రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీస్ శాఖ ప్రణాళిక
రాష్ట్ర రవాణా శాఖతో కలిసి సంయుక్త కార్యాచరణ అమలు
సాక్షి, ముంబై: నగరంలో నియమనిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ముంబై ట్రాఫిక్ పోలీసులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖతో కలిసి సంయుక్త కార్యాచరణ అమలుచేయనున్నారు. ప్రస్తుతం నగరంలో రిజిస్టర్ అయిన వాహనాల వివరాలను రవాణా శాఖనుంచి సేకరించనున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిని త్వరగా పట్టుకునేందుకు ఆస్కారముంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. నగరంలో నానాటికీ ‘హిట్ అండ్ రన్’ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ సందర్భంగా నగర కొత్త జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) బి.కె. ఉపాధ్యాయ మాట్లాడారు. సంయుక్త కార్యాచరణపై రవాణా శాఖతో కూడా చర్చలు జరుపుతున్నామన్నారు. అన్ని వాహనాలకు సంబంధించి డేటా బేస్ను తమతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరామన్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాల సమయంలో నిబంధనలు ఉల్లఘించి పారిపోయిన వారిని త్వరితగతిన పట్టుకునే వీలుంటుందని అభిప్రాయపడ్డారు.
నియమాలు పాటించని వాహనాలను పట్టుకునేందుకు ముందుగా తాము రీజినల్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం (ఆర్టీవో)ను ఆశ్రయించి తర్వాత వాహన రిజిస్ట్రేషన్ నంబర్ను తీసుకుంటామన్నారు. అంతేకాకుండా వాహన యజమాని చిరునామా తదితర వివరాలను సేకరిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియకే కనీసం రెండు రోజుల సమయం పడుతోందని తెలిపారు. కాగా, ఒకోసారి వీరు సేకరించిన చిరునామా స్పష్టంగా లేకపోవడంతో పోలీసులకు వీరిని ఛేదించడంలో చాలా సమయం వృథా అవుతోంది. కాగా, ట్రాఫిక్ విభాగంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, చాలా మంది సిబ్బంది రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారని ట్రాఫిక్ అధికారి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘మితిమీరిన వేగంతో వచ్చే వాహనాలను నిలిపేందుకు యత్నించినా వారు విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ను గాయపర్చి పారిపోతుంటారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపేవారు ఇలా మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నార’ని అన్నారు. అయితే వీరెవరనేది ఛేదించడం పోలీసులకు తలనొప్పిగా మారింది. నేరానికి పాల్పడిన వాహనాన్ని, దాని యజమానిని గుర్తించడం చాలా కష్టతరంగా మారుతోంది. దీంతో రాష్ట్ర రవాణా శాఖ తమకు వాహన వివరాలను అందజేయడం ద్వారా మార్గం సుగమం అవుతుందని అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు.
‘ట్రాఫిక్’కు రవాణా శాఖ అండ..
Published Sun, Feb 23 2014 12:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
తప్పక చదవండి
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement