'మహిళలకు చేయూతనిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారు' | sumitra mahajan speaks in nellore over swarna bharat trust | Sakshi
Sakshi News home page

'మహిళలకు చేయూతనిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారు'

Sep 4 2016 3:42 PM | Updated on Sep 4 2017 12:18 PM

'మహిళలకు చేయూతనిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారు'

'మహిళలకు చేయూతనిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారు'

మహిళలకు చేయూతనిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారని సుమిత్రా మహాజన్ చెప్పారు.

నెల్లూరు: మహిళలకు చేయూతనిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. నెల్లూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్ 15వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ...ఒలింపిక్స్లో సింధు సాధించిన ఘనతే ఇందుకు నిదర్శనమన్నారు.
 
ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు, కోచ్ గోపీచంద్లను స్వర్ణ భారత్ ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, ధర్మేంద్ర ప్రధాన్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఏపీలో పెట్రోలియం యూనివర్సిటీకి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. పెట్రో ఉత్పత్తుల కాంప్లెక్స్ను నెలకొల్పుతామని ఆయన వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement