breaking news
-
కాళేశ్వరానికి బాస్ కేసీఆరే.. గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా: ఈటల
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ తన విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఆ నివేదికతో అసలు దోషులెవరో బయటపెట్టాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు.‘‘తెలంగాణ సాధించుకుంది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా విలువలతో ఉన్నాను. తెలంగాణలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పని చేశా. రీ డిజైన్ కోసం కేసీఆర్ వేసిన సబ్ కమిటీలో మేం ఉన్నాం. 2016లో తుమ్మడిహట్టి అంచనా రూ.16,500 కోట్లు. ఆ తర్వాత 2015లో ఆ అంచనా రూ.38 వేల కోట్లకు పెరిగింది....తుమ్మడిహట్టిపై మహారాష్ట్ర అభ్యంతరం తెలిపింది. తుమ్మడిహట్టితో నీటి అవసరాలు తీరవని రిపోర్టులు వచ్చాయి. మూడు బ్యారేజి CWC రిపోర్ట్, టెక్నికల్ కమిటీ ఆధ్వర్యంలో బ్యారేజీలు కట్టారు. సబ్ కమిటీ, టెక్నికల్ కమిటీ రిపోర్టు ఆధారంగా కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి రూ.63వేల కోట్ల అంచనాతో ప్రారంభం అయ్యింది. అయితే..రైతుల డిమాండ్ మేరకు రూ. 82వేల కోట్లకు పోయింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం పెట్టారని నన్ను అడిగారు. కాళేశ్వరం కార్పొరేషన్కి ఫైనాన్స్ శాఖకు సంబంధం లేదని చెప్పాను... మా బతుకు నిబద్ధతో ఉంది. నేనేమీ చేయలేదు. నాకేమీ తెలియదు. అంతా వాళ్లే చేశారు. కేసీఆర్, హరీష్ రావు ఆ ఇద్దరి దగ్గరే సమాచారం అంతా ఉంది. ఏం జరిగినా ఇరిగేషన్ శాఖకే సంబంధం ఉంటుంది. ఫైనాన్స్ శాఖకు అన్ని వివరాలు తెలియవు. ప్రాజెక్ట్ రీ డిజైన్ కోసం కేసీఆర్ సబ్ కమిటీ వేశారు. అందులో మేం(హరీష్, తుమ్మల పేర్లు) ఉన్నాం. నా గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా. ఎవరు పిలిచినా ఎక్కడైనా నిజాలే చెప్తా. కొందరు బట్టకాల్చి మీదేసినంత మాత్రాన నాకేమీ కాదు.మూడు బ్యారేజీల వ్యయం రూ. 10వేల కోట్ల లూపే ఉండొచ్చు. ప్రభుత్వం విచారణ కమిషన్ రిపోర్టులను బయటపెట్టాలి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను త్వరగా బయటపెట్టాలి. నిజమైన దోషులు ఎవరో ప్రభుత్వం బయటపెట్టాలి. ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వానిది. ఆ నిర్ణయం తీసుకుంది కేసీఆర్...ఆయనే బాస్. కొన్ని వందలసార్లు తన మానస పుత్రిక అని చెప్పారు ’’ అని ఈటల మీడియా చిట్చాట్లో అన్నారు.ఇదీ చదవండి: 40 నిమిషాలు.. ఈటలకు 19 ప్రశ్నలు -
లుకలుకలు.. కుమ్ములాటలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు. ఒకటి అధికార కాంగ్రెస్, రెండోది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, మూడవది జాతీయ పార్టీ బీజేపీ. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతుంటాయి. ప్రజల దృష్టిని తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయతి్నస్తుంటాయి. కానీ ప్రస్తుతం.. ఈ మూడు ప్రధాన రాజకీయ పక్షాలూ వేటికవే తమతమ పార్టీల్లో అసమ్మతి స్వరాలు, అసంతృప్తి జ్వాలలు, అంతర్గత కుమ్ములాటలు, విభేదాలతో సతమతమవుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీలో లుకలుకలు స్పష్టంగా కని్పస్తున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి సహజమే అయినా క్రమశిక్షణకు మారుపేరని భావించే బీజేపీ, ఏకఛత్రాధిపత్యం కింద నడిచే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్లో కూడా రాజకీయ రచ్చ కొనసాగుతుండటం గమనార్హం. అయితే గ్రూపులు, గొడవలకు పుట్టినిల్లు లాంటి కాంగ్రెస్ పార్టీలో రహస్య కొట్లాటలు జరుగుతుంటే, బీజేపీ, బీఆర్ఎస్లలో మాత్రం విభేదాలు బహిరంగమవుతుండటం మరో విశేషం. కాంగ్రెస్లో పదవులు, ప్రాధాన్యం రభస రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ఏడాదిన్నరలోనే ప్రభుత్వ పాలన, ప్రభుత్వ.. పార్టీ పదవులు, ప్రాధాన్యత, మంత్రివర్గ విస్తరణ, మంత్రుల వ్యవహారశైలి తదితర అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. అంతర్గత విభేదాలకు, ఫిర్యాదులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ అంశం ఏడాదిన్నర తర్వాత కూడా కొలిక్కి రావడం లేదు. ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా, హైదరాబాద్లో చర్చలు జరిగినా తేలడం లేదు. అదిగో విస్తరణ...ఇదిగో విస్తరణ అంటూ ఎప్పటికప్పుడు దాటవేతతో విసుగు వచ్చిన ఇద్దరు ఆశావహ ఎమ్మెల్యేలు.. కేబినెట్లో బెర్తు కేటాయించకపోతే తమ దారి తాము చూసుకుంటామని సన్నిహితుల వద్ద నిరసన గళం విని్పంచినట్టుగా బయటకు రావడం పార్టీలో కలకలం రేపింది. మరోవైపు పదవుల లొల్లి కూడా ఆ పార్టీని కుదిపేస్తోంది. చాలా కాలం తర్వాత నియమించిన కమిటీల్లో కొంత సామాజిక న్యాయ కోణం కనిపించినా సీనియర్లు, జూనియర్లు అనే విభేదాలు మరింత పెరిగాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూనియర్లకు, ప్యారాచూట్ల (బయటి పార్టీల నుంచి వచ్చిన వారికి)కు కమిటీల్లో ప్రాధాన్యతనిచ్చారనే అసంతృప్తి వ్యక్తమవుతుండటం గమనార్హం. ఇంకోవైపు మహిళా కాంగ్రెస్ నేతలు గాం«దీభవన్లోని టీపీసీసీ అధ్యక్షుడి చాంబర్ ముందు తమకు ప్రాధాన్యత లభించడం లేదంటూ ధర్నాకు దిగడం కూడా చర్చనీయాంశమైంది. అయితే, టీ కప్పులో తుపాను మాదిరి ఆ వివాదం ముగిసినా, పార్టీలో ప్రాధాన్యత అంశం అంతర్గతంగా అగ్గిని రాజేస్తూనే ఉంది. మంత్రులపై ఫిర్యాదులు..పాలనపై విమర్శలు సీఎంకు, మంత్రులకు మధ్య సఖ్యత లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా, కొందరు మంత్రుల పనితీరుపై ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేసేంతవరకు పరిస్థితి వెళ్లిపోయింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కూడా పార్టీలో తీవ్రంగానే చర్చ జరుగుతోంది. ఎంత చేసినా ప్రజల మన్ననలు రావడం లేదని పార్టీ నేతలు చెబుతుంటే, తాము చేసినవన్నీ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదనే అభిప్రాయంతో ప్రభుత్వ పెద్దలున్నారు. ఈ క్రమంలో వీలున్నంత త్వరగా మంత్రివర్గ విస్తరణ జరగాల్సిందేనని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి పట్టు నిరూపించుకోకపోతే పార్టీ గ్రాఫ్ డౌన్ కావడం ప్రారంభమవుతుందని కాంగ్రెస్ నేతలే బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. గులాబీకి ‘కుటుంబ ముళ్ల’ పోటు బీఆర్ఎస్లో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీలో ఆమె ఇప్పుడు రె‘బెల్స్’ మోగిస్తున్నారు. తండ్రి కేసీఆర్ను విమర్శించకుండా వ్యూహాత్మక వ్యాఖ్యలు చేస్తూ, ప్రశ్నలు వేస్తూ గులాబీ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి వరంగల్లో పార్టీ రజతోత్సవ సభకు ముందు అంతర్గత చర్చలకే పరిమితమైన ఆమె, ఆ తర్వాత గేర్ మార్చారు. సభ నిర్వహణ గురించి కేసీఆర్కు స్వదస్తూరితో రాసిన లేఖ బీఆర్ఎస్లో అశాంతిని బహిర్గతం చేసింది. ఆ లేఖ లీక్ కావడం, ఆ లీకేజీ వెనుక ఎవరున్నారన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతుండడం అటు బీఆర్ఎస్నే కాదు, ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాలను కూడా కుదిపేశాయి. కేసీఆర్ దేవుడని, అయితే ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అమెరికా నుంచి వచ్చిన వెంటనే శంషాబాద్ విమానాశ్రయంలోనే ఆమె పేల్చిన బాంబు మంటలు ఇంకా చల్లారలేదు. ఆ తర్వాత ఆమె స్పీడ్ మరింత పెంచారు. ఇష్టాగోష్టిలో బాంబు పేల్చిన కవిత మీడియాతో ఇష్టాగోష్టి పేరుతో కవిత మరో రాజకీయ ఆటం బాంబు పేల్చారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీఆర్ఎస్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని, దాన్ని అడ్డుకుంటున్నందుకే తనను బయటకు పంపాలని చూస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు అధినేత కేసీఆర్ను సైతం ఇరకాటంలో పడేశాయి. అంతటితో ఆగని కవిత తెలంగాణ జాగృతి పేరుతో బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్తో సమాంతరంగా జాగృతిని తీసుకెళ్తానని చెప్పకనే చెపుతున్న ఆమె, పరోక్షంగా పార్టీని సవాల్ చేస్తూ ధర్నాకు దిగుతున్నారు. కేసీఆర్కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా చేపడుతున్న ధర్నాతో.. బీఆర్ఎస్ చేయలేని పనిని తాను చేస్తున్నానని పార్టీ కేడర్కు సంకేతాలిచ్చే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఈ కుటుంబ పంచాయతీ కేడర్ను అయోమయానికి గురి చేస్తోంది. ఇలావుండగా.. ఎప్పుడూ లేని విధంగా ఇటీవల హరీశ్రావు ఇంటికి కేటీఆర్ వెళ్లడం కూడా అటు బీఆర్ఎస్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీస్తోంది. ఇంత జరుగుతున్నా.. కేటీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించే రీతిలో కవిత అస్త్రాలు సంధిస్తున్నా కేసీఆర్ మాత్రం మౌన ముద్రలోనే ఉండడం గమనార్హం. కమలం.. కలహాల కాపురం సాధారణంగా బీజేపీలో అంతర్గత విభేదాలు బహిర్గతం కావు. ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ భావజాలంతో నడిచే ఆ పార్టీలో ఎంతటి వివాదాలు, భిన్నాభిప్రాయాలైనా లోలోపలే పరిష్కరించుకుంటారు. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రూపులుగా విడిపోయి వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని, ఎంపీల్లోని ఏ ఇద్దరూ ఒక్కచోట కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేదని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో పెద్ద రచ్చే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతగా అంటే అసలు ఏ నాయకుడిని ఎంపిక చేయాలో పార్టీ అధిష్టానానికి కూడా అంతుపట్టనంతగా ఈ పదవి కోసం నేతలు పోట్లాడుకుంటున్నట్టు బీజేపీలో జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత కూడా కిషన్రెడ్డినే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారంటే ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపిక వ్యవహారంలోనూ బహిరంగ విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజాసింగ్ టార్గెట్ ఎవరో? రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా, ఫైర్బ్రాండ్గా గుర్తింపు పొందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రచ్చ రచ్చ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి, ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి వచ్చి కమలం గుర్తుపైనే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే, ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజాసింగ్ స్టైల్ మార్చారు. ఎప్పటిలాగా ఎంఐఎంను కాకుండా ఈసారి సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. ‘మా పార్టీ నేతలకు ప్యాకేజీలు ఇస్తే ఏ పార్టీనయినా విలీనం చేసుకుంటారు..’ అంటూ ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఆయన్ను మరోమారు సస్పెండ్ చేస్తారనేంత వరకు ఈ వ్యవహారం వెళ్లింది. అయితే ఆ అంశంపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. తనను సస్పెండ్ చేస్తే ఒక్కొక్కరి జాతకాలు బయట పెడతానంటూ హెచ్చరించడం పార్టీ నేతలను ఇరకాటంలో పెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన అసలు రాష్ట్ర పార్టీలో ఎవరిని టార్గెట్ చేశారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్ర శాఖ అధ్యక్షుడి ఎంపిక, పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో.. అధిష్టానం పట్టీపట్టనట్టుగా ఉండటం, ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం పార్టీ వర్గాల్లో హాట్టాపిక్ అవుతోంది. ఈ విధంగా.. ఎన్నికలకు మూడేళ్లకు పైగా సమయం ఉన్నప్పుడే ఈ మూడు ప్రధాన పార్టీల్లో జరుగుతున్న లొల్లి, అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎంత తీవ్రంగా మారుతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. -
గాంధీ భవన్కు భద్రత పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్కు భద్రతను పెంచారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ చర్యలకు దిగినట్లు.. అందుకు కేబినెట్ విస్తరణే కారణమన్నట్లు సమాచారం. ఆశించిన వారు పదవి దక్కకపోతే తమ వర్గీయులతో ఆందోళనకు దిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. -
ఎవరితోనూ పొత్తు ఉండదు
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది అన్నట్లుగా ఎవరో మాట్లాడుతున్నారు. ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు. సొంతంగానే మనుగడ సాగిస్తూ.. ఒంటరిగానే పోటీ చేసి మళ్లీ అధికారంలోకి వస్తుంది. వంద అసెంబ్లీ సీట్లతో గులాబీ జెండా ఎగురుతుంది’అని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొ న్న అనంతరం జరిగిన సమావేశంలో హరీశ్రావు ప్రసంగించారు. ‘బీజేపీకి తెలంగాణ మీద మాట్లాడే హక్కు లేదు.పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో పాటు బనకచర్ల లింకు అక్రమ ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్నది. బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు శాపం కాబోతున్నా కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడటం లేదు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. బనకచర్ల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకపోతే సుప్రీం కోర్టుకు వెళ్లి నిలుపుదల చేస్తాం. కృష్ణా నదిలో నీళ్లు ఆపకుండా, గురువు చంద్రబాబుకు దాసోహం అయిన సీఎం ఇప్పుడు గోదావరి నీళ్ల విషయంలోనూ అదే చేస్తున్నారు. బనకచర్లపై అసెంబ్లీలో చర్చ పెట్టినా, ఢిల్లీలో ధర్నా చేసినా కలసి వచ్చేందుకు సిద్ధం, బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి ఏదైనా చేస్తాం’అని హరీశ్ అన్నారు. ఆ ఫుటేజీ బయట పెట్టాలి..‘సీఎంకు దగ్గరగా ఉండే ఒక ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్, ఐఏఎస్ అధికారి.. మిస్ ఇంగ్లండ్ పట్ల అనుచితంగా వ్యవహరించారనే వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ బయట పెట్టి, వారిపై కేసులు నమోదు చేయాలి. తెలంగాణను కేసీఆర్ ప్రపంచ పటంలో నిలబెడితే, రేవంత్ తెలంగాణకు తలవంపులు తెచ్చారు’అని హరీశ్ ధ్వజమెత్తారు. రేవంత్ పాలనలో ఆదాయం నేలచూపులు..‘రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని దిక్కుమాలిన ప్రచారం చేసే వాళ్లు దివానా గాళ్లు. ఆరు గ్యారంటీల పేరిట హామీలు ఇచ్చి, తాను తీసుకున్న గోతిలో రేవంత్ తానే పడిపోయారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆదాయం ఆకాశం వైపు చూస్తే, రేవంత్ పాలనలో నేల వైపు చూస్తున్నది. ఎన్నడూ జై తెలంగాణ అనని రేవంత్రెడ్డి.. తెలంగాణ ద్రోహి. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్కు లేదు’అని హరీశ్ విమర్శించారు.దుర్మార్గుల చేతుల్లోకి తెలంగాణరాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేసి గందర గోళానికి గురి చేసే ప్రయత్నాలు జరుగుతున్నా యన్నారు. తెలంగాణ రాష్ట్రం దుర్మార్గుల చేతుల్లోకి వెళ్లిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మ బలిదానాలు కలిచివేశాయని, ఓ దశలో మంత్రి పదవికి రాజీనామా చేయాలి అనుకున్నట్లు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తదితరులు ప్రసంగించారు. మధుసూదనాచారి, హరీశ్రావు తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అలాగే జయశంకర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. తర్వాత జాతీయ పతాకాన్ని మధుసూదనాచారి ఆవిష్కరించారు. -
నోటీస్ కాదు.. నన్ను సస్పెండ్ చేయండి: ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్: ఇటీవల కాలంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పెదవి విరుస్తూ వస్తున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి తన అసంతృప్తి వెళ్లగక్కారు. ప్రధానంగా నిన్న(ఆదివారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్ షాపుకు రాజాసింగ్ దూరంగా ఉన్నారు. పలువురు నేతలు ఈ వర్క్ షాపుకు దూరం కాగా, అందులో రాజాసింగ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్కు పార్టీ అధిష్టానం నోటీసులు ఇవ్వబోతుందనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రధానంగా దీనిపై స్పందించిన రాజాసింగ్.. ‘ మీడియాలో ఒక వార్త నడుస్తుంది, రాజాసింగ్కు నోటీస్ ఇవ్వడానికి పార్టీ ప్లాన్ చేస్తోందనే చర్చ తెరపైకి వచ్చింది. ఒకవేళ అదే నిజమైతే నోటీస్ కాదు.. ఏకంగా నన్ను సస్పెండ్ చేయండి’ అంటూ రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. అదే సమయంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు రాజాసింగ్. ఒకవేళ నన్ను సస్పెండ్ చేస్తే అప్పుడు అందరి జాతకం బయటపెడతా. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగింది అనే నిజం చెప్పి అందరి జాతకం ప్రజలు ముందు పెడతా’ అని రాజాసింగ్ పేర్కొన్నారు.ఇదిలా ఉంచితే, గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ గుర్రుగా ఉన్నారు. పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తన్నారు. కొన్ని రోజుల క్రితం ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్.. రాజాసింగ్ వద్దకు వెళ్లి రాజీ చేసే యత్నం చేశారు. పార్టీ అభివృద్ధి కలిసి నడవాలని రాజాసింగ్కు సూచించారు. ఆ సమయంలో బండి సంజయ్తో జరిగిన సఫలం అయినట్లు కనిపించినా తాజా ఎపిసోడ్తో రాజాసింగ్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు ఆయన తాజా వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కిషన్రెడ్డితో సఖ్యత లేదా?.. బీజేపీలో ఏం జరుగుతుంది?‘టైమ్ పాస్ మీటింగ్లతో అలసిపోయాం’ -
‘తెలంగాణలో కన్ఫ్యూజ్ పొలిటీషియన్ ఆయనే’
హైదరాబాద్: తెలంగాణలో కన్ఫ్యూజ్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది ఈటెల రాజేందరేనని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమర్రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ను వదిలి పెట్టిన అంటున్న ఆయన.. 24 గంటలు బీఆర్ఎస్ గురించే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్న విషయం ఆ పార్టీ నాయకులే గుర్తించట్లేదని ఎద్దేవా చేశారు. ‘ లెఫ్ట్ వింగ్ లో ఉన్న ఈటెల రాజేందర్ పార్టీ అధ్యక్ష పదవికోసం రైట్ వింగ్ లోకి పోయాడు.. ఏ పదవి రావట్లేదని మా నాయకులపై ప్రస్టేషన్తో ఈటెల రాజేందర్ మాట్లాడొద్దు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టే ఇవాళ ఆవిర్భావ సభలు జరుగుతున్నాయి..రేవంత్ రెడ్డి సన్నిహిత ఎంపీ ,కార్పొరేషన్ చైర్మన్ లు నన్ను ఇబ్బంది పెట్టారని ఇంగ్లాండ్ మిస్ మ్యాగీ అంటుంది అని హరీష్ రావు అంటుంన్నాడు..మీ దగ్గర వీడియో ఫుటేజ్ ఉంటే బయట పెట్టండి. ప్రభుత్వాన్ని బదనం చేయడానికి మిస్ ఇంగ్లాండ్ మ్యాగీతో అలా మాట్లాడించారేమో బీఆర్ఎస్ వాళ్లు. నిన్న కౌంటర్గా కేసులు కూడా పెట్టారు. నిన్న కౌంటర్ గా కేసులు కూడా పెట్టారు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని పదేండ్లు అనుభవించారు..అధికారుల లిస్ట్ రెడ్ బుక్లో నమోదు చేస్తా అనడం విడ్డూరంగా ఉంది. అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేయాలనే విషయంలో హరీష్ రావు రోల్ మోడల్. రేవంత్ రెడ్డి ఎక్కడనైనా ఉండి సమీక్ష చేస్తడు...ములుగు అడవుల్లోనైన సమీక్ష చేస్తడు. మీరు ప్రగతి భవన్ అని ప్రగతి లేని బిల్డింగ్ కడితే మేము అధికారంలోకి రాగానే గడీలు పగలగొట్టాం’ అని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. -
మిల్లా మాగిపై అసభ్య ప్రవర్తన ఆ ముగ్గురి పనేనా? ఇంతకీ ఎవరా ముగ్గురు?
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిస్వరల్డ్ పోటీలపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై హరీష్ రావు తెలంగాణ భవన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై హరీష్ రావు స్పందిస్తూ.. అందాల పోటీలు నిర్వహించడం రాక కాంగ్రెస్ నేతలు తెలంగాణ పరువు తీశారని అన్నారు. రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే ఎంపీ, కార్పొరేషన్ ఛైర్మన్, ఐఏఎస్ అధికారి మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ పట్ల అసభ్యకరంగా,అభ్యంతరకరంగా ప్రవర్తించారని వార్తలొస్తున్నాయని అన్నారు. ఆ ముగ్గురు కారణంగా మిస్ ఇంగ్లండ్ అందాల పోటీల్లో పాల్గొనకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. రేవంత్కు చిత్త శుద్ది ఉంటే ఆ సీసీటీవీ ఫుటేజీ భయటపెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. -
‘తెలంగాణలో ఏపీ తరహా వ్యూహం.. బీజేపీ వదిలిన బాణమే కవిత’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేయని వ్యాపారం లేదు.. దోచుకోని సంస్థ లేదంటూ కాంగ్రెస్ నాయకులు మధు యాష్కీ సంచలన ఆరోపణలు చేశారు. బంగారు బతుకమ్మ పేరుతో కోట్ల రూపాయలు సంపాదించారు. తెలంగాణ జాగృతిలో 800 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ, అమిత్ షా ఆదేశాల మేరకు కవిత పనిచేస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ నాయకులు మధుయాష్కీ తాజాగా మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ..‘బీజేపీ వదిలిన బాణమే కవిత. ఒక మహిళగా రాష్ట్రంలోనే కాదు.. ఢిల్లీలో కూడా ఆమె కుంభకోణం చేశారు. తన అవినీతిని కప్పి పుచ్చుకోవడానికే కొత్త డ్రామాకు తెర లేపారు. తెలంగాణ జాగృతిలో భారీ స్కాం జరిగింది. జాగృతిపై విచారణ జరపాలి. రాజీవ్ ప్రతాప్ రుడి పదవి పోవడానికి జాగృతి సంస్థ కారణం. జాగృతి సంస్థ అవినీతిలో కూరుకుపోయింది.తెలంగాణలో చనిపోయిన రైతులకు ఆర్థిక సహాయం చేస్తామని కార్పొరేట్ సంస్థల దగ్గర జాగృతి డబ్బులు వసూలు చేసింది. జాగృతి దోపిడీకి అన్ని కార్పోరేట్ సంస్థలు బలయ్యాయి. కవిత మాఫియా డాన్. ఆమె చేయని వ్యాపారం లేదు.. దోచుకోని సంస్థ లేదు. కవిత ఏ వ్యాపారం చేసిందని జూబ్లీహిల్స్లో రెండు వేల కోట్ల ఆస్తులు వచ్చాయి. మోదీ, అమిత్ షా ఆదేశాల మేరకు కవిత పనిచేస్తుంది. బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ పొందాలనుకుంటుంది.. అందుకే కవితను రంగంలోకి దింపింది. లిక్కర్ కేసు నుండి బయటపడటం కోసం కవిత బీజేపీకి పనిచేస్తోంది.అవినీతి సొమ్ము దాచుకోవడానికే జాగృతి బలోపేతం అంటుంది. బీసీలకు న్యాయం చేస్తా అన్న కవిత.. జాగృతికి ఎందుకు అధ్యక్షురాలిగా ఉంది. జాగృతి అధ్యక్షురాలిగా బీసీ, ఎస్సీ, ఎస్టీకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు. నిస్వార్థంగా తెలంగాణ కోసం పనిచేసింది జయశంకర్.. కేసీఆర్ కాదు. ముఖ్యమంత్రి పదవి కోసమే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో చేరాడు. పదేళ్లు కేసీఆర్ కుటుంబం దోపిడిలో ఏంతో మంది బలయ్యారు. ఎంపీ సంతోష్ ఇప్పుడు ఎందుకు చెట్లు నాటడం లేదు.. పదేళ్లు చెట్ల పేరుతో సంతోష్ కోట్ల రూపాయలు దోచుకున్నాడు. కేటీఆర్కు అమెరికాలో పెట్టుబడులు ఉన్నాయి. వాటి లెక్కలు చూసుకోవడానికే కేటీఆర్ అమెరికాకు వెళ్లారు. ఏపీ తరహా వ్యూహాన్ని బీజేపీ తెలంగాణలో అమలు చేస్తుంది. ఏపీలో టీడీపీ, బీజేపీ తిట్టుకున్నాయి.. ఎన్నికల నాటికి రెండు కలసి పోటీ చేశాయి. తెలంగాణలో కూడా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
‘అమరవీరుల మీద ఒట్టు.. తెలంగాణను అభివృద్ధి చేస్తాం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రెండు పార్టీలు తెలంగాణ నిధులను దుర్వినియోగం చేశాయని మండిపడ్డారు. కేసీఆర్ నీళ్ల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని అన్నారు. నాడు రేవంత్ రెడ్డి.. సోనియా గాంధీని తెలంగాణ దెయ్యం అన్నారు.. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగానే దేవత అంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తాం. తెలంగాణను 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు. ఇది కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పాపం కాదా!. తెలంగాణకు పట్టిన శని బీఆర్ఎస్, కాంగ్రెస్. దోపిడీ, దగా, మోసం చేయడంలో దొందుదొందే. తెలంగాణను దోచుకుంటున్న పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్.తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరముంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ను పాతర వేయాల్సిందే. తెలంగాణను అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను బీజేపీ తీసుకుంటుంది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు తెలంగాణ నినాదానికి కట్టుబడిన పార్టీ బీజేపీ. తెలంగాణ ఉద్యమానికి కొంతమంది వెన్నుపోటు పొడిచారు. కేసీఆర్ నీళ్ల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారు. తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ తెలంగాణ కోసం ఇతర పార్టీలతో కలిసి పోరాటం చేసింది. 11 ఏళ్ల పాలన తర్వాత తెలంగాణ ప్రజలు ఆత్మపరిశీలన చేసుకోవాలి.బంగారు తెలంగాణ ఎక్కడ?. కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తా అన్నారు. ఆయన కుటుంబం మాత్రం అయ్యింది. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలా దోచుకున్నారు. నాడు దెయ్యం.. నేడు దేవత అయ్యిందా?. నాడు రేవంత్ రెడ్డి.. సోనియా గాంధీని తెలంగాణ దెయ్యం అన్నారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగానే దేవత అంటున్నారు. సకల జనుల సమ్మె పేరుతో ఉద్యమించిన వారి మీద, అమరవీరుల మీద ఒట్టేసి చెబుతున్నాను. తెలంగాణను అభివృద్ధి చేసి చూపిస్తాం’ అని హామీ ఇచ్చారు.బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ..‘రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్కు వచ్చి తెలంగాణకు సపోర్ట్ చేశారు. సుష్మా స్వరాజ్ తెలంగాణ బిడ్డలారా చనిపోకండి మీకు అండగా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చారు. ఇంకా రాజకీయం చేయొద్దు పిల్లలు చనిపోతున్నారు బిల్లు పెట్టండి అని చెప్పింది బీజేపీనే. ఈ నీళ్ళు, నిధులు, నియామకాల కోసం యువకులు పోరాటం చేశారు. కానీ, తెలంగాణ కాంగ్రెస్ నేతృత్వంలో తిరోగమన దిశలో తెలంగాణ పోతుంది. తెలంగాణ తన గొప్పదనం చాటి చెప్పాలంటే బీజేపీతోనే సాధ్యం’ అని అన్నారు. -
అమరుల త్యాగాలను మనం గుర్తుచేసుకోవాలి: కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాటం, రాజకీయ పటిమతో తెలంగాణ వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణ అమరవీరులకు కనీసం నివాళులు కూడా అర్పించడం లేదని మండిపడ్డారు.తెలంగాణ జాగృతి కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..‘జాగృతి కొత్త కార్యాలయంలో మొదటి సారి జెండా ఎగురవేసినం. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తల్లులు బిడ్డలను కోల్పోయారు. అది మనం గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ పోరాటం రాజకీయ పటిమ తో తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఉన్న నాయకత్వం కనీసం జై తెలంగాణ అని కూడా అనడం లేదు. అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం నివాళులు కూడా అర్పించడం లేదు. అమరవీరులకు నివాళులు అర్పించే వరకు మా జాగృతి పోరాటం చేస్తుంది’ అని వ్యాఖ్యలు చేశారు. -
వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలి
కవాడిగూడ (హైదరా బాద్): కేంద్ర ప్రభు త్వం ఇటీవల తీసుకు వచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవా లని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 2025ని వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్లా బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద పెద్ద ఎత్తున ధర్నా, భారీ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా ఎంఐఎం శాసన సభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్లా బోర్డు అధ్యక్షుడు మౌలానా సయిపుల్లా రహమానీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, పర్సనల్లా బోర్డు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ మత పెద్దలు ఈ ఉద్యమాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.దీనికి ఎంఐఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, అదే విధంగా ముస్లిం సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. పర్సనల్లా బోర్డు అధ్యక్షుడు మౌలానా సయిపుల్లా రహమానీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని, ముస్లింల వ్యక్తిగత హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులు, ఆదివాసీలు, ముస్లిం మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ఓ కుటుంబ డ్రామా నడుస్తోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పుడు ఓ కుటుంబ డ్రామా నడుస్తోందని, అధికారంలో ఉన్నప్పుడు దండుకున్న సొమ్మును పంచుకోవడంలో తలెత్తిన గొడవలే ఇందుకు కారణమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలు చేసి దోచుకున్న ఆస్తుల కోసం జరుగుతున్న గొడవల్లో మనం పాత్రధారులం కావాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కేంద్రంలో మూడుసార్లు అధికారంలోకి వచి్చన ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో మచ్చలేని పాలన సాగిస్తోందన్నారు. మోదీ పాలనపై ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమన్నారు. విద్యుత్, ఎరువులు, రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమా? అని కాంగ్రెస్కు సవాలు విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలన్నారు. రాహుల్ గాం«దీకి దేశ చరిత్ర తెలియదని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. బీజేపీ జిల్లా, మండల పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. వర్క్షాప్కు పలువురు డుమ్మా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్షాప్కు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరయ్యారు. మొత్తం 11 మంది ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల్లో కేవలం నలుగురు మాత్రమే హాజరయ్యారు. పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఆర్.కృష్ణయ్య, కొండా విశ్వేశ్వర్రెడ్డి, రఘునందన్రావు హజరయ్యారు. ఎంపీ కె.లక్ష్మణ్ నిజామాబాద్ పర్యటనలో ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు అర్వింద్, గోడెం నగేశ్ గైర్హాజరయ్యారు. -
కిషన్రెడ్డితో సఖ్యత లేదా?.. బీజేపీలో ఏం జరుగుతుంది?
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీలో నివురుగప్పిన నిప్పులో ఉన్న వర్గ పోరు ఇప్పుడు బయటపడిందా?, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డితో కొంతమంది నేతలకు పొసగడం లేదా?, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో పుంజుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఇప్పుడు కొత్త తలనొప్పులు వచ్చాయా? అంటే అవుననక తప్పదు.ఈ రోజు(ఆదివారం, జూన్ 1వ తేదీ) నగరంలోని రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ వర్క్ షాపు చెప్పుకునేంత స్థాయిలో జరగలేదనేది అక్కడ హాజరైన నేతల తీరును బట్టే అర్థమవుతోంది. తప్పని సరిగా ఈ వర్క్ షాపుకు హాజరుకావాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఆదేశాలున్నా కొంతమంది నాయకులు వాటిని బేఖాతరు చేశారు. ‘ఆ మీటింగ్ కు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి?’ అన్న చందంగా వ్యవహరించారు. మెజార్టీ ప్రజాప్రతినిధులుకిషన్రెడ్డి అధ్యక్షతన జరిగిన వర్క్ షాపుకు హాజరుకాకపోవడంతో పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. పైకి ఎటువంటి విభేదాలు లేవనే సంకేతాలిస్తున్నప్పటికీకిషన్రెడ్డి సారథ్యంలో జరిగిన కీలక సమావేశానికి అత్యధిక సంఖ్యలో ప్రజా ప్రతినిధులు హాజరుకాకపోవడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.ప్రధానంగా దీనికి ఎంపీలు ఈటెల, డీకే అరుణ, ఆర్ కృష్ణయ్య, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ లు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయానికొస్తే కీలకమైన నేతలు ఇందుకు హాజరు కాలేదు. పదకొండు మంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు గాను మొత్తంగా నలుగురు మాత్రమే హాజరయ్యారు.ఎంపీల్లో లక్ష్మణ్ నిజామాబాద్ పర్యటనలో ఉండగా, ధర్మపురి అరవింద్, గోడం నగేశ్ లు వర్క్ షాపుకు దూరంగా ఉన్నారు. ఇక బండి సంజయ్ కరీంనగర్ పర్యటనలో ఉండగా, బీజెఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నిర్మల్ పర్యటనలో ఉన్నారు. ఇలా పలువురు కీలక నేతలు దూరంగా ఉండటంతో పార్టీ భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పన ఎలా జరుగుతుందనే అంశం బీజేపీలో చర్చనీయాంశమైంది. ఇదీ చదవండి:‘ప్రజల వద్దకు వెళ్లాలి.. మోదీ పాలనను వివరించాలి’ -
‘ప్రజల వద్దకు వెళ్లాలి.. మోదీ పాలనను వివరించాలి’
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలోని ప్రజలకు నీతివంతమైన పాలన అందించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 11 ఏళ్లుగా మోదీ పాలన అనేది ఎంతో పారదర్శకతతో సాగుతుందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వర్క్ షాపులో బీజేపీ శ్రేణులను ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘ మనం ప్రజల వద్దకు వెళ్లాలి. 11 ఏళ్ల మోదీ పాలనను ప్రజలకు వివరించాలి. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలి. నీతివంతమైన పాలన అందించాం. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. గత యూపీఏ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కుంభకోణాలు జరిగాయి.రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం ముందుకు పోతుంది. వన్ నేషన్ వన్ రేషన్ దేశంలో అమలు చేస్తున్నాం. ఉగ్రవాద రహిత దేశంగా చేసేందుకు మోదీ చర్యలు తీసుకుంటున్నారు. ఉగ్రవాదుల స్థావరాలను ఎలా ధ్వంసం చేశామో అందరూ చూశారు. మోదీ ఆధ్వర్యంలో నయా దేశంగా భారత్13 వందల రైల్వే స్టేషన్ లను దేశంలో ఆధునీకరణ చేస్తున్నాం. వ్యాపార, వాణిజ్య, విద్యుత్ రంగుల్లో ఘనమైన అభివృద్ధి సాధించాం. దేశ అభివృద్ధి పై చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ కు సవాల్బీజేపీ మహిళా పక్షపాతి పార్టీ. కుల మతాలకు అతీతంగా పని చేస్తున్న ప్రభుత్వం. బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి నక్కకు నాకలోకానికి ఉన్నత తేడా ఉంది. ఆర్మీలో స్వయం ప్రతిపతి సాధించాం. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతున్నాం. అభివృద్ధి చెందిన దేశాల సరసన నిల్పాలన్నదే మోదీ లక్ష్యం. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. 10 లక్షల కోట్ల అప్పులు.. Brs, కాంగ్రెస్ రెండు కలిసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయి.తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి వికేంద్రీకరణ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి కేంద్రీకృతం. ప్రజా సమస్యల పై చిత్తశుద్ధితో పని చేస్తున్న పార్టీ బీజేపీ. బీజేపీ తప్పా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ పార్టీ కాపాడలేదు’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. -
మొన్నటి కాంగ్రెస్ కమిటీల్లో నా పేరు లేదు అంటే..: విజయశాంతి
హైదరాబాద్: ఇటీవల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి కనబడుతోంది. తాము సీనియర్లమైనా తమకు ఈ కమిటీల్లో అవకాశం ఇవ్వలేదని లోలోన మదనపడుతున్నారు పలువురు కాంగ్రెస్ నాయకులు. ఇప్పటివరకూ దీనిపై నేరుగా ఏ కాంగ్రెస్ నేత నేరుగా విమ ర్శలు చేయకపోయినా ఈ కమిటీల్లో తమను ఎంపిక చేసి ఉండి ఉంటే బాగుంటుందనేది వారి అభిప్రాయంగా ఉంది. కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు అంశం తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా తనకు ఈ కమి టీల్లో ఏ పదవి ఇచ్చినా ఓకే అంటూ స్ప ష్టం చేశారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయశాంతి మీడియాతో చిట్ చాట్ లో.. ‘సరైన సమయంలో సరైన వ్యక్తులకు పదవులు వస్తాయి. ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో అధిష్టానికి తెలుసు. మొన్నటి కమిటీలలో నా పేరు లేదు అంటే.. మరో కమిటీలో అవకాశం ఉంటుందేమో’ అనే ఆశాభావం వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ విజయశాంతి కూడా కమిటీలో తనను ఎంపిక చేసే ఉంటే బాగుండేదని పరోక్షంగా సంకేతాలిచ్చారు.కాగా, రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ ఆమోదం తెలిపిన సంగతి విదితమే. పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీలతో పాటు డీలిమిటేషన్, పీసీసీ క్రమశిఓణ కమిటీలకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.22 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, అడ్వైజరి కమిటీలో 15 మందికి చోటు కల్పించారు. 16 మందితో ఏర్పాటయ్యే సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీలో మొత్తం ఏడు మంది సభ్యులను నియమించారు. ఇలా పలు కమిటీలకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది.పీఏసీ(పొలిటికల్ అఫైర్స్ కమిటీ)లో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్రెడ్డిలు, ఇక అడ్వైజరీ కమిటీలో రేవంత్, జానారెడ్డి, మధుయాష్కీ, గీతారెడ్డిలు ఉండనున్నారు. డీలిమిటేషన్ కమిటీ చైర్మన్ గా వంశీచందర్ రెడ్డి నియమించారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మల్లు రవి, 16 మందితో ఏర్పాటయ్యే సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్గా పి. వినయ్ కుమార్లను నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. -
సీఎం రేవంత్కు ఎమ్మెల్సీ కవిత లేఖ
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. జీహెచ్ ఎంసీలో మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్ స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారు.ఒక విదేశీ సంస్థకు చెందిన వాహనాలు మాత్రమే ఈ పనుల కోసం వినియోగించేలా నిబంధనలు రూపొందించారుఆ సంస్థకు హైదరాబాద్ రెండు షోరూములు మాత్రమే ఉన్నాయి. ఆ షోరూమ్ల నిర్వాహకులు తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లతో ఎంఓయూ చేసుకునేందుకు ససేమిరా అంటున్నారు. తెలంగాణ కాంట్రాక్టర్లు కర్నాటక షోరూమ్ల డీలర్ల నుంచి ఎంవోయూలు తెచ్చుకున్నా వాటి ఫిజికల్ కాపీలు తక్కువ వ్యవధిలో తెచ్చి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు.ఇప్పటి వరకు జీహెచ్ ఎంసీలోని 150 వార్డులకు వేర్వేరుగా టెండర్లు పిలిచేవారు.. ఇప్పుడు తొమ్మిది జోన్ల వారీగా మాత్రమే టెండర్లు పిలవడంతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం వాటిల్లుతోంది. అధికారులు పేర్కొన్న స్పెసిఫికేషన్స్ కూడిన వాహనాల్లో ఒక క్యూబిక్ మీటర్ మెటీరియల్ కూడా తరలించడం సాధ్యం కాదు. గతంలో ఇందుకు వినియోగించిన వాహనాల్లో రెండు నుంచి మూడు క్యూబిక్ మీటర్ల మెటీరియల్ తరలించే వారు.అధికారులు ఒక సంస్థకు, రెండు కాంట్రాక్టు ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చడంతో ఒక్కో ఏడాదికి రూ.5.85 కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ టెండర్లను వెంటనే రద్దు చేసి.. గతంలో మాదిరిగా వార్డుల వారీగా టెండర్లు పిలిస్తే 150 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి లభిస్తుంది. మున్సిపల్ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్రెడ్డి తన శాఖలో జరుగుతోన్న అక్రమాలపై దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టాలి’ అని డిమాండ్ చేస్తూ లేఖలో పేర్కొన్నారు. -
కేసీఆర్కు నోటీసులు ఎందుకిచ్చారు?
బంజారాహిల్స్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఎందుకిచ్చారు? కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను సస్యశ్యామలం చేసినందుకా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని బంజారాహిల్స్ రోడ్ నెం.14లో శనివారం ప్రారంభించిన అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘గోదావరిలో 200 టీఎంసీల నీటి హక్కు తెలంగాణకు ఉండాలని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని తెలిపారు. ఏటా 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినందుకు కేసీఆర్కు నోటీసులు ఇచ్చారా? రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టినందుకు నోటీసులు ఇచ్చారా ? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీసులు ఇచ్చారా? అది కాళేశ్వరం కమిషనా? కాంగ్రెస్ కమిషనా?’అని ప్రశ్నించారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీచేయడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ సోయితో కేసీఆర్ పరిపాలన చేశారని, సీఎం రేవంత్రెడ్డి కనీసం జై తెలంగాణ అనకపోవడం మన ఖర్మ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనాలని, అమరులకు నివాళులర్పించాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ అననివారికి, అమర వీరులకు నివాళులులర్పించని వారికి సీఎం కుర్చీలో కూర్చొనే అర్హత లేదని అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం పేరు మార్చి అమరులు శ్రీకాంతాచారి, యాది రెడ్డి, కాళోజీ, పీవీ నరసింహారావులలో ఎవరిదో ఒకరి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. బనకచర్లపై రేవంత్రెడ్డి ఎందుకు మాట్లాడరు?ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ నీటిని తరలించుకుపోయే ప్రణాళిక వేస్తుంటే సీఎం రేవంత్ కనీసం స్పందించడం లేదని కవిత విమర్శించారు. జూన్ 2న సీఎం ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లును డీప్ఫ్రిడ్జ్లో పెట్టే ప్రయత్నం చేస్తే బీజేపీకి సెగ తాకే విధంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేవరకు పోరాటం చేస్తా మన్నారు. జాగృతిలో ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ విభా గాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ విభా గాన్ని ఏర్పాటుచేసి ఆ వర్గాల కోసం ఉద్యమిస్తామని వెల్ల డించారు. కేసీఆర్కు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే.. మరో కన్ను తెలంగాణ జాగృతి అని పేర్కొన్నారు. -
‘సీఎం రేవంత్ ఇప్పటికైనా జై తెలంగాణ అని అనాలి’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మరోసారి మండిపడ్డారు. ఇప్పటివరకూ సీఎం రేవంత్.. జై తెలంగాణ అనే నినాదాన్నే పలకలేదని కవిత ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అని నినదించాలి అని డిమాండ్ చేశారు కవిత. తెలంగాణ ప్రజలపై రేవంత్ అక్కసు ఎందుకని ప్రశ్నించారు కవిత. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడిన కవిత.. రేవంత్ తెలంగాణ నినాదాన్ని ఇప్పటివరకూ పలకలేదన్నారు.గోదావరి జలాలు శాశ్వతంగా తెలంగాణకు దూరం కాబోతున్నాయని కవిత పేర్కొన్నారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్.. కాళేశ్వర కమిషనా.. లేక కాంగ్రెస్ కమిషనా అనే అనుమానం ఉందన్నారు.తెలంగాణ ప్రతి ఉద్యమంలో జాగృతి సంస్థ భాగమైందని, 18 ఏళ్ల క్రితమే జాగృతి సంస్థను స్థాపించామన్నారు. కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో జాగృతి సంస్థను ఏర్పాటు చేశామన్నారు కవిత. కవిత ఏమన్నారంటే..తెలంగాణ సోయితో కేసీఆర్ పరిపాలన చేశారు. మన కర్మ ఇప్పుడు జై తెలంగాణ అనని సీఎం పరిపాలనలో ఉంది. జూన్2 న అయిన సీఎం జై తెలంగాణ అనాలి. అమర వీరులకు నివాళులు అర్పించాలి..అని డిమాండ్ చేస్తున్న. రాజీవ్ యువ వికాసం పేరుతో కార్యక్రమం ఉండకూడదు. రాజీవ్ తెలంగాణకు ఏం సంబంధం. తెలంగాణ వాదుల పేర్లు పెట్టాలి. తెలంగాణ కోసం అమరులైన శ్రీకాంత చారి లాంటి వారి పేరు పెట్టాలి. గోదావరి కావేరీ లింక్ పేరుతో గోదావరి నీరు తెలంగాణ కు దూరం కాబోతున్నాయి. 200 TMC నీళ్ల హక్కు కోసం cm మాట్లాడారు. నీళ్ళ హక్కుల కోసం పోరాటం చేయాలి..Kcr కు ఎందుకు నోటీసు లు ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ లేక కాంగ్రెస్ కమిషనా?, జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద జూన్ 4 న మహా ధర్నా చేపడుతున్నాం..కాంగ్రెస్ కాళేశ్వరం పై కుట్రలను ఎండగడుతున్నాం.. బిజెపి బీసీ బిల్లును డీ ఫ్రీజ్ లో పెట్టే ప్రయత్నం చేస్తే జాగృతి తరుపున మళ్ళీ పోరాటం చేస్తాం. విద్యార్థులు, మహిళల కోసం, మైనార్టీల కోసం ఇచిన హామీల అమలు కోసం పోరాటం చేస్తాం. కెసిఆర్కి బీఆర్ఎస్ ఒక కన్న అయితే మరో కన్ను జాగృతి.. బిజెపికి 8 ఎంపీల ఉంటే ఒక్క అంశం గురించి మాట్లాడారు.. బిజెపికి కాంగ్రెస్కి జాగృతి సత్తా ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తాం’ అని కవిత హెచ్చరించారు. -
సెల్ఫోన్ టార్చ్తో ట్రీట్మెంట్పై హరీష్రావు ఫైర్
హైదరాబాద్, సాక్షి: జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో(Zaheerabad Govt Hospital Incident) సెల్ ఫోన్ వెలుతురులో వైద్యం చేసిన ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు(Harish rao) స్పందించారు. పాలన పడకేసిన రాష్ట్రంలో చివరకు ఇలాంటి దుస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారాయన.ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ పని చేయదు.. చివరకు సెల్ ఫోన్ లైట్ వెలుతురులో(Cell Phone Torch Treatment) చికిత్స చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఎక్స్లో ఆయన ఓ పోస్ట్ చేశారు.రోజుకు 300కు పైగా పేషెంట్లు వచ్చే జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా(Zaheerabad Area Hospital) ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇతర ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉన్నట్లు అని ప్రశ్నించారు. ఏడాదిన్నరగా పాలన పడకేసిందని, పేదలకు వైద్యం అందకుండా పోతున్నది అన్నారాయన. ‘‘సీఎం రేవంత్ రెడ్డి గారూ.. గాలిలో మెడలు కట్టడం మానేసి, కనీస సౌకర్యాలు కల్పించండి’’ అని రేవంత్ను ట్యాగ్ చేస్తూ హరీశ్రావు పోస్ట్ చేశారు.ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ పని చేయదు. చివరకు సెల్ ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స చేయాల్సిన దుస్థితి.300 పైగా పేషెంట్లు వచ్చే జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇతర ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉన్నట్లు.ఏడాదిన్నరగా… pic.twitter.com/rm1o4SKaXS— Harish Rao Thanneeru (@BRSHarish) May 31, 2025 -
కవిత లేఖ, రేవంత్పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు భారత సైనికులను కించపరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఆర్మీ ఛీప్ మీద మీకు విశ్వాసం లేదా? అని ప్రశ్నంచారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవిత లేఖపై కాంగ్రెస్ చర్చ అంతా ఒక డ్రామా అంటూ వ్యాఖ్యలు చేశారు.వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల మృతి చెందుతున్నాయి. శుక్రవారం ఎనిమిది కోడెలు, శనివారం ఐదు కోడెలు మరణించాయి. ఈ అంశమై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కోడెలను రక్షించాల్సిన బాధ్యత రాజన్న దేవస్థానానిదే. కోడెలను రక్షించడానికి సరైన ప్రణాళికలు రూపొందించాలి. కోడెల గదుల సంఖ్య పెంచాలన్నారు.మరోవైపు.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బండి సంజయ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు భారత సైనికులను కించపరిచే విధంగా ఉన్నాయి. ఆర్మీ ఛీప్ మీద మీకు విశ్వాసం లేదా?. పెహల్గాం ఘటన జరిగిన పదిహేను రోజుల్లోనే ఉగ్రవాదులను చంపాం. ఉగ్రవాదం అంతమయ్యే వరకు యుద్ధం కొనసాగుతుంది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది. పీవోకేను కాంగ్రెస్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు?.కవిత లెటర్పై చర్చ అంతా కాంగ్రెస్ డ్రామా. బీఆర్ఎస్, బీజేపీలు ఎప్పుడూ కలిసే ప్రసక్తే లేదు. కవిత అరెస్టును ఆపడానికి బీజేపీతో కలవాలని చూసినప్పుడే దగ్గరకు రానివ్వలేదు. కాంగ్రెస్ ప్రొడక్షన్లో జరిగిందే కవిత లేఖ. బీఆర్ఎస్ అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ మేము. మేము వారిని దగ్గరికి రానివ్వం. ఎంపీ ఈటల రాజేందర్, హరీష్రావు కలిశారన్న విషయం నేను వినలేదు. దీనిపై ఏం మాట్లాడలేను అని స్పష్టం చేశారు. -
‘కాంగ్రెస్కు ముని మనవడు వయస్సున్న పార్టీ మీది’’
హైదరాబాద్: గాంధీ కుటుంబం గురించి బీజేపీ నేతలు తప్పుగా మాట్లాడుతున్నారంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. నిజాయితీ, నీతి, త్యాగం, ప్రేమ కల్గిన గాంధీ కుటుంబం నుంచి వచ్చిన ఒక నేత రాహుల్ గాంధీ అని జగ్గారెడ్డి అన్నారు. అటువంటి వారిపై బీజేపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడటం తగదన్నారు. బీజేపీ ఎంపీ రఘనందన్ రావుకు గౌరవం ఇస్తానని, కానీ ఆయన లిమిట్స్ దాటి మాట్లాడుతున్నారంటూ హెచ్చరించారు. కిషన్ రెడ్డి మొట్టికాయలకు రఘునందన్ మైండ్ బ్లాండ్ అయ్యిందని ఎద్దేవా చేశారు జగ్గారెడ్డి. సర్దార్ పటేల్ మావాడు అంటుంన్నారు...‘1885 లో కాంగ్రెస్ ఆవిర్బవించింది... బీజేపీ పుట్టింది 1980. కాంగ్రెస్ చరిత్రకు బీజేపీ చరిత్రకు వంద ఏళ్ళ తేడా ఉంది. బీజేపీ పుట్టి కేవలం 45 ఏళ్ళు అయింది. కాంగ్రెస్కు ముని మనవడు వయస్సున్న పార్టీ మీది. మోతీలాల్ నెహ్రూ , జవహర్ లాల్ నెహ్రూ , ఇంధిరా గాంధీ ... వీరంతా స్వాతంత్ర్యానికి ముందు పుట్టిన వారే. మోదీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ,రణమఘునందన్ రావు స్వాతంత్యం తర్వాతే పుట్టారు. రఘనందన్ రావు చరిత్ర తెలుసుకో... రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. చరిత్ర పై చర్చ చేసే దమ్ము ఉందా?, గాంధీ కుటుబం ఏలిన రోజు... బీజేపీ లో ఇప్పుడు విమర్శిస్తున్న వారు ఇంకా పుట్టలేదు. స్వాతంత్ర్య వచ్చిన నాడు పరిస్థితులు ఎలా ఉండెనో ఎవరికి తెలుసు.నెహ్రూ ప్రధాని అయిన తర్వాత 545 సంస్థానాలకు భారత్లో విలీనం చేశారు. మీకు ఎవరు దిక్కు లేక సర్దార్ పటేల్ మావాడు అంటుంన్నారు. కాశ్మీర్ను కాపాడింది నెహ్రూనే..కాశ్మీర్ భారత్ నుంచి విడిపోకుండా నెహ్రూ కాపాడాడు. బీజేపీ నేతలకు ఆదిత్య 369 సినిమా లోలాగ టైం మిషన్ లో వందేళ్లు వెనక్కి తీసుకుపోవాలి. బీజేపీకి ఎజెండా లేదు... కాంగ్రెస్ సముద్రం లోని ఓక బిందె నీళ్లు తీసుకొని జీవిస్తున్నారు. ఆ బిందెడు నీల్లే సర్దార్ వల్లబాయి పటేల్’ అంటూ జగ్గారెడ్డి పేర్కొన్నారు.గాంధీ భవన్ అటెండర్ పోస్ట్ ఇచ్చినా పనిచేస్తాకొత్త కమిటీ ల కూర్పు చాలా అద్బుతంగా ఉంది. సామాజిక న్యాయం ప్రాధాన్యత ఇచ్చారు. పీఏసీ కమిటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు పెడితే అయిపోతుండే. జగ్గారెడ్డికి ఏ కమిటీలో ఇచ్చినా సంతోషమే. గాంధీ భవన్ అటెండర్ పోస్ట్ ఇచ్చినా పనిచేస్తా. జానారెడ్డి ఉన్న కమిటీ లో నాకు అవకాశం ఇచ్చారంటే నాకు ప్రమోషన్ ఇచ్చినట్లే.’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
త్వరలోనే ఆ బండారాన్ని ఆధారాలతో బయటపెడతా: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీసినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అంటూ మాజీ మంత్రి హరీష్రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని అసమర్థ రేవంత్ సర్కారు.. హిమాచల్ ప్రదేశ్ లో హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అనే సామెతను గుర్తు చేస్తోంది’’ అంటూ హరీష్రావు ట్వీట్ చేశారు.అప్పులు పుట్టడం లేదని, తమను ఎవరు నమ్మడం లేదని ప్రతీ వేదిక మీద తన చేతకాని తనాన్ని ప్రదర్శిస్తున్న రేవంత్రెడ్డి.. 6,200 కోట్ల రూపాయలతో హిమాచల్ ప్రదేశ్లో తెల్ల ఏనుగు లాంటి హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి టీజీ జెన్కోను రంగంలోకి దింపడం ఇంకో తుగ్లక్ చర్య తప్ప మరొకటి కాదు. హిమాచల్లో హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి మోసర్ బేర్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీ పారిపోయినా, ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వరంగ కంపెనీ 3 ఏండ్ల తర్వాత సాధ్యం కాదని వదిలేసిన 510 మెగావాట్ల ప్లాంట్ని కట్టేందుకు టీజీ జెన్ కో ఒప్పందం ఎందుకు చేసుకుందో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అంటూ హరీష్రావు డిమాండ్ చేశారు.‘‘రెండు దశాబ్దాల కాలంలో ఒక్కరు కూడా కట్టేందుకు ముందు రాని ప్రాజెక్ట్ను ఎందుకు నేడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టవలసి వస్తోంది?. డీపీఆర్ లేకుండానే తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రభుత్వంతో ఎంవోయు చేసుకొని అప్ ఫ్రంట్ ప్రీమియం కింద 26 కోట్ల రూపాయలు చెల్లించి మరో 26 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధపడడాన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి చెపుతున్న మాటలు ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికేనని తేలిపోయాయి’’ అంటూ హరీష్రావు ట్వీట్ చేశారు...2009లోనే మోసర్ బేర్ కంపెనీ 64 కోట్ల అప్ ఫ్రంట్ ప్రీమియం చెల్లించి హిమాచల్ ప్రదేశ్ లోని ప్రతిపాదిత సేలి, మియార్ లో హైడ్రో పవర్ ప్రాజెక్టులు కట్టాలని భావించింది. కానీ సాంకేతికంగా, ఆర్థికంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అనంతరం తాము చెల్లించిన 64 కోట్ల ప్రీమియంని హిమాచల్ ప్రభుత్వం తిరిగి ఇవ్వనందుకు గాను ఆ రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించింది. హిమాచల్ హైకోర్టు మోసర్ బేర్ కంపెనీకి వడ్డీతో సహా తీసుకున్న డబ్బును 2023 జనవరిలోనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీసినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు.రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని అసమర్ధ రేవంత్ సర్కారు హిమాచల్ ప్రదేశ్ లో హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అనే సామెతను గుర్తు చేస్తోంది.…— Harish Rao Thanneeru (@BRSHarish) May 30, 2025..10 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఢిల్లీలోని హిమాచల్ భవన్ ను వేలం వేసి ఆ డబ్బుని కంపెనీకి చెల్లించాలని 2024 నవంబర్ లో హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 7 నెలలకు పైగా అత్యధికంగా మంచు కురిసే ప్రాంతంలో హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ సాధ్యం కాదని 2019లో ఒప్పందం చేసుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీ కూడా చేతులు ఎత్తేసి ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాంటి అనువు కాని ప్రాంతం లో 6,200 కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాతో 510 మెగా వాట్ల హైడ్రల్ ప్రవర్ ప్రాజెక్టులకు ఎందుకు రేవంత్ రెడ్డి సర్కారు ఉబలాటపడుతుందో శ్వేతా పత్రం విడుదల చేయాలని భట్టి విక్రమార్కను డిమాండ్ చేస్తున్నాం.ఫీజిబిలిటీ రిపోర్ట్లు, డీపీఆర్ లు లేకున్నా, జెన్ కో బోర్డు ఆమోదం లేకున్నా కూడా ఎంవోయూ చేసుకొని 26 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని, అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తున్నాం. రెండు కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న గూడు పుఠాణి ఏందో గల్లీ కాంగ్రెస్ చెప్తుందా? ఢిల్లీ కాంగ్రెస్ చెప్తుందా? హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చెప్తుందా?. సాధ్యం కాదు అని 20 ఏండ్లుగా కట్టని ప్రాజెక్టును ఎవరి లాభం కొరకు, ఎవరి మెప్పు కోసం కడుతున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి.రైతు రుణమాఫీకి డబ్బు లేదంటారు.. రైతు బంధుకు డబ్బు లేదంటారు. రైతు బీమాకి డబ్బు లేదంటారు. ఆసరా పెన్షన్ కి డబ్బు లేదంటారు. మహాలక్ష్మి కింద నెలకు 2500 రూపాయలు ఇచ్చే పథకానికి డబ్బు లేదంటారు. తులం బంగారానికి డబ్బు లేదంటారు. విద్యార్థులకు ఫీ రీయింబర్స్మెంట్కి డబ్బు లేదంటారు. విద్యా భరోసాకి డబ్బు లేదంటారు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు డబ్బు లేదంటారు. ఉద్యోగుల డీఏలకు, పీఆర్సీకి దిక్కు లేదంటారు. చివరికి అప్పు కూడా పుడుతలేదు అని అన్న రేవంత్ రెడ్డికి హిమాచల్లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్కు 6,200 కోట్లు ఎక్కడ నుండి వస్తాయో చెప్పాలి. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నిర్థిష్టమైన సమాచారం మా వద్ద ఉంది. త్వరలోనే కాంగ్రెస్ అవినీతి బండారాన్ని పూర్తి ఆధారాలతో బయటపెడతాం’’ అంటూ హరీష్రావు హెచ్చరించారు. -
‘ఈటెల బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు’
హైదరాబాద్: బీఆర్ఎస్, బీజేపీ ఒప్పందాన్ని ఎమ్మెల్సీ కవిత బహిర్గతం చేశారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు. కేసీఆర్, కిషన్ రెడ్డిల లోపాయకారి ఒప్పందంతోనే బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారంటూ విమర్శలు గుప్పించారు మహేష్ గౌడ్. ముందుగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ అధినాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీలో ఎవరికి ఎంత ప్యాకేజ్ అందిందో బహిర్గతం చేయాలన్నారు మహేష్ గౌడ్. ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారని ఆరోపించారు.కాళేశ్వరం కమిషన్ నోటీసుల తర్వాత హరీష్ రావు, ఈటెల సమావేశమయ్యారని, ఈ భేటీలో ఈ భేటీ లో కేసీఆర్ తో ఈటెల ఫోన్ లో మాట్లాడారంటూ మహేష్ గౌడ్ పేర్కొన్నారు.ట్రంప్కు భయపడే యుద్ధం ఆపేశారా?ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ పై యుద్ధానికి దిగిన భారత్.. మధ్యలో యుద్ధాన్ని ఆపడానికి కారణమేంటని ప్రశ్నించారు మహేష్ గౌడ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భయపడే యుద్ధాన్ని మధ్యలో ఆపేశారా? అంటూ నిలదీశారు.‘యుద్ధంను మధ్య లో ఎందుకు ఆపారు.ట్రంప్ జోక్యం పై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు.పాకిస్థాన్- భారత్ యుద్ధంలో దేశం సాదించింది ఏంటి?, పోగుట్టుకుంది ఏంటో దేశ ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు. యుద్ధం అంటే ఇంధిరా గాంధీ గుర్తుకు వస్తారు. కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇంధిరా గాంధీ హాయాంలో జరిగాయి... కానీ ఎప్పుడూ రాజకీయం చేయలేదు’ అని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. -
రేవంత్ రెడ్డికి సంబీత్ పాత్రా చురకలు
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ సంబీత్ పాత్రా(Sambit Patra) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)ను శంకించే బదులు.. పోయి పాకిస్తాన్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించుకోవాలంటూ చురకలంటించారు. శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ విషయంలో కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి (Revanth Reddy) తదితరులు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ, ఆయన పార్టీ నేతలు.. పాకిస్తాన్లో ఎన్ని ఎయిర్బేస్లు ధ్వంసం అయ్యాయి?. ఉగ్రవాదులు ఎంతమంది చనిపోయారు? అని వాళ్లు అడగడం లేదు. కేవలం ఎన్ని రఫెల్స్ యుద్ధ విమానాలు పాక్ నేల కూల్చిందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్లో ఇప్పుడు రెండు వర్గాలు తయారయ్యాయి. ఒకటి పాకిస్తాన్కు మద్దతు తెలిపేది. రెండో వర్గం.. వీళ్ల కారణంగా భారత్కు మద్దతు గళం వినిపించలేకపోతున్నది... మీ జై హిందూ యాత్ర(Jai Hind Yatra).. పాకిస్తాన్ హింద్ యాత్రలా తయారైంది. మీరు మీ యాత్రను ఆపేస్తే మంచిది. అలాగే వెళ్లి పాకిస్తాన్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించుకోండి అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ సంబీత్ పాత్రా ఎద్దేవా చేశారు.అలాగే అఖిలపక్ష ఎంపీల బృందాన్ని.. టెర్రరిస్టులతో పోలుస్తూ(ఎంపీలు ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు.. ఉగ్రవాదులూ ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు అనే కామెంట్) జైరామ్ రమేష్ వ్యాఖ్యలు చేశారు. వాళ్లేం సరదా పర్యటనలకు వెళ్లలేదు. ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరును ప్రపంచానికి తెలియజేసేందుకే వెళ్లారు. అందులో మీ ఎంపీలు కూడా ఉన్నారనే విషయం గుర్తిస్తే మంచిది’’ అని జైరామ్ను ఉద్దేశించి సంబీత్ పాత్రా అన్నారు.ఇదిలా ఉంటే.. ఉగ్రవాదంపై పోరు, పీవోకేను తిరిగి భారత్లో విలీనం చేసే చర్యలకుగానూ కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాదు పాక్ను రెండు ముక్కలు చేయడానికి తన మద్దతు పూర్తిగా ఉంటుందని తెలిపారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబితేనే మోదీ ప్రభుత్వం యుద్ధాన్ని ఆపేసి వెనక్కి వచ్చిందన్న అంశంపై రేవంత్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.‘‘ప్రధాని మోదీ వేల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి రఫెల్ యుద్ధ విమానాల(Rafale Fighter Jets)ను కొనుగోలు చేశారు. అలాంటప్పుడు ఆ యుద్ధ విమానాల్లో ఎన్నింటిని పాక్ నేల కూల్చింది? ఈ విషయంపై చర్చ జరగదా?. వీటికి సమాధానాలు తెలియాల్సిందే’’ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో బీజేపీ చేపట్టిన తిరంగా ర్యాలీని ఆయన తప్పుబట్టారు. బీజేపీ తన చర్యలతో భారత సైనికుల్లో మనోస్థైర్యాన్ని దెబ్బ తీసిందని, ఆ పార్టీ చేపట్టిన తిరంగా ర్యాలీకి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ ‘జై హింద్ యాత్ర’ చేపడుతోందని తెలంగాణ సీఎం అన్నారు.ఇదీ చదవండి: తప్పు చేసి ఉంటేనే క్షమాపణలు చెబుతా! -
బీజేపీతో పొత్తుపెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు : ఎమ్మెల్సీ కవిత
సాక్షి,మంచిర్యాల: నాకంటూ సొంత అజెండా ఏమీలేదు. పార్టీని కాపాడుకోవాలనేది నా తపన అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి స్పష్టం చేశారు.ఎమ్మెల్సీ కవిత శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ‘నాకు సొతంత అజెండా ఏమీలేదు. పార్టీని కాపాడుకోవాలనేది నా తపన. బీజేపీలో పార్టీని విలీనం చేయొద్దనేది నా వాదన. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు. నేను జైల్లో ఉన్నప్పుడు పార్టీని బీజేపీలో కలుపుతానని అన్నారు. పార్టీని బీజేపీలో కలుపుతానంటే నేను ఒప్పుకోను. లెటర్ రాయడంలో నా తప్పేమీ లేదు. లెటర్ బయటపెట్టిన వారిని పట్టుకోండి’ అని వ్యాఖ్యానించారు.