంటే చాలా కష్టాలు వస్తాయి. తన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఆకర్షించకుండా జాగ్రత్తపడవలసి ఉంటుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ అధికారం వచ్చిందన్న సంతోషం ఉన్నా, భవిష్యత్తులో ఎన్నో గండాలు అధిగమనించవలసి ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా గట్టిగా నిలబడగలిగితేనే భవిష్యత్తు ఎన్నికలలో ప్రభావం చూపగలుగుతుంది. వీటిలో ఏది జరగకపోయినా బీజేపీ మరింత పుంజుకునే అవకాశం ఉంది. తెలంగాణ ఎన్నికలు బీఆర్ఎస్ కు కాస్ట్ లీ అనుభవం అయితే, కాంగ్రెస్ కు మరీ ఫ్రీ హాండ్ ను ప్రజలకు ఇవ్వలేదు. బీజెపిని ఇంకా వెయిటింగ్ లోనే ఉంచారని చెప్పాలి. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
తెలంగాణ సీఎం ఎవరు?.. అప్డేట్స్
లైవ్ అప్డేట్స్.. ఎప్పటికప్పటి సమాచారం సీఎం ఎవరు.. ఓవర్ టు ఢిల్లీ ►తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం ►సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో తేలని పంచాయితీ ►ఎవరికి వారు పట్టు వీడని నేతలు ►మ్యూజికల్ చెయిర్ గేమ్ను తలపిస్తున్న టీ కాంగ్ నేతల వ్యవహారం ►ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి ► తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్తో పాలు నలుగురు పరిశీలకులు కూడా ఢిల్లీకి ఆ కథనాల్ని నమ్మొద్దు: భట్టి ►హైదరాబాదులో సీఎల్పీ సమావేశం జరిగింది ►ఈ సమావేశంలో సీఎల్పీ నాయకుడి ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేసి పంపించడం జరిగింది ►పార్టీ అధిష్టానం సిఎల్పీ నాయకుడిని ప్రకటిస్తుంది ►ప్రస్తుతం ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వివిధ కథనాలు ఊహాగానాలు మాత్రమే.. వాటిని ఎవరు నమ్మొద్దు. తేలేదాకా హోటల్లోనే.. ►హైదరాబాద్ ఎల్లా హోటల్ లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ►అదిష్టానం సీఎం అభ్యర్థి ని ప్రకటించే వరకు హోటల్ కే పరిమితం కానున్న ఎమ్మెల్యేలు ►అదిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేలు ►రేపు డీకే శివకుమార్ ద్వారా నిర్ణయం వెల్లడించనున్న కాంగ్రెస్ అధిష్టానం ►రేపటితో సీఎం అభ్యర్థి ఉత్కంఠ వీడుతుందా? అనే అనుమానంలో కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్ను కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే ►కేసీఆర్ను కలిసిన తెల్లం వెంకట్రావు ►కాంగ్రెస్లోకి మారతారంటూ ఉదయం నుంచి ప్రచారం ►సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన తెల్లం ►సాయంత్రం ఎర్రవెల్లి ఫామ్హౌజ్ వెళ్లి కేసీఆర్తో భేటీ కాంగ్రెస్లో ఓ విధానం ఉంటుంది: మాణిక్యం ఠాగూర్ ►తెలంగాణ పరిణామాలపై AICC స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మాణిక్యం ఠాగూర్ ►తెలంగాణ ఎమ్మెల్యేల అభిప్రాయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు చేరింది ►రేపు ఖర్గే ఏఐసీసీ పరిశీలకులతో భేటీ అవుతారు ►సీఎం అభ్యర్థి ఎవరనేది ఆయనే ప్రకటిస్తారు ►కాంగ్రెస్లో ఓ విధానం ఉంటుంది ►సరైన అభ్యర్థినే సీఎంగా హైకమాండ్ ప్రకటిస్తుంది ‘తెలంగాణ సీఎం అభ్యర్థి’పై సోనియా చర్చ! ►కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ సమాశంలో తెలంగాణ సీఎం అభ్యర్థి పై నో చర్చ ►కానీ, ఆ తర్వాత సోనియా గాంధీ మరో సమావేశం ►ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన సోనియా ►తెలంగాణ ఫలితాలు, సీఎం అభ్యర్థిపై చర్చించిన సోనియా ►రేపు డీకే శివకుమార్, ఇతర పరిశీలకుతో చర్చించనున్న ఖర్గే ► నిర్ణయాన్ని డీకేఎస్ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పంపనున్న హైకమాండ్ రేపు జనగామకు మాజీ సీఎం కేసీఆర్! ►రేపు జనగామకు వెళ్లనున్న మాజీ సీఎం కేసీఆర్ ►బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం ►సంతాప ప్రకటన వెలువరించిన కేసీఆర్ ►తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్ల నుంచి తన వెంట నడిచిన యువ నేత సంపత్ రెడ్డి మరణం బాధాకరమని కేసీఆర్ ఆవేదన ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ఎవరిని అడిగి చేశారు? ►తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై కాంగ్రెస్ సీనియర్ల గుస్సా ►సీఎం అభ్యర్థి ఎంపిక, ప్రమాణ స్వీకార ఏర్పాట్ల లీకులపైనా ఆగ్రహం ►ఎవరిని అడిగి ఏర్పాట్లు చేశారంటూ హైకమాండ్కు ఫిర్యాదు ఏం జరుగుతుందో చూద్దాం: కేసీఆర్ ►తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ►గెలిచిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ శుభాకాంక్షలు ►ఇంకో నెల ప్రభుత్వంలో కొనసాగే అవకాశం ఉన్నా.. ప్రజా తీర్పుతో హుందాగా తప్పుకున్నాం ►కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం ►చూద్దాం ఏం జరుగుతుందో ►త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ మీటింగ్ జరుపుదాం ►ఓటమిపై సమీక్ష జరుపుదాం ►శాసనసభ పక్ష నేతను ఎన్నుకుందాం తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ ►తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 నేపథ్యంతో ఎన్నికల కోడ్ ముగిసింది ►సోమవారం సాయంత్రంతో కోడ్ ముగిసినట్లు ఈసీ అధికారిక ప్రకటన చేసింది ►అక్టోబర్ 9వ తేదీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ►ఆ మరుక్షణం నుంచే అమల్లోకి వచ్చిన కోడ్ ►డిసెంబర్ 5 వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగించాలని ఈసీ నోటిఫికేషన్ ►తాజాగా.. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కోడ్ ముగిసినట్లు ప్రకటించిన ఎన్నికల సంఘం అబ్బే.. సీఎల్పీపై చర్చించలేదు: జైరాం రమేష్ ►సోనియా నివాసంలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ సమావేశంలో తెలంగాణ సీఎల్పీ అంశంపై చర్చ జరగలేదు ►డీకే శివకుమార్, ఇతర పరిశీలకులు ఢిల్లీ వస్తున్నారు ►పరిశీలకులతో చర్చించాల్సిన అవసరం ఉంది ►వాళ్ల అభిప్రాయం హైకమాండ్ తీసుకుంటుంది ►సీఎల్పీ ఖరారుపై రేపు నిర్ణయం తీసుకోవచ్చు ►మీడియాతో సీనియర్నేత జైరాం రమేష్ తెలంగాణ అడ్వొకేట్ జనరల్ రాజీనామా ►తెలంగాణ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ రాజీనామా ►అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు కూడా.. ►ఫాక్స్ ద్వారా రాజీనామాను పంపిన ఏజీ, ఏడీజీ ►ప్రభుత్వం మారడంతో.. రాజీనామా బాటలో మరికొందరు అధికారులు రాజ్భవన్ నుంచి వెళ్లిపోయిన.. ►రాజ్ భవన్ లో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమ వాయిదా ►రాజ్ భవన్ నుంచి వెళ్లిపోయిన జీఏడీ, పోలీస్, ప్రోటోకాల్, ఐ అండ్ పీఆర్ అధికారులు రాజ్భవన్ వద్ద ‘సీఎం రేవంత్’ నినాదాలు ►సీఎల్పీ ఎవరనేది తేల్చని ఏఐసీసీ ►రేపటి వరకు కొనసాగనున్న ఉత్కంఠ ►సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా ►రాజ్భవన్ వద్ద నుంచి కాంగ్రెస్ శ్రేణుల్ని ఖాళీ చేయిస్తున్న పోలీసులు ►రాజ్ భవన్ ముందు కాంగ్రెస్ కార్యకర్తల హంగామా ►సీఎం రేవంత్ అంటూ రేవంత్ అభిమానుల నినాదాలు ►ఢిల్లీకి పయనమైన డీకే శివకుమార్ ►డీకేఎస్ వెంట భట్టి, దామోదర, ఉత్తమ్లు ►రేపు ఖర్గేతో భేటీ తర్వాతే సీఎం అభ్యర్థిపై అధికారిక ప్రకటన వంద కోట్ల ఖర్చుతో నన్ను ఓడించారు: దుర్గం చిన్నయ్య ►బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సంచలన వ్యాఖ్యలు ►కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేగా నెగ్గారంటూ గడ్డం వినోద్పై ఆరోపణలు ►గడ్డం కుటుంబం.. వేల కోట్ల రూపాయలు ఉన్న కుటుంబం ►నన్ను ఓడగొట్టడానికి కుట్ర చేసింది ►అధర్మంగా యుద్ధం చేసి నాపై గెలిచారు ►ఏడాది కాలంగా నాపై ఎన్నో అసత్య ప్రచారాలు తెరపైకి తెచ్చారు ►కుట్రలతో నన్ను దెబ్బ తీశారు ►డబ్బు మందు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసి గెలిచారు ►బెల్లంపల్లిలో వంద కోట్లు ఖర్చు చేసి గెలిచారు ►నైతికంగా మేము గెలిచినాం. వాళ్లు గెలిచినా ఓడిపోయినట్టే! ►బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వాళ్లు దాడులు చేస్తున్నారు.. ఆపకపోతే ఖబడ్దార్ సీఎల్పీ ఎంపిక వాయిదా? ►తెలంగాణ సీఎల్పీ నేత ఎంపిక వాయిదా ►ఢిల్లీకి పయనం అయిన కాంగ్రెస్ నేతలు ►రాజ్భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల్ని ఖాళీ చేయిస్తున్న పోలీసులు ►ఇవాళ రాత్రే సీఎం ప్రమాణం ఉంటుందని ఏర్పాట్లు చేసిన అధికారులు ►తాజా పరిణామాలతో కార్యక్రమం వాయిదా అయినట్లే! ►రేపు కీలక సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ►తెలంగాణ సీఎం ఎవరనే దానిపై కొనసాగనున్న సస్పెన్స్ ► తెలంగాణ గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ రాజీనామా ఇవాళ సీఎల్పీ నేత ప్రకటన లేనట్లే! ►కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్ ► ఢిల్లీకి తెలంగాణ ఎన్నికల కాంగ్రెస్ పరిశీలకుడు డీకే శివకుమార్ ►శివకుమార్తో పాటు మరో నలుగురు పరిశీలకులు కూడా? ►రేపు ఖర్గేతో ఏఐసీసీ పరిశీలకుల సమావేశం ►ఇవాళ సీఎల్పీ నేత ప్రకటన లేనట్లే! ఎర్రవల్లి ఫామ్హౌజ్కు గులాబీ నేతల క్యూ ►బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు ఎమ్మెల్యేల క్యూ ►బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన వాళ్లంతా ఒక్కొక్కరుగా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి.. ►ఎమ్మెల్యేలతో పాటు నేతలు కూడా ►హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, తులా ఉమ, మల్లారెడ్డి,కడియం శ్రీహరి, పద్మ దేవేందర్ రెడ్డి,జగదీష్ రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు,కేటీఆర్, సుదీర్ రెడ్డి,సత్యవతి రాధోడ్ ఎమ్మెల్సీ, మహమూద్ అలీ, రెడ్యానాయక్ తదితరులు కాసేపట్లో వీడనున్న ‘సీఎం’ ఉత్కంఠ? ►కొద్దిసేపట్లో సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించనున్న డీకే శివకుమార్ ►ఢిల్లీలో సోనియా నివాసంలో జరుగుతున్న పార్లమెంటరీ స్ట్రాటజీ మీటింగ్ ► ఈ సమావేశంలో తెలంగాణ సీఎం అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం వినోద్ కుమార్ రాజీనామా ►రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవికి బోయినపల్లి వినోద్ కుమార్ రాజీనామా ►కిందటి ఏడాది బాధ్యతలు చేపట్టిన వినోద్ ►గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడినా.. స్నేహపూర్వకంగా కేబినెట్ హోదాలో వినోద్కు కీలక పదవి అప్పజెప్పిన కేసీఆర్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి వినోద్ ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా పోషిస్తాం: కేటీఆర్ ►గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలకు అభినందనలు ►పదేళ్లలో బీఆర్ఎస్ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టింది ►ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు సాధించింది ►తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం ►ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తాం తెలంగాణ సీఎం ఎవరనేది మరికాసేపట్లో.. ►సోనియా గాంధీ నివాసంలో పార్లమెంటరీ స్ట్రాటజీ మీటింగ్ ►తెలంగాణ సీఎం అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ►ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ నివేదిక పంపిన డీకేఎస్ ►ఢిల్లీ నుంచి సీఎల్పీ నేత ఎంపిక కోసం టీ కాంగ్రెస్ శ్రేణులు వెయిటింగ్ ►నిర్ణయం వెలువడగానే తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ప్రకటన ►ఆ వెంటనే రాజ్భవన్లో తెలంగాణ కొత్త సీఎం ప్రమాణం ►సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా?? తెలంగాణలో కొత్త శాసనసభ ►తెలంగాణలో మూడో శాసన సభ ఏర్పాటకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల ►పాత అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసిన రాజ్భవన్ ►ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ తమిళిసైకు సమర్పించిన సీఈవో వికాజ్రాజ్ ►119 మంది ఎమ్మెల్యేల ఎంపికను ధృవీకరించిన గవర్నర్ ►గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ ►గెజిట్ ను గవర్నర్ కు అందించిన సీఈవో, ఈసీ ముఖ్య కార్యదర్శి ►అంతకు ముందు అసెంబ్లీ రద్దు ప్రతులను అందించిన అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారి ► ఇక కొలువుదీరనున్న కొత్త శాసనసభ వరుస రాజీనామాలు ►తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత వరుస రాజీనామాలు ►బీఆర్ఎస్ ప్రభుత్వంలో పని చేసిన పలువురు అధికారులు కూడా ►ఇప్పటికే రకరకాల కార్పొరేషన్ల చైర్మన్ల రాజీనామా ► 15 మంది కార్పొరేషన్ చైర్మన్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది కౌశిక్రెడ్డిపై కేసు నమోదు ►హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు నమోదు ►పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగం ►కౌంటింగ్ సందర్భంగా నిన్న పోలీసులతో వాగ్వాదం కొత్త సీఎం కోసం కొత్త కాన్వాయ్.. ►రాజ్ భవన్ వద్ద కొత్త సీఎం కోసం న్యూ కాన్వాయ్ ►రాజ్ భవన్ పక్కన దిల్కుషా వద్ద సిద్ధం చేసిన ప్రోటోకాల్ అధికారులు ►ఆరు కొత్త ఇన్నోవా వెహికిల్స్ రెఢీ చేసిన అధికారులు తమిళసై చేతికి నెగ్గిన ఎమ్మెల్యేల జాబితా.. ►రాజ్ భవన్ నుంచి వెళ్లిపోయిన సీఈఓ వికాస్ రాజ్ బృందం ►గవర్నర్ తమిళ్ సై కి రిజల్ట్ ను సమర్పించిన సీఈఓ ►గెలిచిన ఎమ్మెల్యేల పేర్లతో కూడిన జాబితాను అందించిన సీఈవో కొత్త ప్రభుత్వానికి సచివాలయం సిద్ధం ►ఛాంబర్లను సిద్ధం చేస్తున్న జీఏడీ శాఖ ►పాత బోర్డులను తొలగించిన అధికారులు ►ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలు ఖాళీ చేసిన సిబ్బంది ►కొత్త మంత్రులకు కొత్త సిబ్బంది కేటాయింపు ►గ్రౌండ్ ఫ్లోర్లో మీడియాకు ప్రత్యేక గది తెలంగాణ టాస్క్ ఫోర్స్ OSD రాధా కిషన్ రావు రాజీనామా ►మూడేళ్ల క్రితం ముగిసిన రాధాకిషన్ పదవీ కాలం ►టాస్క్ ఫోర్స్ లో ఎక్స్ టెన్సన్ మీద కొనసాగుతున్న రాధా కిషన్ రావు ►ప్రస్తుత ప్రభుత్వం ఓడిపోవడంతో నిర్ణయం? ►తన రాజీనామా ను ప్రభుత్వానికి పంపిన రాధా కిషన్ రావు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు టెక్నికల్ క్లియరెన్స్ పనిలో గవర్నర్ ►గవర్నర్ తమిళిసైతో సీఈవో వికాస్ రాజ్ భేటీ ►గెలిచిన అభ్యర్థుల జాబితాను గవర్నర్ కి ఇచ్చిన వికాస్ రాజ్ ►రాజ్భవన్లోనే ఉన్న అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారి ►ప్రస్తుత అసెంబ్లీ రద్దుకు టెక్నికల్ ఫార్మాలిటీస్ పూర్తి ►ఈ రాత్రికి కొత్త సీఎం ప్రమాణానికి రాజ్భవన్ లో ఏర్పాట్లు దాదాపు పూర్తి పార్టీ మారను: పాడి కౌశిక్రెడ్డి ►హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను ►హుజూరాబాద్ ను గొప్పగా అభివృద్ధి చేసుకుందాం ►నా పాత ఫోటో పెట్టీ రేవంత్ రెడ్డి నీ కలిసినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు ►నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారితో కేసీఆర్ కుటుంబం తోనే ఉంట ►ఫేక్ ప్రచారాలను ఎవరు నమ్మొద్దు బీఆర్ఎస్ ఓటమిపై అసదుద్దీన్ ఒవైసీ ►రాజకీయాల్లో గెలుపోటములు సహజం ►ఓటమికి కారణాలు గుర్తించి బీఆర్ఎస్ సరి చేసుకుంటుంది ►కేటీఆర్, హరీష్రావులకు ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు అవకాశం దొరికింది. -
బీజేపీ ఓట్షేర్పై కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు !
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితాలు రాలేదని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల్లో పొరపాటు ఎక్కడ జరిగిందనేదానిపై జాతీయ నాయకత్వంతో సమీక్షించి లోపాలు సరిదిద్దుకుంటాం. సమీక్షించుకున్న తర్వాత రాబోయే లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతాం. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం బాగా పెరిగింది’ అని కిషన్రెడ్డి తెలిపారు. ‘ తెలంగాణలో కాంగ్రెస్ బొటాబొటీలో గెలిచింది. కాంగ్రెస్లో ఎవరు సీఎం అవుతారో తెలీదు అదో విచిత్రమైన పరిస్థితి. కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్రెడ్డిని ఓడించి మా అభ్యర్థి గెలిచారు. దేశ రాజకీయాల్లో ఇదో చరిత్ర. వెంకటరమణారెడ్డికి నా అభినందనలు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీ ఘన విజయంతో ప్రధాని మోదీకి దేశ ప్రజల్లో ఎంత విశ్వాసం ఉందో తెలుస్తోంది. కేంద్రంలో మోదీ నాయకత్వంలో మరోసారి అధికారంలోకి వస్తాం’ అని కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘మా మీద ఏడ్చి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు ఈరోజు ఫామ్ హౌస్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తాం. ప్రజల పక్షాన ఐదేళ్లు అనేక పోరాటాలు చేశాం. మా పోరాటం వల్ల కాంగ్రెస్కు లాభం జరిగింది. రానున్న రోజుల్లో మరింత కసిగా పనిచేస్తాం. ఢిల్లీ వెళ్లి ఇక్కడున్న పరిస్థితులు ఎన్నికల ఫలితాలపై అధిష్టానానికి వివరిస్తా’ అని కిషన్రెడ్డి తెలిపారు. ఇదీచదవండి..కేసీఆర్ కోసం ఫామ్హౌజ్కు ఎమ్మెల్యేలు -
‘కేసీఆర్ వెంటే.. కాంగ్రెస్లోకి వెళ్లను’
సాక్షి, భద్రాచలం: అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ నెగ్గిన ఏకైక నియోజకవర్గం భద్రాచలం. ఇక్కడ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి నెగ్గిన తెల్లం వెంకటరావు.. పార్టీ ఫిరాయించబోతున్నారనే ప్రచారం నడుస్తోంది. పొంగులేటి అనుచరుడిగా ముద్రపడి ఉన్న తెల్లం వెంకట్రావు పార్టీ మారి స్వామి భక్తి చాటుకునేందుకు అడుగులు వేస్తున్నాడనేది ఆ ప్రచార సారాంశం. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఫొటో కూడా వైరల్ అయ్యింది. అయితే ఈ విషయంపై ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు నేరుగా స్పందించారు. ‘కాంగ్రెస్లో జాయిన్ అవుతారని సోషల్ మీడియాలో వైరలైన ఫోటోను తాను పూర్తిగా ఖండిస్తున్నానని తెలిపారు. తనను నమ్మి బీఫామ్ ఇచ్చిన కేసీఆర్ గారికి రుణపడి ఉంటానని తెలిపారు. తన ప్రయాణం కేసీఆర్ గారితోనే ఉంటుంది’ అని తెల్లం స్పష్టం చేశారు. ఆదివారం వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించగా.. బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో గెలుపొందింది. ఫలితాలు వెలువడిన అనంతరం.. తెల్లం వెంకట్రావు పార్టీ మారి కాంగ్రెస్లోకి చేరిపోతున్నాడంటూ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, పొంగులేటిలతో ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో దుమారం లేపింది. అయితే ఈ ప్రచారం తారాస్థాయికి చేరడంతో.. తెల్లం స్వయంగా స్పందిస్తూ ఖండించారు. ఇదీ చదవండి: మాకు నచ్చలే.. అందుకే ఓటేయ్యలే! -
తెలంగాణభవన్: గెలిచిన ఎమ్మెల్యేలతో కేటీఆర్ కీలక భేటీ..
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీలో గెలిచిన నేతలు భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు. రంగంలోకి దిగిన కేటీఆర్.. గెలిచిన బీఆర్ఎస్ నేతలతో తెలంగాణభవన్లో సమావేశమయ్యారు. వివరాల ప్రకారం.. తెలంగాణభవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత, గెలిచిన అభ్యర్థులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, వివేకానందరెడ్డి, సహ పలువురు మాజీ మంత్రులు, ముఖ్యనాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా భవిష్యత్ కార్యాచరణపై నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ ఓటమి, తదితర కీలక అంశాలపై కేటీఆర్ చర్చించనున్నారు. -
టీడీపీ వెనక కాదట.. పక్కన నడుస్తున్నారట..!
కొంత కాలం క్రితం బహుశా 2019 ఎన్నికలు ముందు అనుకుంటా!జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ఆవేశపూరిత ప్రసంగం చేశారు. అందులో మనం ఎంతకాలం తెలుగుదేశంకు బానిసత్వం చేస్తామని గట్టిగా గొంతు చించుకుని ప్రశ్నించారు. కాపులను ఉద్దేశించి ఆయన ఆ మాటలు అన్నారు. అంతేకాదు.. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అప్పట్లో టీడీపీలో ఉండేవారు.ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతికి ద్రోహం చేస్తావా? అంటూ ప్రశ్నించారు.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతోంది. ✍️ఇప్పుడు ఈ వీడియో ఎందుకు బయటకు వచ్చిందా అని చూస్తే అసలు విషయం అర్ధం అయింది. పవన్ కళ్యాణ్్ తాజాగా మంగళగిరి కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఉపన్యసిస్తూ తెలుగుదేశం పార్టీని జనసేనవారు ఎవరైనా ఏమైనా అంటే తాను ఊరుకోనని హెచ్చరించారు. సోషల్ మీడియాలో టీడీపీ,జనసేన పొత్తుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే కార్యకర్తలను సహించబోనని అన్నారు. టీడీపీ వారిని నిందించడానికి వీలు లేదని అన్నారు. తాను టీడీపీ వెనుక నడవడం లేదని, పక్కన నడుస్తున్నానని చెప్పుకున్నారు. అంతేకాదు..ఆయన రాజకీయాన్ని, సిద్దాంతాన్ని బీజేపీ పెద్దలు కూడా అర్ధం చేసుకున్నారట. ✍️ఇలా ఏవేవో మాట్లాడడం వింటే ఎవరికైనా మతిపోవలసిందే! పవన్ కళ్యాణ్ తనను తాను మోసం చేసుకుంటున్నారా?లేక జనసేన కార్యకర్తలందరిని మోసం చేస్తున్నారా అన్న ప్రశ్న వస్తుంది. టీడీపీకి జనసేనవారు కాని, కాపులు కాని బానిసలు కాదని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సడన్ గా ఎందుకు అంతగా ఆ పార్టీకి లొంగిపోయారు? దానిని బానిసత్వం అని అనరా! తాను కాబట్టి పదేళ్ల నుంచి అధికారం లేకపోయినా పార్టీని నడుపుతున్నానని చెప్పారు. నిజమే. తాను,నాదెండ్ల మనోహర్ , మహా అయితే తన సోదరుడు నాగబాబులే పార్టీగా నడుపుతున్న ఘనత ఆయనదే. ఉండేది హైదరాబాద్లో. అప్పుడప్పుడు వచ్చి మాట్లాడేది మంగళగిరి పార్టీ ఆఫీస్లో. ఎప్పుడైనా అవసరాన్ని బట్టి , బహుశా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఏపీలో వారాహి వాహనం ఎక్కి ముఖ్యమంత్రి జగన్ ను, వైసిపి ప్రభుత్వాన్ని దూషించుకుంటూ తిరగడం తప్ప ఏమి చేశారు. ✍️పార్టీకి నిర్దిష్ట కమిటీలు ఉన్నాయా? గ్రామ స్థాయి నుంచి పార్టీని నెలకొల్పడానికి ప్రయత్నించారా? ఆ దిశలో ఎన్నడైనా ఆలోచించారా? ఏదో సినిమా యాక్టర్ కాబట్టి ,అమాయకపు అభిమానులు, తెలిసి తెలియని వయసులో ఉన్న వారు ఆయన సభలకు హాజరై, ఆయనేమి చెబుతున్నారో వినకుండానే చప్పట్లు, ఈలలు కొడుతుంటారు.అది చూసి ఇదంతా తన బలమే అనుకుని ఈయన మురిసిపోతుంటారు. అసలు ప్రపంచంలో మరో పార్టీపై ఆధారపడి , ఆ పార్టీవారు ఏమన్నా పడి ఉండండి అని సొంతపార్టీవారికి చెప్పే ఏకైక నేత పవన్ కళ్యాణ్ మాత్రమే కావచ్చు.ఈ మధ్య మాత్రం టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ తన పాదయాత్రలో పవన్ కళ్యాణ్ కు జిందాబాద్ కొడుతున్నారు. అది ఎందుకో అందరికి తెలుసు! పవన్ అభిమానులనండి.. ఆయన ముఖ్యమంత్రి అవుతారేమోనని ఆశపడే కాపులను మాయ చేయడానికే అన్న సంగతి ఎవరికైనా అర్ధం అవుతుంది. పవన్ నాయకత్వం వర్దిల్లాలి అని అంటున్న లోకేష్ మరి ఎందుకు ఆయన ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించడం లేదు? సరే పవన్ కళ్యాణే ఆ పదవిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ✍️తాను ఆ పదవికి అంత అర్హుడిని కానని ఒకసారి, పదవి ఇస్తే తీసుకుంటానని మరోసారి ...ఇలా ఏదో మాట్లాడుతూ పార్టీవారిని గందరగోళంలో పెడుతుంటారు. పవన్ కళ్యాణ్ ప్రజలలో కాకపోయినా, కనీసం తన పార్టీ కార్యకర్తల ప్రశ్నలు లేదా సందేహాలకైనా జవాబు ఇవ్వాలి కదా! తెలంగాణలో బీజేపీ తో పొత్తు పెట్టుకుని జనసేన పోటీచేస్తే అక్కడ ఎందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు ఇవ్వలేదు? అది జనసేనను అవమానించడానికి కాదా? కాపు సామాజికవర్గం నేతలు స్వయంగా కుకట్ పల్లిలో టీడీపీ వారికి ,కమ్మవారికి విజ్ఞప్తి చేసి జనసేనకు ఓటు వేయమని అడిగినా కూడా ఫలితం లేకపోయిందే!