గుంటూరు జిల్లాలో దారుణం | unknown people attack on family over Financial transactions | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లాలో దారుణం

Nov 23 2016 12:49 PM | Updated on Oct 2 2018 5:51 PM

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

కారంపుడి: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అప్పుతిరిగి చెల్లించలేదని ఓ కుటుంబంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాలోని కారంపుడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబంపై ఆర్థిక లావాదేవీల విషయంలో కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement