పిల్లలతో మరుగుదొడ్డి శుభ్రం చేయించారు

School Students Cleaned Bathrooms In Karnataka - Sakshi

హక్కేరి తాలూకా ప్రభుత్వ పాఠశాలలో అమానవీయం

శివాజీనగర: పాఠశాల విద్యార్థులతో మరుగుదొడ్డి శుభ్రం చేయించిన సంఘటన బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా శిరడాణ క్రాస్‌ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యార్థులను ఇతర పనులకు ఉపయోగించుకోవటం నేరమని తెలిసినా కూడా ఈ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలతో మరుగుడొడ్లు పరిశుభ్రం చేయించే సాహసానికి ఒడిగట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ కావడంతో ఉపాధ్యాయుల మెడకు చిక్కుకుంది.

జిల్లా ఉన్నతాధికారులకు విషయం తెల్సినా కూడా ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీఈఓ ఉమాదేవిని అడగ్గా పిల్లలే స్వచ్ఛందంగా వచ్చి శుభ్రం చేశారని, ఈ విషయం ఉపాధ్యాయులు, స్థానికులు చెప్పారని ఆమె సమర్థించుకున్నారు. ఈ సంఘటనకు కారకులైన ప్రధానోపాధ్యాయుడు,, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top