దాని గురించి ఒక్క ముక్క ఎందుకు పవన్ మాట్లాడడం లేదు.ఎన్నికల సమయంలో చంద్రబాబును కలిసినప్పుడు జనసేన తెలంగాణ అభ్యర్ధులకు మద్దతు ఇవ్వండని ఎందుకు అడగలేకపోయారు? అది సొంత పార్టీ అభ్యర్ధులకు వెన్నుపోటు పొడవడం కాదా? అలాంటివాటిని ప్రశ్నిస్తారనే కదా తెలంగాణ ఎన్నికల ఫలితాలకు ముందుగా మీటింగ్ తంతు నడిపి ఎవరూ మాట్లాడవద్దని హూంకరించింది? ఇదేనా మీ ప్రజాస్వామ్యం అని అడిగితే ఈయనేమి జవాబిస్తారు. ✍️రాష్ట్ర ప్రజల కోసమే తాను టీడీపీతో పొత్తు పెట్టుకున్నానని చెబుతున్న పవన్ కళ్యాణ్ 2019 కి ముందు టీడీపీ అంత అవినీతి పార్టీ లేదని ఎలా అన్నారు!బీజేపీని వదలివేసి బిఎస్పి ,సిపిఐ,సిపిఎం లతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? రెండు చోట్ల పోటీచేసి దారుణ పరాజయం చెందిన తర్వాత మళ్లీ బీజేపీ పెద్దలను బతిమలాడుకుని వారితో స్నేహం ఎందుకు చేయవలసి వచ్చింది?తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో పెట్టుకుంటారో,లేదో ఎందుకు చెప్పలేకపోతున్నారు?ఇలా అనేక ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా తప్పించుకోవడానికే పవన్ కళ్యాణ్ చివరికి తన సొంత పార్టీ కార్యకర్తలనే బెదిరించే స్థితికి చేరుకోవడం ఓ ట్రాజెడి. ఇందులోనే ఆయన బలహీనత కనిపిస్తుంది.కులం పునాదుల మీద పార్టీని నడుపుతూ , అదే కులం వారిని వేరే పార్టీకి లొంగిపనిచేయాలని అంటే ఆత్మగౌరవం ఉన్నవారెవరైనా దానిని సహించగలుగుతారా? తాను మాట ఇస్తే నిలబడతానని ఉపన్యాసాలలో చెబుతూ, ఆచరణలో పూర్తి విరుద్దంగా ఎన్ని మాటలు మార్చుతుంది వీడియో సహితంగా కనిపిస్తున్న సాక్ష్యాల గురించి ఏమి వివరణ ఇస్తారు?వీటన్నిటికన్నా పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఒక్క మాట చెబితే బాగుండేది. ✍️ఈసారి కూడా తాను అసెంబ్లీకి ఒంటరిగా గెలవలేనని, అందుకే తన భవిష్యత్తు కోసం టీడీపీతో కలుస్తున్నానని చెప్పుకుని ఉంటే కొంతమందైనా హర్షించేవారు. అలాకాకుండా పైకి ఒకటి,లోపల మరొకటి పెట్టుకుని దానికి సిద్దాంతం ,విధానం వంటి డైలాగులు చెబితే వినడానికి ప్రజలు కాదు కదా.. జనసేన కార్యకర్తలు కూడా సిద్దంగా ఉండరని తెలుసుకోవాలి! -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
నేటి సాయంత్రం సీఎం ప్రమాణం.. రాజ్భవన్లో ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాట్లుకు రంగం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం తెలంగాణ రాజ్భవన్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాణ స్వీకరానికి కావాల్సిన సామ్రాగ్రిని కూడా తరలిస్తున్నారు. వివరాల ప్రకారం.. రాజ్భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి జీఏడీ ఏర్పాటు చేస్తోంది. రాజ్భవన్కు సామాగ్రి చేరుకుంటోంది. టెంట్లు, స్టాండ్స్, టేబుల్స్, కుర్చీలు, రెడ్ కార్పెట్లు, ఫర్నిచర్ ఇప్పటికే చేరుకుంది. రాజ్ భవన్కు చేరుకున్న లైవ్ కవరేజ్ ఐ అండ్ పీఆర్ మీడియా. గవర్నర్ తమిళిసై ఏ క్షణంలోనైనా ఆదేశం ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు సీఈవో వికాస్రాజ్ రాజ్భవన్కు వెళ్లనున్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల లిస్ట్ను గవర్నర్కు వికాస్రాజ్ అందజేయనున్నారు. ఇక, నివేదిక అందాక కొత్త శాసనసభ ఏర్పాటుకు గవర్నర్ గెజట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత పొలిటికల్ అపాయింట్మెంట్స్ అని రాజ్భవన్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా, ఎల్లా హోటల్లో సీఎల్పీ సమావేశం జరిగింది. సీఎల్పీ సమావేశానికి 64 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక, సీఎల్పీ సమావేశానికి ఏఐసీసీ ప్రతినిధులు, డీకే శివకుమార్ హాజరు. సీఎల్పీలో ఏకవాక్య తీర్మానం చేసే అవకాశం ఉంది. ఈ సమావేశంలోనే సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. -
తెలంగాణ సీఎం ఎవరు?.. వెయిటింగ్!
Live Updates ఏఐసీసీ నిర్ణయం కోసం వెయిటింగ్ ►సీఎల్పీ భేటీ అనంతరం.. ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ చేపట్టిన డీకే శివకుమార్ ►ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా మాట్లాడిన డీకేఎస్ ►ముగిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ ►ఎమ్మెల్యేల అభిప్రాయలను ఏఐసీసీకి పంపిన డీకేఎస్ ►ఢిల్లీ నుంచి సీఎల్పీ నేత ఎంపిక సమాచారం కోసం వెయిటింగ్ ►కాంగ్రెస్ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ ముగిసిన సీఎల్పీ సమావేశం.. ►మరో రెండు గంటల్లో సీఎల్పీ నేతను ఎన్నుకునే అవకాశం ►తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎల్పీ తీర్మానం. ఎన్నికల ప్రచారానికి వచ్చిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ మరో తీర్మానం. ►సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల వ్యక్తిగత అభిప్రాయాలు కూడా తీసుకుంటామన్న డీకే శివకుమార్. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరితో మాట్లాడుతున్న డీకే, దీపాదాస్ మున్షి. ►సీఎల్పీ సమావేశం అనంతరం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. సీఎల్పీ నేత ఎంపికను అధిష్టానానికి అప్పగించారు. సీఎల్పీ తీర్మానాన్ని రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సీఎల్పీ నిర్మానాన్ని భట్టి విక్రమార్క, తుమ్మల బలపరిచారు. తీర్మానాన్ని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తున్నాం. అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారు. ►హోటల్ ఎల్లాలో సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం ఎంపికపై పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నారు. సీఎం ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాఖ్య తీర్మానం చేశారు. ►ఏకవాఖ్య తీర్మానం ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి.. తీర్మానాన్ని బలపరిచిన తుమ్మల నాగేశ్వర రావు ►సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్లో గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు హాజరు. #WATCH | Telangana: Congress Legislature Party (CLP) meeting begins in Hyderabad. Karnataka Deputy CM DK Shivakumar, State Congress chief Revanth Reddy and other Congress MLAs are present in the meeting. pic.twitter.com/xsQ2AayKQW — ANI (@ANI) December 4, 2023 ►కాంగ్రెస్ సీఎల్పీ నేతల సమావేశం ప్రారంభమైంది. నగరంలోని హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ఎంపిక, మంత్రులు ఎవరు? అనే అంశంపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ►సీఎం పదవి కోసం ముగ్గురు సీనియర్ నేతల లాబీయింగ్. ►ఢిల్లీ పెద్దలతో భట్టి విక్రమార్క్ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఏకాభిప్రాయం కుదుర్చుకునేందకు అధిష్టానం ప్రయత్నాలు. ►సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుంది. నా గెలుపు ములుగు ప్రజల విజయం, న్యాయం గెలిచింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తాను. ►మల్లు రవి మాట్లాడుతూ.. ప్రజా పాలన కోసమే కాంగ్రెస్ను ప్రజలు ఎన్నుకున్నారు. అధిష్టానం నిర్ణయమే మాకు శిరోధార్యం. బీఆర్ఎస్ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. కేబినెట్లో ఎవరు? ►వివేక్ వెంకటస్వామి, ప్రేమ్సాగర్ రావు, వెడ్మ బోజ్జు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, ఆది శ్రీనివాస్, రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, సీతక్క, కొండా సురేఖ, భట్టి విక్రమార్క్, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్, కూనంనేని సాంబశివరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా పద్మావతి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, దామోదర రాజనర్సింహ, సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మల్రెడ్డి రంగారెడ్డి, గడ్డం ప్రసాద్, రామ్ మోహన్ రెడ్డి. సీఎం ఎంపిక అధిష్టానం నిర్ణయం: భట్టి విక్రమార్క ►అంతకుముందు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం. సీఎల్పీ సమావేశంలో అందరి నిర్ణయం తీసుకుని పార్టీ అధిష్టానం సీఎంను ఎంపిక చేస్తుంది. నేను సీఎల్పీ నేతగా ఉన్నాను. పార్టీ అధికారంలోకి రావడం కోసం పాదయాత్ర చేశాను. ఉచిత కరెంట్ అనగానే దేశంలో గుర్తుకు వచ్చేది వైఎస్సార్. ఎన్నికల ముందే చెప్పారు ఉచిత కరెంట్ ఇస్తానని.. చెప్పడమే కాదు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టారు. అది చేసి చూపించిన పేటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ అంటే కరెంట్.. కరెంట్ అంటే కాంగ్రెస్. కరెంట్ను ముట్టుకుంటే ఎలా మాడిపోతారో ఇప్పుడు ఫలితాలు చూశారు కదా. 70 స్థానాల్లో గెలవబోతున్నామని ముందే చెప్పాను. గెలిచి చూపించాం. మా అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ చూస్తే తెలుస్తుంది. ఎంత బలంగా జనం ప్రజా ప్రభుత్వం తెచ్చుకోవాలని సిద్ధమయ్యారో. ప్రజాస్వామితంగా పాలన ఉండాలని కోరుకున్నారు. దొరల తెలంగాణ కాదు.. ప్రజల తెలంగాణ గెలవాలని కోరుకున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఆదిలాబాద్ అడవుల్లో ఎవరూ తిరగని ప్రాంతాల్లోకి వెళ్లాను.. అక్కడే పడుకున్నాను. సింగరేణి ప్రాంతాల్లో కూడా తిరిగాను. మా పార్టీ అధికారంలోకి రాగానే ఏమీ చేస్తామన్నది క్లారిటీ ఇచ్చాం. ►పార్క్ హయత్లో డీకే శివకుమార్తో ఉత్తమ్, భట్టి, రాజగోపాల్ రెడ్డి భేటీ. సీఎల్పీ సమావేశం కంటే ముందే నేతల సమావేశంతో ఉత్కంఠ. ఈ సమావేశం తర్వాత హెటల్ ఎల్లాకు బయలుదేరనున్న నేతలు ►ఈ భేటీలో సీఎం ఎంపికపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. ►మరోవైపు.. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను రాజ్భవన్కు తీసుకువెళ్లేందుకు హెటల్ ఎల్లా వద్ద టీపీసీసీ బస్సులను సిద్ధం చేసింది. భేటీ తర్వాత అధిష్టానం పరిధిలోకి.. ►పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించాక సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పు అంశం అధిష్టానం పెద్దల చేతికి వెళ్లనుంది. డీకే బృందం ఎమ్మెల్యేలతో భేటీ పూర్తికాగానే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్గాందీలతో సమాలోచనలు జరిపి సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తర్వాత సీఎం రేసులో ఉన్న ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించి, ఏకాభిప్రాయం సాధించే అవకాశం ఉందని తెలిసింది. తర్వాత మరోమారు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి లాంఛనంగా సీఎల్పీ నాయకుడి ఎంపికను పూర్తి చేయనున్నారు. ఈ నెల 9వ తేదీకల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసి ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనే ప్రమాణ స్వీకారం? ►ఎక్కువ రోజులు పొడిగించకుండా సోమవారం లేదా మంగళవారమే సీఎంతోపాటు ఒకరిద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం సీఎల్పీ భేటీ తర్వాత డీకే శివకుమార్, ఇతర పెద్దలు ఇక్కడి నుంచే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి, నేరుగా గవర్నర్ను కలసి రాజ్భవన్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఈనెల 9 నాటికి మంత్రివర్గాన్ని కూర్చి పరేడ్ గ్రౌండ్స్లో భారీ సభలో మంత్రుల ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘హ్యాట్రిక్’ హీరో కేపీ వివేకానంద్
ఎమ్మెల్యేగా వివేకానంద్ ముచ్చటగా మూడోసారి ఎన్నికలో ‘హ్యాట్రిక్’ సాధించారు. గతంలో మేడ్చల్లో అంతర్భాగంగా ఉన్న కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థగా కూన శ్రీశైలంగౌడ్ గెలుపొందారు. తర్వాత 2014, 2018, 2023 వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వివేకానంద ఘన విజయం సాధిస్తూ వచ్చారు. గడచిన ఎన్నికల్లో 41,500 మెజార్టీ రాగా తాజాగా ఏకంగా 85,576 మెజారీ్టతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా భారీ మెజారీ్టతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీ బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వివేకానంద్ తనదైన శైలిలో పాదయాత్రల ద్వారా, స్థానికంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆయనకు ఘనవిజయం చేకూర్చి పెట్టారు. కుత్బుల్లాపూర్: ఎమ్మెల్యే వివేకానంద్ ఘనవిజయం సాధించడంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.. గత నెల రోజులుగా విస్తృత ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు కలిసి సూరారం కట్ట మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా చింతల్ పార్టీ కార్యాలయానికి వచ్చి ఈ విజయం కుత్బుల్లాపూర్ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివేకానంద ప్రకటించారు. హ్యాట్రిక్ ఇచి్చన ప్రజలకు రుణపడి ఉంటా.. తనపై నమ్మకంతో హ్యాట్రిక్ విజయం చేకూర్చిన ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. సుమారు రూ.6వేల కోట్ల నిధులతో కుత్బుల్లాపూర్ రూపురేఖలు మార్చానన్నారు. తద్వారా ప్రజల్లో ఉంటూ ముందుకు సాగానన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని అభివృద్ధి మౌలిక వసతులు కలి్పంచడం మూలంగానే నన్ను ఆదరించి గెలిపించారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచి్చన తనకు మీ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కోరారు. రికార్డు విజయంతో ఆనందోత్సవాలు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఎన్నికైన వివేకానంద్ రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 85,576 మెజార్టీ ఓట్లు కార్యకర్తల్లో జోష్ పెంచింది. ఆది నుండి ఎమ్మెల్యేకు వెన్నంటి ఉండేవారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక టీమ్ స్పిరిట్తో ముందుకు సాగుతూ తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న ఎమ్మెల్యే వివేకానంద్కు రెండు సంవత్సరాలుగా పార్టీ కార్పొరేటర్లు దూరం ఉన్నప్పటికీ చివరికి మంత్రి కేటీఆర్ చొరవతో ఎట్టకేలకు ఎన్నికల్లో ఎమ్మెల్యేతో కలిసి ప్రచారం చేశారు. అంతకుముందే తనకంటూ ఒక వర్గాన్ని ద్వితీయ శ్రేణి నాయకులను ఎంపిక చేసుకొని డివిజన్ల వారీగా పక్క ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగడంతో ఈ భారీ విజయం చేకూరిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఇద్దరూ హ్యాట్రిక్ వీరులే.. కుత్బుల్లాపూర్: ఆదివారం వెలువడిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో కుత్బుల్లాపూర్ నుంచి వివేకానంద్, కూకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావులు ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేలుగా హ్యాట్రిక్ విజయం సాధించారు. దీంతో ఫలితం వెలువడిన వెంటనే ఇరువురు ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి గెలుపొందిన ఆనందాన్ని పంచుకున్నారు. ఇరువురు గతంలో టీడీపీ నుంచి గెలిచి అనంతరం బీఆర్ఎస్లో చేరారు. ఒకటి నుంచి 22వ రౌండ్ వరకు వివేకానంద్ ఆధిపత్యం కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో కేపీ వివేకానందగౌడ్ (బీఆర్ఎస్)కు 1,87, 999 ఓట్లు, కూన శ్రీశైలంగౌడ్(బీజేపీ)కు 1,02,423 ఓట్లు, కొలన్ హన్మంత్రెడ్డి (కాంగ్రెస్)కు 1,01,554 ఓట్లు రాగా 85,576 ఆదిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానందగౌడ్ సమీప బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్పై ఘన విజయం సాధించారు. ఒకటో రౌండ్ నుంచి 22 రౌండ్ వరకు ఎక్కడా తగ్గకుండా ప్రతి రౌండ్లో ఆధిక్యత కనబరిచి వివేకానంద పట్టు నిలుపుకుని హ్యాట్రిక్ నమోదు చేసుకున్నారు. అయితే 20 రౌండు వరకు రెండో స్థానంలో కొనసాగిన కాంగ్రెస్ అభ్యర్థి హన్మంత్రెడ్డి చివరి రెండు రౌండ్లలో వెనక్కి తగ్గడంతో అనూహ్యంగా రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ వచ్చారు. ఫలితం ప్రకటించే సమయానికి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.