బిగ్‌ ఈజ్‌ బ్యాక్‌: షియోమి కొత్త ఫోన్‌ | Xiaomi Mi Max 2 With 5300mAh Battery Expected to Launch in India Next Week | Sakshi
Sakshi News home page

బిగ్‌ ఈజ్‌ బ్యాక్‌: షియోమి కొత్త ఫోన్‌

Jul 11 2017 7:28 PM | Updated on Sep 5 2017 3:47 PM

ఈ నెల 18న ఎంఐ మ్యాక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌ను షియోమి భారత్‌లో లాంచ్‌ చేయబోతుందని తెలుస్తోంది.



భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న షియోమి, వచ్చే వారంలో న్యూఢిల్లీలో ఓ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ లాంచ్‌ ఈవెంట్‌ కోసం ఆహ్వానాలు సైతం పంపిస్తోంది. ఇంతకీ ఈ ఈవెంట్‌లో లాంచ్‌ చేయబోయేది ఏంటో తెలుసా. మే నెలలో చైనాలో లాంచ్‌ చేసిన ఎంఐ మ్యాక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌. ఈ నెల 18న ఎంఐ మ్యాక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌ను షియోమి భారత్‌లో లాంచ్‌ చేయబోతుందని తెలుస్తోంది. దీని ధర కూడా  సుమారు రూ.16,100గానే ఉండబోతుందట. ''బిగ్‌ ఈజ్‌ బ్యాక్‌'' అనే ట్యాగ్‌లైన్‌తో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో ఆవిష్కరించింది. దీని ప్రత్యేక ఆకర్షణ పెద్ద స్క్రీన్‌, బ్యాటరీ. ఎంఐ మ్యాక్స్‌ను పోలిన మాదిరిగానే ఎంఐ మ్యాక్స్‌ 2 డిజైన్‌ కూడా ఉంది. 
 
ఎంఐ మ్యాక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి..
6.44 అంగుళాలతో ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
5300ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఆక్టా-కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ఎస్‌ఓసీ
4జీబీ ర్యామ్‌
64జీబీ, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్లు
12ఎంపీ రియర్‌ కెమెరా
5ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా
ఎంఐయూఐ ఆధారిత ఆండ్రాయిడ్‌ నోగట్‌
4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, క్విక్ చార్జ్ 3.0.
అయితే రెండు స్టోరేజ్‌ వేరియంట్లను భారత్‌లో లాంచ్‌ చేస్తుందో లేదో ఇంకా స్పష్టంకాలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement