సాక్షి ప్రతినిధి, చెన్నై: వైఎస్ఆర్ కాంగ్రెస్ సేవాదళ్ తమిళనాడు విభాగం అధికార ప్రతినిధిగా కమలాపురం లక్ష్మీ శ్రీదేవిరెడ్డిని నియమించినట్లు సేవాదళ్ జాతీయ అధ్యక్షులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ప్రకటించారు. సేవాదళ్ మహిళావిభాగం అధ్యక్షురాలిగా ఉన్న ఆమె అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు సేవాదళ్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న సైకం రామకృష్ణారెడ్డిని ఆ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు.
సేవాదళ్ బలోపేతంపై చర్చ
తమిళనాడులో వైఎస్ఆర్ సీపీ సేవాదళ్ బలోపేతంపై చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తమతో చర్చించినట్లు సేవాదళ్ తమిళనాడు విభాగం ఉపాధ్యక్షులు జకీర్హుస్సేన్, ప్రముఖనేత శరవణన్ తెలిపారు. సేవాదళ్ కార్యక్రమాలపై చర్చించేందుకు గురువారం తిరుపతికి వెళ్లి చెవిరెడ్డిని కలుసుకున్నట్లు వారు తెలిపారు. సేవా కార్యక్రమాలతో సేవాదళ్ ప్రజలకు అండగా నిలవాలని ఆయన సూచించారని అన్నారు. ముఖ్యంగా తమిళనాడులోని
సేవాదళ్ అధికార ప్రతినిధిగా శ్రీదేవిరెడ్డి
తెలుగు కుటుంబాలకు సేవాదళ్ కార్యకర్తలు చేరువ కావాలని చెప్పారని తెలిపారు. తమిళనాడు సేవాదళ్ విభాగంలో అనేక మార్పులు చేస్తున్నట్లు ఆయన వివరించారని అన్నారు. తమతోపాటు సేవాదళ్ తమిళనాడు నేత ప్రకాష్ సైతం చెవిరెడ్డిని కలిసినట్లు వారు తెలిపారు.
శ్రీదేవి కృతజ్ఞతలు:
వైఎస్ఆర్ సీపీ సేవాదళ్ తమిళనాడు విభాగం అధికార ప్రతినిధిగా తనను నియమించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలని శ్రీదేవిరెడ్డి చెప్పారు. అలాగే తన పేరును సిఫారసు చేసిన ఉపాధ్యక్షులు జకీర్హుస్సేన్, శరవణన్లకు ధన్యవాదాలని అన్నారు. 2019 నాటి ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం పీఠం ఎక్కించే వరకు అవిశ్రాంతంగా పాటుపడతానని అన్నారు. అధికార ప్రతినిధిగా పార్టీకి వన్నెతెచ్చేట్లుగా వ్యవహరిస్తానని తెలిపారు.
సేవాదళ్ అధికార ప్రతినిధిగా శ్రీదేవిరెడ్డి
Published Fri, Apr 22 2016 3:08 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
‘అర్బన్’ పోరు రూ.3.55 కోట్లు
ఇడ్లీ పిండిపైనా 18 శాతం జీఎస్టీ: అప్పిలేట్ అథారిటీ
కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్బాస్ బ్యూటీ (ఫోటోలు)
వాన నీటిలో ‘పరుపు’ ప్రయాణం.. వీడియో వైరల్
బిలియనీర్ ఫ్రాంక్ స్ట్రోనాచ్ అరెస్ట్
దెయ్యం సినిమాలో మృణాల్.. మరి ఒప్పుకొంటుందా?
సంతకం చేయండి.. మార్పు డిమాండ్ చేయండి
T20 World Cup 2024: నిప్పులు చెరిగిన సౌతాఫ్రికా పేసర్లు
పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
వయనాడ్కే రాహుల్ టాటా!
తప్పక చదవండి
- చెల్లిని కాపాడబోయి నీట మునిగిన అక్క మృతి
- ఉబ్బసం రోగులకోసం చేప ప్రసాదం
- మావోయిస్టుల ఏరివేతకు ‘జల్శక్తి’
- T20 World Cup 2024: నిప్పులు చెరిగిన సౌతాఫ్రికా పేసర్లు
- పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
- ఎర్త్ రైజ్ ఫోటోతో ప్రపంచాన్నే మార్చేసిన నాసా ఆస్ట్రోనాట్ దుర్మరణం
- పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. పోలీస్ డాగ్స్కు అరుదైన గౌరవం
- పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ ప్రయోగం
- Russia: భారతీయ వైద్య విద్యార్థుల మృతదేహాలు వెలికితీత
Advertisement